logo

బైపాస్‌ రహదారి పనులు పూర్తి చేస్తాం

ఆదోని పట్టణంలో అసంపూర్తిగా మిగిలిపోయిన బైపాస్‌ రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అన్నారు.

Updated : 04 Feb 2023 17:02 IST

ఆదోని మార్కెట్: ఆదోని పట్టణంలో అసంపూర్తిగా మిగిలిపోయిన బైపాస్‌ రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అన్నారు. శనివారం సబ్‌కలెక్టర్ అభిషేక్‌ కుమార్‌తో ఈ అంశంపై చర్చించారు. ప్రస్తుతం 30మీటర్ల వెడల్పుతో అనుకున్న రహదారి పనులను భవిష్యత్తు అవసరాల దృష్ట్యా జాతీయ రహదారుల విభాగం డైరెక్టర్ జనరల్‌ నుంచి 45 మీటర్ల వెడల్పు పొడిగింపునకు ఉత్తర్వులు వచ్చాయన్నారు. భవిష్యత్తులో 4 వరసల రహదారికి ఉపయుక్తంగా మారనుందన్నారు. ఇందుకు 7 కిలోమీటర్ల పొడవు గల రహదారికి రూ.120కోట్ల దాకా వ్యయం చేయనున్నట్లు తెలిపారు. విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయే బాధితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించేలా చూస్తామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని