ఆలయ భూముల్లో అధికార దందా
‘అధికారం’ అండతో వైకాపా నేతలు ఆలయ భూముల్లో మట్టిని తరలిస్తూ రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. గ్రామస్థులు ఆందోళన చేస్తున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.
యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
అడ్డుకుంటే కేసుల నమోదు
మట్టిని తరలించిన పొలాలను చూపుతున్న గ్రామస్థులు
ఓర్వకల్లు, కల్లూరు గ్రామీణం, న్యూస్టుడే: ‘అధికారం’ అండతో వైకాపా నేతలు ఆలయ భూముల్లో మట్టిని తరలిస్తూ రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. గ్రామస్థులు ఆందోళన చేస్తున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఓర్వకల్లు మండల పరిధిలోని శకునాలలో 155, 163 సర్వే నంబర్లలో కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయానికి 18 ఎకరాల మాన్యం భూమి ఉంది. పూజారులు ఆయా భూములు అనుభవిస్తూ ఆలయ నిర్వహణ చేపట్టాల్సి ఉంది. గ్రామానికి చెందిన రైతులకు కౌలుకు ఇచ్చి వచ్చిన సొమ్ముతో ఆలయ కార్యక్రమాలు చేపడుతున్నారు. అధికార పార్టీ నేతలు ఆయా భూముల్లో అక్రమంగా మట్టిని తవ్వేసి ఎందుకూ పనికిరాకుండా చేస్తున్నారు.
నిత్యం 70 వాహనాల్లో తరలింపు
మట్టిని తీసుకెళ్తున్న వాహనాలు
మండలంలో సౌర పరిశ్రమ ఏర్పాటు చేశారు.శకునాల గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకుగాను సదరు సంస్థ నిధులు మంజూరు చేసింది. సంబంధిత పనులకు కావాల్సిన మట్టిని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయానికి చెందిన 18 ఎకరాల్లో పొక్లెయిన్లు, టిప్పర్లు, ట్రాక్టర్లు పెట్టి తవ్వుతున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు దందా మొదలు పెట్టారు. టిప్పర్కు రూ.6,000, ట్రాక్టర్కు రూ.2,000 నుంచి రూ.2,500 వరకు అమ్ముకుంటున్నారు. టిప్పర్, ట్రాక్టర్లు కలిపి 70 వరకు వాహనాల్లో మట్టిని తరలిస్తున్నారు. పెద్దఎత్తున మట్టిని తరలించడంతో ఎందుకూ పనికిరాకుండా పోయిందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా ఐదారు అడుగులకుపైగా లోతున తవ్వి మట్టి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కల్లూరు మండల పరిధిలోని తడకనపల్లి, లక్ష్మీపురం తదితర గ్రామాల్లోనూ మట్టిని పెద్దఎత్తున తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
అధికారులు పట్టించుకోవడం లేదు
- చంద్రబాబు, శకునాల
ఆలయానికి చెందిన భూముల్లో అక్రమంగా మట్టిని తరలించి వ్యవసాయానికి పనికి రాకుండా చేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం శూన్యమే. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుని వారి ద్వారానే మట్టిని ఈ భూమిలోకి తరలించి వ్యవసాయానికి పనికి వచ్చేలా చేయాలి. గతంలో గ్రామానికి చెందిన రైతులు ఆలయ భూములను కౌలుకు తీసుకుని పంటలు సాగు చేసేవారు. ప్రస్తుతం ఇవి ఎందుకూ పనికిరాకుండా పోయాయి.
అడుగడుగునా గుంతలే
- ధర్మారెడ్డి, శకునాల
ఎంతో విలువైన భూమిని పనికిరాకుండా చేశారు. ఆలయ భూముల్లో అడుగడుగునా గుంతలే దర్శనమిస్తున్నాయి. మట్టి తరలించటంతో ఈ భూములను ఎవరూ కౌలుకు తీసుకోవటం లేదు. ఆలయ బాగోగులను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇకనైనా అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్లాస్టిక్ నివారణకు సహకరించండి
[ 24-04-2024]
శ్రీశైలం అటవీ శాఖలో ప్లాస్టిక్ నివారణకు సహకరించాలని శ్రీశైలం, నాగార్జున సాగర్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ బీఎన్ఎన్ మూర్తి అన్నారు. -
మైనారిటీల అభివృద్ధిని విస్మరించిన వైకాపా
[ 24-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల నుంచి మైనార్టీల అభివృద్ధిని విస్మరించిందని మండల ముస్లిం మైనారిటీ నాయకులు నజీర్ సాహెబ్, ఫక్రుద్దీన్, బేతాళ భలే సాహెబ్, మదీనా అన్నారు. -
తెదేపాను గెలిపిస్తే అర్హలందరికీ సంక్షేమ పథకాలు
[ 24-04-2024]
రాష్ట్రంలో తెదేపాను గెలిపిస్తే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి అన్నారు. -
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
[ 24-04-2024]
‘నా జీవితం నాశనం కావడానికి కారణం నువ్వే. మీ కుటుంబం నాకు అన్యాయం చేసింది’ అంటూ ఓ మహిళ నంద్యాల వైకాపా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి సతీమణి, కౌన్సిలర్ నాగినిరెడ్డిని నిలదీయడం తీవ్ర చర్చనీయాంశమైంది. -
కేసీ.. జగన్ నిర్లక్ష్యం చేసి
[ 24-04-2024]
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రగల్బాలు పలికిన జగన్ ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఐదువందలు కేటాయించలేదు.. కేసీ కాల్వకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూపాయి వెచ్చించలేదని శాసనసభా సాక్షిగా ‘కాగ్’ తేల్చింది.. -
గ్రామ స్వరాజ్యం.. జగనాసుర అరాచకం
[ 24-04-2024]
పంచాయతీ, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు స్థానిక ప్రభుత్వాలుగా వ్యవహరిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాల్సి ఉండగా వాటిపై జగన్ కుట్ర పన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం -
బలగం పెంచుకుని బరిలోకి!
[ 24-04-2024]
వైకాపాలో విభేదాలు... ఐదేళ్లుగా ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం.. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మల్చుకొని విజయం దిశగా వెళ్లాలని కోడుమూరు తెదేపా నేతలు వ్యూహాలకు పదునుపెట్టారు. -
డీసీసీబీ తాత్కాలిక సీఈవోపై వేటు
[ 24-04-2024]
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తాత్కాలిక ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) శివలీలపై వేటు పడింది. -
కోట్ల గూటికి పాత నేతలు
[ 24-04-2024]
ఇన్నాళ్లు పార్టీని ఉపయోగించుకొని వీడిన వారికి తాము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా రిటర్న్గిఫ్ట్ ఇస్తామని అధికారపార్టీ నేత హెచ్చరికలు ‘డోన్’ నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి.. -
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయం
[ 24-04-2024]
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయమని ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ అన్నారు. మండలంలోని తంగడరడోణ, తుర్వగల్లు, తొగలగల్లు, యాటకల్లు, కల్లపరి, చొక్కనహళ్లి, శంకరబండ తదితర గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగనన్న వెన్నుపోటు.. పల్లెల తిరుగుబాటు
[ 24-04-2024]
ప్రస్తుతం పల్లెలు కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్నాయి. జగన్ ప్రభుత్వం నిర్వాకంతో సమస్యలతో సతమతమవుతున్నాయి. కనీసం కుళాయి బిగించేందుకు కూడా చిల్లర లేని పరిస్థితి. కేంద్రం నుంచి వచ్చే నిధులను సైతం మళ్లించి.. -
పాణ్యం ఎన్నికల్లో ప్రముఖం
[ 24-04-2024]
పాణికేశ్వరస్వామి పేరుతో పాణ్యం గ్రామం ఏర్పడింది. కాలక్రమేణా నియోజకవర్గంగా మారింది. కర్నూలు, నంద్యాల మధ్య వారధిగా ఉన్న పాణ్యం నియోజకవర్గం అత్యంత కీలకం. జిల్లాలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం కావడం విశేషం. -
పుస్తక పుటలకు జగనన్న చెద
[ 24-04-2024]
గ్రంథాలయాల్లో పాఠకుల్ని సమస్యలు వేధిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. పాఠకులకు కొత్త పుస్తకాలు అందుబాటులో ఉండటం లేదు. -
కాటసాని ఆస్తులు రూ.75.19 కోట్లు
[ 24-04-2024]
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.75.19 కోట్లుగా చూపారు. సోమవారం నామినేషన్తోపాటు ఇచ్చిన అఫిడవిట్లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించిన రిటర్నింగ్ అధికారి నారపురెడ్డి మౌర్య వాటిని సవరించాలని సూచించారు. -
టీజీ భరత్ నామపత్రం దాఖలు
[ 24-04-2024]
కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి మంగళవారం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. తెదేపా అభ్యర్థి టీజీ భరత్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు