కళారంగంలో ఎంపీ చరణాలు
డోన్ పట్టణంలోని కొత్తపేటకు చెందిన యువకుడు ఎంపీ చరణ్ పీజీ, టీటీసీ పూర్తి చేసి నృత్యకారునిగా, కొరియోగ్రాఫర్గా, చిత్రలేఖన ఉపాధ్యాయునిగా, లఘు చిత్రాలతోపాటు సినిమాల్లోనూ నటిస్తున్నారు... ఇలా పలు రంగాల్లో రాణిస్తూ ఆల్రౌండర్గా నిలుస్తూ పలువురి మన్ననలు, ప్రశంసలు అందుకుంటున్నారు.
లఘు చిత్రాలు, సినిమాల్లో రాణిస్తున్న యువకుడు
- న్యూస్టుడే, డోన్ పట్టణం
రణస్థలంలో హీరోగా ఫైట్స్ సన్నివేశంలో ఎంపీ చరణ్
డోన్ పట్టణంలోని కొత్తపేటకు చెందిన యువకుడు ఎంపీ చరణ్ పీజీ, టీటీసీ పూర్తి చేసి నృత్యకారునిగా, కొరియోగ్రాఫర్గా, చిత్రలేఖన ఉపాధ్యాయునిగా, లఘు చిత్రాలతోపాటు సినిమాల్లోనూ నటిస్తున్నారు... ఇలా పలు రంగాల్లో రాణిస్తూ ఆల్రౌండర్గా నిలుస్తూ పలువురి మన్ననలు, ప్రశంసలు అందుకుంటున్నారు.
చరణ్ సొంత గ్రామం డోన్ మండలం బి.రామదుర్గం. తల్లిదండ్రులు హరిజన గిడ్డయ్య, పెద్దక్క. వీరు కూలీ పని చేస్తుంటారు. చరణ్ డోన్లో డిగ్రీ వరకు చదివారు. ఆ తర్వాత 2018లో టీటీసీ (సాంఘిక శాస్త్రం), 2019లో టీటీసీ (ఆర్ట్స్) శిక్షణ పూర్తి చేశారు. కర్నూలులో 2021లో ఎంకాం అభ్యసించారు. ప్రస్తుతం అనంతపురంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో చిత్రలేఖన ఉపాధ్యాయునిగా పని చేస్తూనే లఘుచిత్రాలు, సినిమాల్లో నటించడమే కాకుండా కొరియోగ్రాఫర్గా ప్రతిభ కనబరుస్తున్నారు.
డిగ్రీలోనే కొరియోగ్రాఫర్గా చేసి..
డోన్లో బీకాం కంప్యూటర్ అభ్యసిస్తుండగానే సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. డోన్కు చెందిన కొరియోగ్రాఫర్ రవితేజను కలిసి అతని సహకారంతో కవర్ సాంగ్స్కు సంబంధించి మూడు పాటల్లో డ్యాన్సర్గా చేసి మెప్పు పొందారు. అతని ప్రతిభను ‘బడుగు జీవులు’ చిత్రంలో నటించిన కథానాయకుడు పూజారి సురేశ్బాబు గుర్తించి నృత్యదర్శకునిగా ప్రయత్నించాలని చరణ్ను ప్రోత్సహించారు. దాంతో కవర్ సాంగ్స్కు కొరియోగ్రాఫర్గా చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి పలువురి మెప్పు పొందారు. బుట్టబొమ్మ, 90 ఎంఎల్ సినిమాలోని సింగిల్ సింగిల్ సింగారానివే పాటకు, లై చిత్రంలోని బంబేలా ఉందిరా పోరీ, కలర్ ఫొటో చిత్రంలోని అరెరె ఆకాశంలోని పాటకు కొరియోగ్రాఫర్గా చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడంతో లక్షల వీక్షణలు వచ్చాయి.
* మహిళలకు రక్షణ కల్పించాలనే సందేశాన్నిచ్చే ఓ లఘుచిత్రాన్ని తీశారు. కమర్షియల్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్తో కూడిన రణస్థలం డెమో ఫిల్మ్ను చిత్రీకరిస్తుండటం విశేషం.
* 2019లో హైదరాబాద్లో డ్యాన్స్ పోటీల్లో రామ్చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రంలోని పాటకు చరణ్ నృత్యం వేసి ద్వితీయ స్థానంలో నిలిచి సిని కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందుకున్నారు. బిగ్బాస్ విజేత సోహెల్ జన్మదినం సందర్భంగా బర్త్డే సాంగ్కు నృత్య దర్శకునిగా చేశారు.
1.15 లక్షల వీక్షణలతో గుర్తింపు
వారం రోజుల క్రితం జానపద పాటకు (ఆల్బమ్ సాంగ్) సంబంధించి ‘గలగల గలమని నీ కాలి గజ్జెల’తో పాటకు చరణ్ కొరియోగ్రాఫర్గా, హీరోగా, దర్శకత్వం చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఆ పాట వారంలోనే 1.15 లక్షల వీక్షణలతో దూసుకుపోయింది.
సైరా సినిమాలో గుర్రంపై వెళ్తున్న ఎం.పి. చరణ్
సినీ రంగంలోకి ప్రవేశం
చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా ఆడిషన్స్ హైదరాబాద్లో జరుగుతున్న నేపథ్యంలో తన మిత్రుడు, తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన కాశీ ద్వారా వెళ్లారు. ఆడిషన్స్లో ఎంపికై సినిమా అవకాశం దక్కించుకున్నారు. ఆ చిత్రంలో నటుడు జగపతిబాబు వెంట హార్స్ రైడర్గా సన్నివేశంలో నటించారు. అజయ్ పాసయ్యాడు అనే చిత్రంలో డ్యాన్సర్గా, మూడు పాటలకు గుంటూరుకు చెందిన మహేష్ మాస్టర్కు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పని చేశారు. బడుగు జీవులు (బీజే) చిత్రంలో ఐటమ్ సాంగ్కు డ్యాన్సర్గా, లవర్ ఆఫ్ ఆనంద్ సినిమాలో ఐటమ్ సాంగ్కు డ్యాన్సర్గా చేసి శెభాష్ అనిపించుకున్నారు. హైదరాబాద్ వారు తీస్తున్న స్వయంవరం చిత్రంలో ఒక పాటకు మహేష్ మాస్టర్కు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేశారు. రక్తచరిత్ర-3 సినిమాలో కొరియోగ్రాఫర్ అవకాశం దక్కించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యోగుల సొమ్ము.. జగన్ వమ్ము
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్ ఉద్యోగుల వరకు 35 వేల మంది ఉన్నారు. ఆర్టీసీ, సచివాలయ ఉద్యోగులు కలిపితే 56 వేల మంది వరకు ఉన్నారు. వీరంతా గత ఐదేళ్ల జగన్ జమానాలో నరకం అనుభవించారు. -
అక్కా.. చెల్లెమ్మలకు జగనన్న బురిడీ
[ 19-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 80 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలుండగా.. అందులో 8 లక్షల మందికిపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. -
కదిలొచ్చిన పసుపు దళం
[ 19-04-2024]
చేనేత పురి పసుపుమయంగా మారింది.. ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరెడ్డి గురువారం నామపత్రాలు దాఖలు చేశారు. ఉదయం 11:30 గంటలకు ఒక సెట్ వేశారు. బీవీ జయనాగేశ్వరరెడ్డి 2, ఆయన సతీమణి నిత్యాదేవి 2 సెట్లు వేశారు. -
భద్రత పేరుతో ఆంక్షలు
[ 19-04-2024]
నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద పోలీసు శాఖ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు అందరికీ ఇబ్బందిగా మారాయి. కర్నూలు ఎంపీ, పాణ్యం ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కలెక్టరేట్లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
వైకాపా పాలనలో వలసలే మిగిలాయి
[ 19-04-2024]
పశ్చిమ ప్రాంతంలో కరవును తరిమేసేందుకు తెదేపా హయాంలో వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2వేల కోట్లు మంజూరు చేశారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. -
నీరింకిన జలాశయం.. నెరవేరని ఆశయం
[ 19-04-2024]
తాగు, సాగునీరు అందించాలనే ఆశయంతో నిర్మించిన జలాశయాలు కళతప్పాయి. జలం లేక వెలవెలబోతున్నాయి. పశ్చిమ పల్లెలు దాహంతో తల్లడిల్లుతున్నా.. చుక్క నీరు అందించలేని పరిస్థితి. -
మహిళా కార్పొరేటర్ ఇంటిపై దుండగుడి దాడి
[ 19-04-2024]
కర్నూలు నగరంలోని ఎల్కూరుబంగ్లాలో ఉంటున్న 41వ వార్డు కార్పొరేటర్ శ్వేతారెడ్డి ఇంటి వద్ద ఓ దుండుగుడు హల్చల్ చేశాడు. -
నగరాభివృద్ధికి కృషి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టీజీ భరత్ కోరారు. ఎస్.ఎ.పి. క్యాంపు వద్ద గురువారం 4వ విడత సైకిల్ భరోసాయాత్ర చేపట్టారు. -
భావోద్వేగానికి గురైన కోట్ల
[ 19-04-2024]
కోడుమూరు తనదైనప్పటికీ కర్నూలు వదిలివెళ్లడం ఎంతో బాధగా ఉందని, జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయతలు తనను కట్టిపడేస్తున్నాయంటూ మాజీ కేంద్ర మంత్రి, డోన్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోట జయసూర్యప్రకాశ్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. -
డివైడర్ను ఢీకొన్న ప్రైవేటు బస్సు
[ 19-04-2024]
ఓర్వకల్లు మండలం పూడిచెర్లమెట్ట వద్ద జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. -
ఉద్యోగుల పింఛన్.. జగన్ వంచించెన్
[ 19-04-2024]
పాత పింఛను విధానాన్నే అమలు చేయండి మహాప్రభో అంటున్నా.. తన మతం తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. తాను అధికారంలోకి వచ్చాక సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పింఛను స్కిమ్) రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించారు. -
అతివలకు సాయం.. అంతంతమాత్రం
[ 19-04-2024]
గతంలో ఓ వెలుగు వెలిగిన పొదుపు సంఘాలు, గ్రామైక్య సంఘాలు ప్రస్తుత వైకాపా పాలనలో నిర్వీర్యమవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోంది. -
కదంతొక్కిన పసుపు దళం
[ 19-04-2024]
శ్రీశైల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి గురువారం నామపత్రం దాఖలు చేశారు. ముందుగా నల్లకాల్వ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
[ 19-04-2024]
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
గడప.. గడపకు వెళ్లాల్సిందే
[ 19-04-2024]
వాలంటీర్లు వైకాపా తరఫున ప్రచారం చేయాల్సిందేనని ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. -
వైకాపాను భూ స్థాపితం చేయాలి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేయాలని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు తహసీల్దారు కార్యాలయంలో గురువారం ఆయన నామపత్రం దాఖలు చేశారు. -
ప్రచండ భానుడు
[ 19-04-2024]
పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భానుడి ధాటికి జనం అల్లాడిపోతున్నారు. నంద్యాల జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటేశాయి. -
తొలి రోజు 11 మంది నామపత్రాల దాఖలు
[ 19-04-2024]
కర్నూలు జిల్లా పరిధిలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన గురువారం విడుదల చేశారు.