యువ క్రీడాకారులు.. ఫుట్బాల్ మాంత్రికులు
ఆ ఇద్దరూ ఫుట్బాల్ మైదానంలో దిగారంటే.. గెలుపు వారి జాబితాలోకి వచ్చి చేరుతుంది. ప్రత్యర్థి గోల్పోస్టులపై దాడులు చేసి.. గోల్ సాధిస్తారు.
రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా
- న్యూస్టుడే, ఆదోని సాంస్కృతికం
సిటీ ఫుట్బాల్ క్లబ్ కోచ్లతో ఫుట్బాల్ క్రీడాకారులు
ఆ ఇద్దరూ ఫుట్బాల్ మైదానంలో దిగారంటే.. గెలుపు వారి జాబితాలోకి వచ్చి చేరుతుంది. ప్రత్యర్థి గోల్పోస్టులపై దాడులు చేసి.. గోల్ సాధిస్తారు. ప్రత్యర్థుల దృష్టిని మరల్చి.. తమ కాళ్లతో బంతిని మాయచేస్తూ విజయం వైపు దూసుకెళ్తున్నారు. మైదానంలో తమ ప్రతిభ చూపుతూ రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీల్లో రాణించి శెభాష్ అనిపించుకున్నారు. ఆదోని పట్టణానికి చెందిన సిటీ¨ ఫుట్బాల్ క్లబ్ తరఫున ఆదోని పట్టణానికి చెందిన పి.మహిమా స్వరూప్, డి.కౌశిక్ రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల్లో జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన ఈ ఇద్దరు క్రీడాకారుల విజయగాథ తెలుసుకుందామా..
సాధనే గెలుపు మహిమ
ఆదోని పట్టణం అంబేడ్కర్నగర్కు చెందిన పి.వీరేశ్, ఎస్తేరమ్మ దంపతుల కుమారుడు పి.మహిమా స్వరూప్ ఫుట్బాల్ క్రీడలో ప్రత్యేకతను చాటుతున్నాడు. కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అండర్-19 విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచాడు. మైదానంలో రైట్ ఫార్వర్డ్గా బరిలో దిగుతాడు. బంతిని డ్రిప్లింగ్ చేస్తూ ప్రత్యర్థుల గోల్ పోస్టులోకి బంతితో గోల్ చేస్తూ ఔరా అనిపించుకుంటున్నారు. ఆరేళ్లుగా ఫుట్బాల్లో శిక్షణ పొందుతున్నాడు. ఆదోని సిటీ ఫుట్బాల్ క్లబ్ తరఫున కోచ్ మస్తాన్వలి, జగన్నాథ్ శిక్షణలో స్వరూప్ రాణిస్తున్నాడు. తన ప్రతిభతో కర్నూలు జిల్లా జట్టు అండర్--19లో స్థానం సంపాదించారు. గత నెల 28, 29వ తేదీల్లో తిరుపతిలో స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించి ప్రతిభ చాటారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల్లో ఫైనల్లో కడప, కర్నూలు జట్లు తలపడగా.. కర్నూలు జట్టు ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకం కైవసం చేసుకుంది. జాతీయ స్థాయిలో జరిగే సంతోష్ ట్రోఫీలో తాను ప్రాతినిధ్యం వహించాలని.. పీఈటీగా స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకున్నానంటున్నాడు ఈ యువ క్రీడాకారుడు స్వరూప్.
శెభాష్.. కౌశిక్
ఆదోని పట్టణం డి.రాజశేఖర్, ఇందుమతి దంపతుల కుమారుడు డి.కౌశిక్ ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. చదువుతూనే ఫుట్బాల్ క్రీడలో రాణిస్తున్నాడు. మైదానంలో డిఫెన్స్ క్రీడాకారుడిగా రాణిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నాడు. ప్రత్యర్థులు గోల్ కొట్టేందుకు దూసుకొచ్చినా.. వారిని అడ్డుగోడలా నిలుస్తూ గోల్ కొట్టకుండా నివారించడంలో ఆరితేరాడు. తన ప్రతిభతో కర్నూలు జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు. తిరుపతిలో గత నెలలో జరిగిన అండర్-19 రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీల్లో జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించి రెండో స్థానంలో నిలిచారు. ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు ఫుట్బాల్ క్రీడలో రాణిస్తున్నాడు. జాతీయ స్థాయిలో రాణించాలన్నదే తన లక్ష్యమని చెబుతున్నాడు కౌశిక్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్లాస్టిక్ నివారణకు సహకరించండి
[ 24-04-2024]
శ్రీశైలం అటవీ శాఖలో ప్లాస్టిక్ నివారణకు సహకరించాలని శ్రీశైలం, నాగార్జున సాగర్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ బీఎన్ఎన్ మూర్తి అన్నారు. -
మైనారిటీల అభివృద్ధిని విస్మరించిన వైకాపా
[ 24-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల నుంచి మైనార్టీల అభివృద్ధిని విస్మరించిందని మండల ముస్లిం మైనారిటీ నాయకులు నజీర్ సాహెబ్, ఫక్రుద్దీన్, బేతాళ భలే సాహెబ్, మదీనా అన్నారు. -
తెదేపాను గెలిపిస్తే అర్హలందరికీ సంక్షేమ పథకాలు
[ 24-04-2024]
రాష్ట్రంలో తెదేపాను గెలిపిస్తే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి అన్నారు. -
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
[ 24-04-2024]
‘నా జీవితం నాశనం కావడానికి కారణం నువ్వే. మీ కుటుంబం నాకు అన్యాయం చేసింది’ అంటూ ఓ మహిళ నంద్యాల వైకాపా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి సతీమణి, కౌన్సిలర్ నాగినిరెడ్డిని నిలదీయడం తీవ్ర చర్చనీయాంశమైంది. -
కేసీ.. జగన్ నిర్లక్ష్యం చేసి
[ 24-04-2024]
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రగల్బాలు పలికిన జగన్ ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఐదువందలు కేటాయించలేదు.. కేసీ కాల్వకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూపాయి వెచ్చించలేదని శాసనసభా సాక్షిగా ‘కాగ్’ తేల్చింది.. -
గ్రామ స్వరాజ్యం.. జగనాసుర అరాచకం
[ 24-04-2024]
పంచాయతీ, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు స్థానిక ప్రభుత్వాలుగా వ్యవహరిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాల్సి ఉండగా వాటిపై జగన్ కుట్ర పన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం -
బలగం పెంచుకుని బరిలోకి!
[ 24-04-2024]
వైకాపాలో విభేదాలు... ఐదేళ్లుగా ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం.. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మల్చుకొని విజయం దిశగా వెళ్లాలని కోడుమూరు తెదేపా నేతలు వ్యూహాలకు పదునుపెట్టారు. -
డీసీసీబీ తాత్కాలిక సీఈవోపై వేటు
[ 24-04-2024]
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తాత్కాలిక ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) శివలీలపై వేటు పడింది. -
కోట్ల గూటికి పాత నేతలు
[ 24-04-2024]
ఇన్నాళ్లు పార్టీని ఉపయోగించుకొని వీడిన వారికి తాము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా రిటర్న్గిఫ్ట్ ఇస్తామని అధికారపార్టీ నేత హెచ్చరికలు ‘డోన్’ నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి.. -
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయం
[ 24-04-2024]
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయమని ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ అన్నారు. మండలంలోని తంగడరడోణ, తుర్వగల్లు, తొగలగల్లు, యాటకల్లు, కల్లపరి, చొక్కనహళ్లి, శంకరబండ తదితర గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగనన్న వెన్నుపోటు.. పల్లెల తిరుగుబాటు
[ 24-04-2024]
ప్రస్తుతం పల్లెలు కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్నాయి. జగన్ ప్రభుత్వం నిర్వాకంతో సమస్యలతో సతమతమవుతున్నాయి. కనీసం కుళాయి బిగించేందుకు కూడా చిల్లర లేని పరిస్థితి. కేంద్రం నుంచి వచ్చే నిధులను సైతం మళ్లించి.. -
పాణ్యం ఎన్నికల్లో ప్రముఖం
[ 24-04-2024]
పాణికేశ్వరస్వామి పేరుతో పాణ్యం గ్రామం ఏర్పడింది. కాలక్రమేణా నియోజకవర్గంగా మారింది. కర్నూలు, నంద్యాల మధ్య వారధిగా ఉన్న పాణ్యం నియోజకవర్గం అత్యంత కీలకం. జిల్లాలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం కావడం విశేషం. -
పుస్తక పుటలకు జగనన్న చెద
[ 24-04-2024]
గ్రంథాలయాల్లో పాఠకుల్ని సమస్యలు వేధిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. పాఠకులకు కొత్త పుస్తకాలు అందుబాటులో ఉండటం లేదు. -
కాటసాని ఆస్తులు రూ.75.19 కోట్లు
[ 24-04-2024]
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.75.19 కోట్లుగా చూపారు. సోమవారం నామినేషన్తోపాటు ఇచ్చిన అఫిడవిట్లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించిన రిటర్నింగ్ అధికారి నారపురెడ్డి మౌర్య వాటిని సవరించాలని సూచించారు. -
టీజీ భరత్ నామపత్రం దాఖలు
[ 24-04-2024]
కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి మంగళవారం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. తెదేపా అభ్యర్థి టీజీ భరత్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్