మహా ప్రసాదం
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల మల్లన్న లడ్డూలు సిద్ధం కానున్నాయి. ఈ ప్రసాదం అంటే భక్తులకు అమితమైన ప్రీతి.
బ్రహ్మోత్సవాలకు 30 లక్షల లడ్డూల తయారీ
శ్రీశైలం ఆలయం, న్యూస్టుడే : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల మల్లన్న లడ్డూలు సిద్ధం కానున్నాయి. ఈ ప్రసాదం అంటే భక్తులకు అమితమైన ప్రీతి. బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది తరలిరానుండడంతో అందుకు సరిపడా లడ్డూలు తయారుచేసేందుకు దేవస్థానం యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
శ్రీశైలం క్షేత్రంలో ఈనెల 11 నుంచి 21వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు ఇల కైలాసానికి తరలిరానున్నారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల దర్శనం చేసుకున్న తర్వాత మల్లన్న ప్రసాదాలు తీసుకునేందుకు మక్కువ చూపుతారు. ఈ నేపథ్యంలో వారికి కావాల్సినన్ని లడ్డూలు అందించేందుకు దేవస్థానం చర్యలు చేపట్టింది. మొత్తం 30 లక్షల లడ్డూలు సిద్ధం చేసేలా దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు శివదీక్ష భక్తుల తాకిడి ఎక్కువగా ఉండనుండడంతో రోజుకు లక్ష నుంచి లక్షన్నర లడ్డూల అమ్మకాలు సాగుతాయని అంచనా వేస్తున్నారు. 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రోజుకు 2 లక్షల నుంచి 5 లక్షల లడ్డూలు సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని పోటులో లడ్డూ తయారీకి కావాల్సిన పొయ్యిలు, వంట సామగ్రి సిద్ధం చేస్తున్నారు. తయారైన వాటిని లడ్డూ విక్రయశాల వద్ద నిల్వ చేస్తారు.
వినియోగించే సరకులు..
మరో ఐదు రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో లడ్డూల తయారీకి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఒక్కో లడ్డూ 100 గ్రాముల బరువు ఉంటుంది. రూ.20 చొప్పున విక్రయిస్తారు. గత ఏడాది 27.50 లక్షల అమ్మకాలు జరిగాయి. లడ్డూల తయారీకి సంబంధించి శనగపిండి 84,000 కేజీలు వాడనున్నారు. చక్కెర 1,51,200 కేజీలు, జీడిపప్పు 5,500 కేజీలు, ద్రాక్ష 5,880 కేజీలు, యాలకులు 638.400 కేజీలు, పచ్చ కర్పూరం 100.800 కేజీలు, జాజికాయ 134.400 కేజీలు, నెయ్యి 53,760 కేజీలు వినియోగించనున్నారు.
వంద మంది సిబ్బంది
* ఆలయ ప్రాంగణంలోని పోటులో లడ్డూల తయారీకి 100 మంది సిబ్బంది పనిచేయనున్నారు. ప్రత్యేక విధులకుగాను విజయవాడ నుంచి సిబ్బంది హాజరవుతారు. లడ్డూ విక్రయాలకు 15 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. అమ్మకాలకు సంబంధించి 120 మంది సిబ్బంది పనిచేస్తారు.
* ఈ సందర్భంగా శ్రీశైల దేవస్థానం ఈవో ఎస్.లవన్న మాట్లాడుతూ మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు 30 లక్షల లడ్డూలు తయారుచేస్తున్నామని పేర్కొన్నారు. భక్తులకు లడ్డూల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తం 15 విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరాచక పాలనకు చరమ గీతం పాడాలి
[ 25-04-2024]
రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని మండల తెదేపా నాయకులు నజీర్ సాహెబ్, తిమ్మారెడ్డి, తిరుపతయ్య, రామాంజనేయులు, బేతాళ బడే సాహెబ్ అన్నారు. -
మలేరియాపై అవగాహన
[ 25-04-2024]
మండలంలో అన్ని గ్రామాల్లో మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని మలేరియా వ్యాధి సబ్ యూనిట్ అధికారి సాయిబాబా అన్నారు. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 25-04-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర అన్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం