మేయర్ వినరు.. అధికారులు పట్టించుకోరు
భారీగా డబ్బులు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలిచాం. ఇంతవరకు వార్డుల్లో పనులు కావడం లేదు. ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాం.
కర్నూలు నగరపాలకసంస్థ, న్యూస్టుడే: భారీగా డబ్బులు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలిచాం. ఇంతవరకు వార్డుల్లో పనులు కావడం లేదు. ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాం. అధికారులు.. మాపై సానుకూలంగా లేరు. పనులు చేయాలని చెప్పినా మేయర్, నగరపాలక కమిషనర్ పట్టించుకోరు. మరి డబ్బులు ఎలా సంపాదించుకోవాలి. పారిశుద్ధ్య కార్మికుల పోస్టులకు సంబంధించి ఒక్కో కార్పొరేటర్కు రెండు పోస్టులు సరిపోవు. మూడు పోస్టులు కేటాయించాలని పలువురు కార్పొరేటర్లు మేయర్ వద్ద డిమాండ్ చేశారు.
కమిషనర్ తీరుపై అసంతృప్తి
కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ భవనంలో అధికార పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు సమావేశమయ్యారు. ఎలాంటి ఆదాయం లేదు.. ఆదాయ మార్గాలు మనమే వెతుక్కోవాలి. పనులు చేసుకోకపోతే ఇబ్బందులు పడతామంటూ బాధలు పంచుకున్నారు. వార్డుల్లో పనులు జరుగుతున్నా వాటాలు రావడం లేదు. పట్టణ ప్రణాళిక అధికారులు కనీసం ఫోన్ ఎత్తరు. భవన అనుమతుల కోసం వారే డబ్బులు దండుకుంటున్నారు. మేయర్, కమిషనర్ మనల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. ఇంతలో ఓ వ్యక్తి మాట్లాడుతూ మా వర్గంలో (ఓ మాజీ ఎమ్మెల్యే) చేరండి పనులన్నీ అవుతాయి.. డబ్బులు సంపాదించుకోవచ్చని చెప్పారు. దీనికి కర్నూలుకు చెందిన కొందరు కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏం మాట్లాడుతున్నారంటూ వాగ్వాదానికి దిగారు. ఓ ప్రజాప్రతినిధి ఫోన్ చేయడంతో అక్కడి నుంచి కొందరు కార్పొరేటర్లు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న మేయర్ తన ఛాంబరులోకి రావాలని కోరినా పలువురు పట్టించుకోలేదు.
కనీస సమాచారం ఇవ్వరు
అనంతరం పలువురు మేయర్ ఛాంబర్లో మేయర్ బీవై రామయ్యతో మాట్లాడారు. మీ వార్డులో జరిగిన పనులు.. తమ వార్డుల్లో జరగడం లేదు.. మా వార్డుల్లో చిన్న పని చేయించుకోవాలన్నా మిమ్మల్ని, కమిషనర్ను అడగాలని కిందిస్థాయి సిబ్బంది చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేమందరం గెలిస్తేనే మీరు మేయర్ అయ్యారు అని అన్నారు. అధికారులు వార్డులను సందర్శించేందుకు వచ్చినప్పుడు కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వడం లేదని.. ఇలాగైతే ఎలా అని ప్రశ్నించారు.
మూడు పోస్టులు ఇస్తే రూ.6 లక్షల లాభం
నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికుల పోస్టులను భర్తీ చేస్తున్నారు.. ఒక్కో కార్పొరేటర్కు రెండేసి చొప్పున పోస్టులు పంచారు. రెండు పోస్టులు వద్దు.. మూడు పోస్టులు ఇవ్వాలని మేయర్ను డిమాండ్ చేశారు. జూనియర్, సీనియర్ కార్పొరేటర్లను ఒకేలా చూస్తే ఎలా అని మేయర్ వద్ద పలువురు కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్కో పోస్టును రూ.2 లక్షలకు అమ్ముకున్నా మూడు పోస్టులు ఇస్తే రూ.6 లక్షలన్నా సంపాదించుకున్న వారమతున్నామని చెప్పినట్లు తెలిసింది. రూ.లక్షలు పోసి కార్పొరేటర్లుగా గెలిచాం.. అన్నా మమ్మల్ని కాస్త పట్టించుకోండి అంటూ మేయర్ను కోరినట్లు సమాచారం.
* మేయర్ వద్ద సమావేశమైన కార్పొరేటర్లలో ఓ మహిళ కార్పొరేటర్ కన్నీంటి పర్యంతమైనట్లు తెలిసింది. తమ బాధలు చాలా ఉన్నాయని, ఒక్క పని చేసుకోలేకపోతే ఎలా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు ఓటు వేయాలి
[ 28-03-2024]
నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే వై. బాలనాగిరెడ్డి మరోసారి ఎమ్మెల్యే కావాలని వైకాపా యువ నాయకురాలు ప్రియాంక రెడ్డి అన్నారు. -
శ్రీశైలంలో వైకాపాకు మరో షాక్
[ 28-03-2024]
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో అధికార వైకాపాకు మరో షాక్ తగిలింది. -
కోసిగిలో ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ’ కార్యక్రమం
[ 28-03-2024]
మండలం కేంద్రమైన కోసిగిలో ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ’ కార్యక్రమాన్ని తెదేపా నాయకులు నిర్వహించారు. -
అహోబిలంలో ఘనంగా స్వాతి వేడుకలు
[ 28-03-2024]
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో గురువారం స్వాతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
కేంద్ర బలగాల కవాతు
[ 28-03-2024]
ఆదోని పట్టణంలో కర్నూల్ ఎస్పీ ఆదేశాల మేరకు ఆదోని డీఎస్పీ శివ నారాయణస్వామి ఆధ్వర్యంలో గురువారం కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 28-03-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు అన్నారు. -
పాదయాత్ర మాటపాలనలో జూట
[ 28-03-2024]
ప్రజా సంకల్ప పాదయాత్ర పేరుతో పల్లెలకొచ్చారు.. నా అక్కాచెల్లెమ్మలు, అన్నలు అంటూ ‘హామీ’లు కురిపించారు.. ఒక సంవత్సరం ఓపిక పడితే ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మించారు.. జగన్ వస్తే జనాలకు మంచి జరుగుతుందని భ్రమింపజేశారు.. అధికార పీఠమెక్కి ‘ప్రజా’స్వామ్యం మరిచారు.. అడిగితే అణచివేశారు.. ప్రశ్నిస్తే భయపెట్టారు.. -
ఎమ్మెల్యే కబ్జాలో రూ.4 కోట్ల విలువైన స్థలం
[ 28-03-2024]
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి రూ.4 కోట్ల విలువైన 40 సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారని బాధితుడు కె.వి.కుమార్ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. -
బస్సులు మళ్లించారు..ఎండలో నిలబెట్టారు
[ 28-03-2024]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు వస్తున్నారంటే జనం హడలిపోతున్నారు. -
మఠం స్థలానికి ఎసరు
[ 28-03-2024]
ఆదోని పట్టణ శివారులోని బైపాస్ రహదారిపై మండగిరి గ్రామ పంచాయతీ పరిధిలో కల్లుమఠానికి చెందిన రూ.కోట్లు విలువ చేసే భూమిని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు కబ్జా పర్వానికి తెర లేపారు. -
ఆదోని భాజపా అభ్యర్థి డా.పార్థసారథి
[ 28-03-2024]
ఉత్కంఠ వీడింది.. ఆదోని అభ్యర్థిగా భాజపా ఓబీసీ మోర్చా కార్యదర్శి డా.పార్థసారథి బరిలో ఉండనున్నారు. -
29న బనగానపల్లికి చంద్రబాబు రాక
[ 28-03-2024]
బనగానపల్లికి ఈ నెల 29న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి బుధవారం తెలిపారు. -
కేసులు నమోదైతే కొలువు కష్టమే
[ 28-03-2024]
చట్ట నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడే వాలంటీర్లపై కేసులు నమోదైతే మళ్లీ వారిని ఉద్యోగంలోకి తీసుకోవడం సాధ్యం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కలెక్టర్ జి.సృజన హెచ్చరించారు. -
తెదేపాలోనే బీసీలకు పెద్దపీట
[ 28-03-2024]
రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు చట్టసభలో సీట్లు కేటాయించి అత్యున్నత స్థానం కల్పించిన ఘనత తెదేపాకే దక్కుతుందని తెదేపా కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు. -
వైకాపా అరాచక పాలనలో ఇబ్బందులు
[ 28-03-2024]
వైకాపా పాలనలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని తెదేపా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. -
ఉర్దూ వర్సిటీ పనులు పూర్తి చేయాలి
[ 28-03-2024]
ఓర్వకల్లు సమీపంలో తెదేపా హయాంలో చేపట్టిన ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ డిమాండ్ చేశారు. -
జగన్ను ఇంటికి సాగనంపుదాం
[ 28-03-2024]
ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దఎత్తున హామీలిచ్చారని.. అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని, రానున్న ఎన్నికల్లో ఓడించి ఇంటికి సాగనంపాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు కోరారు. -
అభివృద్ధికి ఓటేయండి
[ 28-03-2024]
కర్నూలును అభివృద్ధి చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన తనకు మద్దతు ఇవ్వాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్ అన్నారు. -
తెదేపా అభ్యర్థిగా కచ్చితంగా పోటీ చేస్తా
[ 28-03-2024]
మంత్రాలయం నియోజకవర్గం తెదేపా అభ్యర్థిగా కచ్చితంగా నేనే పోటీ చేస్తానని ఆ పార్టీ నాయకుడు తిక్కారెడ్డి అన్నారు. -
ముగ్గురు సైబర్ నేరగాళ్ల అరెస్టు
[ 28-03-2024]
సైబర్ నేరాలకు పాల్పడుతున్న కర్నూలు మండలం మునగాలపాడుకు చెందిన మాస్టిక్ నవీన్కుమార్, అతని సోదరుడు అరుణ్కుమార్, అదే గ్రామానికి చెందిన మహేశ్ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్