కుట్టు వేయరు.. రూకలివ్వరు
కౌతాళం మండలం బదినేహాల్కు చెందిన సరోజ గతేడాది నవంబరులో ఆదోని ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స (కు.ని) చేయించుకున్నారు.
- న్యూస్టుడే, ఆదోని వైద్యం, నంద్యాల పాతపట్టణం
ఆదోని ప్రభుత్వ మహిళా ఆస్పత్రిలో సేవలు
కౌతాళం మండలం బదినేహాల్కు చెందిన సరోజ గతేడాది నవంబరులో ఆదోని ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స (కు.ని) చేయించుకున్నారు. ఇంత వరకు ఆమెకు నగదు ప్రోత్సాహకం అందలేదు. ఆపరేషన్ చేయించుకోవడానికి ఆమె 35 కి.మీ. ప్రయాణం చేసి సొంత డబ్బులు వెచ్చించారు.
ఆదోని మండలం బలేకొల్లుకు చెందిన లక్ష్మి గతేడాది అక్టోబరులో కు.ని. చేయించుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం బ్యాంకు ఖాతా సంఖ్య, ఆధార్ పత్రాలు తీసుకున్నారు. నిధులు విడుదలయ్యాకా డబ్బులు జమ చేస్తామని చెప్పడంతో ఒట్టి చేతులతో వెనుదిరిగారు.
ఉమ్మడి జిల్లాలో కుటుంబ నియంత్రణ (కు.ని.) శస్త్రచికిత్సలు తగ్గాయి. కొవిడ్ అనంతరం చాలా చోట్ల ఆ చర్యలే లేవు. శస్త్రచికిత్స చేసే వైద్యులు తక్కువగా ఉండటం, వైద్యులకు సరైన శిక్షణ లేకపోవడం, వీటికి తోడు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం అందకపోవడం వెరసి శస్త్ర చికిత్సలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. 2021-22 ఏడాదిలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14,058 కు.ని. చికిత్సలు లక్ష్యం కాగా, 7,575 మందికి చేశారు. జిల్లా విభజనంతరం కర్నూలు జిల్లా 13,563 మంది లక్ష్యం కాగా.. డిసెంబరు నాటికి 7,166 మందికి సేవలందించారు. నంద్యాలలో సుమారు వెయ్యి మందికి సేవలందించినట్లు సమాచారం. సేవల్లో నంద్యాల పూర్తిగా వెనుకబడింది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందని సేవలు
* నంద్యాల జిల్లాలో బనగానపల్లి, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, డోన్ మినహా ఎక్కడా శస్త్రచికిత్సలు చేయడం లేదు. కర్నూలు జిల్లాలో జిల్లా ఆస్పత్రితో పాటు ఆదోని మాతా శిశు ఆస్పత్రిలో తప్ప మరెక్కడా సేవలు అందడం లేదు. ఆదోని డివిజన్ కేంద్రంలోని 17 మండలాల వారు ఆదోని ఆస్పత్రికి వచ్చి సేవలు పొందుతున్నారు. ఎటు చూసినా 30-50 కి.మీ. దూరం ప్రయాణం చేసి రావాల్సిందే.
* గతంలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసేవారు. వచ్చేవారికి మౌలికవసతులు కల్పించి సేవలందించేవారు. ఇందుకు ప్రత్యేక బడ్జెట్తో పాటు ప్రత్యేక వైద్య బృందాలు, పడకలు, వైద్య పరికరాలు సమకూర్చుకునేవారు. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు.
దక్కని ఆర్థిక ప్రోత్సాహకం
కు.ని. చికిత్సలు చేయించుకున్న మహిళలకు రూ.1100, పురుషులకు రూ.600 ప్రభుత్వం ఇచ్చేది. నాలుగైదు నెలలుగా సేవలు పొందిన మహిళలకు నగదు ప్రోత్సాహకం అందాల్సి ఉంది. కర్నూలు జిల్లాలో సుమారు 400-500 మందికి అందాలని అధికారులు పేర్కొంటున్నారు. నంద్యాల జిల్లాలో సరాసరి వెయ్యి మంది వరకు నగదు ప్రోత్సాహకాలు విడుదల కావాల్సి ఉంది. శస్త్రచికిత్స చేయించుకున్న వారిపేర్లు, బ్యాంకు ఖాతా, ఆధార్ నకలు పత్రాలు తీసుకుంటున్నారు.. నిధులు విడుదలైతే బ్యాంకు ఖాతాకు జమచేస్తామని సర్దిచెబుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ కాన్పు అనంతరం 5 లేదా 7 రోజుల తర్వాత కు.ని. చికిత్సలు చేస్తారు. కాన్పు అనంతరం మళ్లీ వచ్చి చేయించుకోవాలంటే ఇబ్బందులు పడతారని, ప్రసవం అనంతరం చేయించుకుంటుంటారు. రూ.వేలకు వేలు వసూలు చేస్తూ.. పేదలపై మరింత భారం మోపుతున్నారు.
తాళం వేసిన నంద్యాల పీపీ కేంద్రం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల భేరి.. ప్రచార వే‘ఢీ’
[ 18-04-2024]
రెండు ఎంపీ స్థానాలు.. 14 అసెంబ్లీ స్థానాలున్న ఉమ్మడి జిల్లాలో గురువారం నుంచి రాజకీయం మరింత వే‘ఢీ’రాజుకోనుంది.. ఈ నెల 18 నుంచి ఈనెల 25 వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. -
జనం గుండెల్లో జగన్ విల్లం‘భూ’
[ 18-04-2024]
ప్రాజెక్టులు నిర్మించలేదు.. పరిశ్రమలు ఏర్పాటు లేదు.. రోడ్లు లేవు.. పల్లె మొదలు పట్టణం వరకు ప్ర‘గతి’ తప్పింది. ఫలితంగా స్థిరాస్తి రంగం కుప్పకూలింది. -
ఎమ్మెల్యే వస్తున్నారని.. ఉపాధి పనులు బంద్
[ 18-04-2024]
ఆదోని మండలం అరేకల్లో బుధవారం ఉపాధి పనులు చేపట్టలేదు. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని, ఉపాధి పనులు బంద్ చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మాటకారి మామయ్యా.. ‘దీవెన’లేవయ్య
[ 18-04-2024]
తల్లిదండ్రులు మీ పిల్లల్ని పాఠశాలలు, కళాశాలలకు పంపండి.. వారిని చదివించే బాధ్యత నేనే తీసుకుంటా’’ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అమ్మఒడి పథకం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తున్నాం. -
నిలువెల్లా గాయాలు.. నీళ్లు పారని కాల్వలు
[ 18-04-2024]
‘మాది రైతు ప్రభుత్వం.. పంటలు ఎండనీయం.. అన్నదాతల కంట నీరు రానీయం’ అని ఎన్నోసార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రసంగాలు ఊదరగొట్టారు. తీరా చూస్తే.. పంట కాల్వలు దయనీయంగా మారాయి. -
ఓట్ల ఆట!
[ 18-04-2024]
ఆటైనా.. ఓటైనా ప్రజలకు ఆసక్తికరమైన అంశాలే. ఉత్కంఠ రేకిత్తించే విషయాలే. తరచి చూస్తే ఈ రెండింటి మధ్య పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ఎక్కడ నలుగురు కలిసినా.. వీటికి సంబంధించిన విషయాలపైనే చర్చ కొనసాగుతోంది. -
పోలింగ్ శాతం పెంచేలా చర్యలు
[ 18-04-2024]
విధి నిర్వహణలో భాగంగా అధికారులు, ఉద్యోగులు నిబంధనలు పాటించాల్సిందేనని.. ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని కలెక్టర్ జి.సృజన అన్నారు. -
జగన్ మామయ్య దీవెనా.. అంతా మాయ
[ 18-04-2024]
విద్యార్థులకు ఆర్థిక సాయం, చదువుకు తోడ్పాడు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు వారికి ఖాళీ చేతులే చూపుతోంది. విద్యాభ్యాసానికి ఆటంకంగా మారింది. జగన్ చెప్పిన మాటలు నమ్మి ఉన్నత చదువులు చదువుదామని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది. -
సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధి చెప్పండి
[ 18-04-2024]
సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ‘ప్రజాగళం’లో భాగంగా పట్టణంలోని బీసీ కాలనీలో ఆయన పర్యటించారు. -
రహదారుల బాగుకు చర్యలు : బుగ్గన
[ 18-04-2024]
వైకాపా వెన్నుపోటుదారులకు, అవాకులు చవాకులు మాట్లాడే వారికి ఎన్నికల తర్వాత కోలుకోలేని విధంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. -
కర్నూలు నియోజకవర్గం చుట్టూ మూడు చెక్పోస్టులు
[ 18-04-2024]
కర్నూలు నియోజకవర్గం చుట్టూ 24 గంటలు నిఘా ఉంచేందుకు మూడు స్టాటస్టికల్ సరైలైన్స్ టీమ్లతో కూడిన చెక్పోస్టులను ఏర్పాటుచేస్తూ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల అధికారి, కర్నూలు నగరపాలకసంస్థ కమిషనర్ భార్గవ్తేజ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
నామినేషన్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకానుంది. -
వైకాపా అంతర్గత వైరం.. బహిరంగం
[ 18-04-2024]
వైకాపా అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. బలనిరూపణ, సామాజికవర్గంలో పెత్తనం, గ్రామాలు, మండలాల్లో ఆధిపత్యం చెలాయించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ విభేదాలు బహిర్గతమవుతున్నాయి.