కుడా చెప్పిందే దిక్కు
ఏళ్లుగా చేస్తున్న కసరత్తులో భాగంగా కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ సంస్థ (కుడా) తన పరిధిలోకి వచ్చే ప్రాంతాలను కలిపి జిల్లా కేంద్రం నంద్యాల మాస్టర్ ప్లాన్ రూపొందించింది.
మున్సిపాల్టీలో అతికించిన ముసాయిదా మ్యాపులు
నంద్యాల పట్టణం, న్యూస్టుడే: ఏళ్లుగా చేస్తున్న కసరత్తులో భాగంగా కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ సంస్థ (కుడా) తన పరిధిలోకి వచ్చే ప్రాంతాలను కలిపి జిల్లా కేంద్రం నంద్యాల మాస్టర్ ప్లాన్ రూపొందించింది. దీనిపై గత నెల 15 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఎక్కడా లేని విధంగా 300కు పైగా అభ్యంతరాలొచ్చాయి. నెల క్రితం మున్సిపాల్టీ వద్ద ముసాయిదా మ్యాపులు అతికించి జనవరి నుంచి అమలు చేస్తామన్నారు. ఇప్పటి వరకు ప్రకటన ఇవ్వలేదు. కనీసం సర్వే నంబర్ల వివరాలతో కూడిన సాఫ్ట్ కాపీ మున్సిపాల్టీకి ఇవ్వలేదు. ప్రజల అభ్యంతరాలపై ఇప్పటి వరకు పట్టించుకోలేదు.
పుర అధికారులకే తెలియదు
మాస్టర్ ప్లాన్ అంటే పట్టణ స్వరూపం, విస్తరణ, భవిష్యత్తు అవసరాలు, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రూపొందించాలి. నివాసిత, వాణిజ్య, పరిశ్రమలు, చిన్న, కుటీర పరిశ్రమలు, చెరువులు, కాలువలు, నీటి వనరులు ఉన్న ప్రాంతాలతో పాటు పచ్చదనం ఉండేలా గ్రీన్ జోన్లు గుర్తిస్తారు. సర్వే నంబర్ల వారీగా అందరికీ తెలిసేలా ఉంచాలి. కొత్తగా రూపొందించిన ముసాయిదా మాస్టర్ ప్లాన్ మ్యాప్ గురించిన వివరాలు నంద్యాల మున్సిపాల్టీ టౌన్ ప్లానింగ్ విభాగంలోని అధికారులు, సిబ్బందికి తెలియడం లేదు. కేవలం మున్సిపాల్టీలో అతికించిన మ్యాపు ఆధారంగానే అంచనాలు వేయడం గమనార్హం.
ఇష్టానుసారంగా తయారీ
* మాస్టర్ ప్లాన్ రూపొందించడంలో స్థానిక భాగస్వామ్యం కచ్చితంగా ఉండాలి. కుడా కన్సల్టెంట్లు ఇస్టానుసారంగా తయారు చేశారు. ఎక్కడపడితే అక్కడ రహదారులను చూపించడం విమర్శలకు తావిస్తోంది. ఇళ్లు ఉన్న ప్రాంతాలను పరిశ్రమలు, ట్రాన్స్పోర్టు జోన్లుగా, పచ్చదనం ప్రాంతాలుగా చూపారు. వీటిని మార్చకపోతే ప్రజలకు ఇబ్బందులు తప్పవు.
* 1990లో నంద్యాల మాస్టర్ ప్లాన్ రూపుదిద్దుకుంది. అప్పటి నిబంధనల ప్రకారం 20 ఏళ్ల తర్వాత కొత్త మాస్టర్ ప్లాన్ రూపుదిద్దుకోవాల్సి ఉండగా.. గత 13 ఏళ్లుగా కన్సల్టెన్సీ ఎంపికలో ఆలస్యం కావడం, ఒప్పందం కుదుర్చుకున్న కన్సల్టెన్సీ సంస్థ వెనక్కి పోవడం, నిర్లక్ష్యం తదితర కారణాలతో 13 ఏళ్ల తర్వాత కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదా బయటకు వచ్చింది.
* ప్లాన్ రూపుదిద్దుకోవడంలో కొంత మంది పరోక్షంగా ప్రభావం చూపారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక బృందంగా కూర్చుని రూపుదిద్దుకోవాల్సిన ప్లాన్పై కొంత మంది నాయకుల ప్రభావం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇలా ఉంది తీరు
* నంద్యాల పట్టణ శివారులో ఆటోనగర్ ప్రాంతం సమీపంలోని కొంత ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా చూపారు. ఇక్కడ భారీగా వెంచర్లతో పాటు కొన్ని చోట్ల ఇళ్లు ఉన్నాయి.
* పట్టణంలోని ఆర్టీవో కార్యాలయం సమీపంలో కాలనీలు వెలుస్తున్నాయి. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ ప్రాంతాన్ని ట్రాన్స్పోర్టు ఏరియాగా పేర్కొన్నారు. ఇక్కడ భవిష్యత్తులో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు రావు. స్థలాలు ఉన్నవారు వాహనాలను పెట్టుకోవడానికి, సర్వీసింగ్ సెంటర్లు పెట్టుకోవడానికి ఇవ్వాల్సి ఉంటుంది.
* నంద్యాల పట్టణ శివార్లలోని చాబోలు-రైతునగరం గ్రామ సమీపంలోని ప్రాంతాన్ని పారిశ్రామిక జోన్గా చూపారు. ఇక్కడ వందల సంఖ్యలో ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. పెద్ద భవంతుల నిర్మాణాలు జరుగుతున్నా ఈ ప్రాంతాన్ని పారిశ్రామికవాడగా చూపడంతో విమర్శలు ఎక్కువగా వచ్చాయి.
* పబ్లిక్ యుటిలిటిస్ యూజ్ జోన్గా చెరువుకట్ట ప్రాంతాన్ని మ్యాప్లో చేర్చారు. ఇప్పటికే ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. జగజ్జననీ నగర్ ఆనుకుని పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగిపోయాయి. చెరువు కట్ట సమీపంలో నూతనంగా ఇళ్ల నిర్మాణంతో పాటు లేఅవుట్లకు భారీగా అనుమతులు ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని మరో ప్రాంతంగా ప్రస్తుతం చూపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
‘‘మద్యం కారణంగా అన్యాయానికి గురవుతున్న అక్కచెల్లెమ్మల బాధ చూడలేకున్నా.. అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యపాన నిషేధం అమలు చేస్తామని’’ 2017లో ప్రజా సంకల్ప పాదయాత్రకు చాగలమర్రికి వచ్చిన సందర్భంలో జగన్ ప్రగల్భాలు పలికారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?