logo

కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి

కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడంతోపాటు బలోపేతానికి కృషి చేస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు సుధాకర్‌ బాబు పేర్కొన్నారు.

Published : 04 Feb 2023 03:52 IST

నియామక పత్రం అందజేస్తున్న డీసీసీ అధ్యక్షుడు సుధాకర్‌ బాబు తదితరులు

కర్నూలు విద్య: కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడంతోపాటు బలోపేతానికి కృషి చేస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు సుధాకర్‌ బాబు పేర్కొన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం కార్యకర్తలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. కర్నూలు జిల్లా ఎస్సీ సెల్‌    ఛైర్మన్‌గా నాయకంటి బజారన్నను అధిష్ఠానం నియమించిందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో నగర అధ్యక్షుడు జాన్‌ విల్సన్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గుప్తా పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని