సాగని వ్యాపారం.. దక్కని ఆదాయం
ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్థిరాస్తి వ్యాపారం ముందుకు సాగడం లేదు. అభివృద్ధి పడకేయటంతో పొలాలు, స్థలాలు కొనలేం.. అమ్మలేం అన్నట్లుగా మారింది.
లక్ష్య సాధనలో స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ తడబాటు
కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
కర్నూలు గాయత్రీ ఎస్టేట్, న్యూస్టుడే : ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్థిరాస్తి వ్యాపారం ముందుకు సాగడం లేదు. అభివృద్ధి పడకేయటంతో పొలాలు, స్థలాలు కొనలేం.. అమ్మలేం అన్నట్లుగా మారింది. యజమానులు ధరలు తగ్గించి అమ్మలేకపోతుండగా.. ఆస్తులు కొనుగోలు చేస్తే వాటి ధర పెరుగుతుందో? లేదో? అన్న అనుమానంతో చాలామంది ఆసక్తి చూపడం లేదు. గతంలో అప్పులు చేసి ఆస్తులు కొనుగోలు చేసినవారు ఎంతో కొంత లాభపడగా ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. అప్పులు చేసి స్థిరాస్తి వ్యాపారం చేసిన వారందరూ నష్టాల ఊబిలో కూరుకుపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లా స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖకు ఆశించిన స్థాయిలో ఆదాయం సమకూరడం లేదు. ఈ ప్రభావం ప్రభుత్వ ఖజానాపైనా పడుతోంది.
రెండు మినహా..
కర్నూలు జిల్లాలో 11, నంద్యాల జిల్లాలో 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వీటి పరిధిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి పెద్దఎత్తున ఆదాయం సమకూరేది. 2022 ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు ఆదాయ వివరాలు పరిశీలిస్తే నంద్యాల, కోసిగి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మినహా మిగిలినవి ఆదాయ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. కర్నూలు, ఆదోని, ఓర్వకల్లు, ఇతర ముఖ్య కార్యాలయాలు 80 శాతం వరకు లక్ష్యాన్ని అధిగమించినప్పటికీ ఎప్పుడూ ఆదాయంలో ముందుండే కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అతికష్టం మీద 67 శాతానికి మాత్రమే చేరుకుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద రద్దీ తగ్గటం ఇందుకు నిదర్శనం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఆదాయాలు పరిశీలిస్తే స్థిరాస్తి వ్యాపారం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నంద్యాల జిల్లా ఆదాయం మెరుగు..
స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయాన్ని పరిశీలిస్తే కర్నూలు జిల్లా కంటే నంద్యాల జిల్లా ఆదాయం మెరుగ్గా ఉంది. 2022 ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు కర్నూలు జిల్లా ఆదాయం లక్ష్యం రూ.294.68 కోట్లు కాగా.. రూ.231.21 కోట్లు (78.46 శాతం) మాత్రమే వచ్చింది. నంద్యాల జిల్లా ఆదాయ లక్ష్యం రూ.146.46 కోట్లు కాగా.. రూ.123.37 కోట్లు (84.24 శాతం) వచ్చింది. మొత్తంమీద ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదాయ లక్ష్యంలో 81.35 శాతానికి మాత్రమే చేరడం గమనార్హం. దీనిని పరిశీలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయ లక్ష్యం సాధించటం కష్టసాధ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అహోబిలంలో ఘనంగా స్వాతి వేడుకలు
[ 24-04-2024]
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో బుధవారం స్వాతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ప్లాస్టిక్ నివారణకు సహకరించండి
[ 24-04-2024]
శ్రీశైలం అటవీ శాఖలో ప్లాస్టిక్ నివారణకు సహకరించాలని శ్రీశైలం, నాగార్జున సాగర్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ బీఎన్ఎన్ మూర్తి అన్నారు. -
మైనారిటీల అభివృద్ధిని విస్మరించిన వైకాపా
[ 24-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల నుంచి మైనార్టీల అభివృద్ధిని విస్మరించిందని మండల ముస్లిం మైనారిటీ నాయకులు నజీర్ సాహెబ్, ఫక్రుద్దీన్, బేతాళ భలే సాహెబ్, మదీనా అన్నారు. -
తెదేపాను గెలిపిస్తే అర్హలందరికీ సంక్షేమ పథకాలు
[ 24-04-2024]
రాష్ట్రంలో తెదేపాను గెలిపిస్తే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి అన్నారు. -
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
[ 24-04-2024]
‘నా జీవితం నాశనం కావడానికి కారణం నువ్వే. మీ కుటుంబం నాకు అన్యాయం చేసింది’ అంటూ ఓ మహిళ నంద్యాల వైకాపా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి సతీమణి, కౌన్సిలర్ నాగినిరెడ్డిని నిలదీయడం తీవ్ర చర్చనీయాంశమైంది. -
కేసీ.. జగన్ నిర్లక్ష్యం చేసి
[ 24-04-2024]
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రగల్బాలు పలికిన జగన్ ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఐదువందలు కేటాయించలేదు.. కేసీ కాల్వకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూపాయి వెచ్చించలేదని శాసనసభా సాక్షిగా ‘కాగ్’ తేల్చింది.. -
గ్రామ స్వరాజ్యం.. జగనాసుర అరాచకం
[ 24-04-2024]
పంచాయతీ, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు స్థానిక ప్రభుత్వాలుగా వ్యవహరిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాల్సి ఉండగా వాటిపై జగన్ కుట్ర పన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం -
బలగం పెంచుకుని బరిలోకి!
[ 24-04-2024]
వైకాపాలో విభేదాలు... ఐదేళ్లుగా ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం.. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మల్చుకొని విజయం దిశగా వెళ్లాలని కోడుమూరు తెదేపా నేతలు వ్యూహాలకు పదునుపెట్టారు. -
డీసీసీబీ తాత్కాలిక సీఈవోపై వేటు
[ 24-04-2024]
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తాత్కాలిక ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) శివలీలపై వేటు పడింది. -
కోట్ల గూటికి పాత నేతలు
[ 24-04-2024]
ఇన్నాళ్లు పార్టీని ఉపయోగించుకొని వీడిన వారికి తాము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా రిటర్న్గిఫ్ట్ ఇస్తామని అధికారపార్టీ నేత హెచ్చరికలు ‘డోన్’ నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి.. -
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయం
[ 24-04-2024]
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయమని ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ అన్నారు. మండలంలోని తంగడరడోణ, తుర్వగల్లు, తొగలగల్లు, యాటకల్లు, కల్లపరి, చొక్కనహళ్లి, శంకరబండ తదితర గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగనన్న వెన్నుపోటు.. పల్లెల తిరుగుబాటు
[ 24-04-2024]
ప్రస్తుతం పల్లెలు కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్నాయి. జగన్ ప్రభుత్వం నిర్వాకంతో సమస్యలతో సతమతమవుతున్నాయి. కనీసం కుళాయి బిగించేందుకు కూడా చిల్లర లేని పరిస్థితి. కేంద్రం నుంచి వచ్చే నిధులను సైతం మళ్లించి.. -
పాణ్యం ఎన్నికల్లో ప్రముఖం
[ 24-04-2024]
పాణికేశ్వరస్వామి పేరుతో పాణ్యం గ్రామం ఏర్పడింది. కాలక్రమేణా నియోజకవర్గంగా మారింది. కర్నూలు, నంద్యాల మధ్య వారధిగా ఉన్న పాణ్యం నియోజకవర్గం అత్యంత కీలకం. జిల్లాలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం కావడం విశేషం. -
పుస్తక పుటలకు జగనన్న చెద
[ 24-04-2024]
గ్రంథాలయాల్లో పాఠకుల్ని సమస్యలు వేధిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. పాఠకులకు కొత్త పుస్తకాలు అందుబాటులో ఉండటం లేదు. -
కాటసాని ఆస్తులు రూ.75.19 కోట్లు
[ 24-04-2024]
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.75.19 కోట్లుగా చూపారు. సోమవారం నామినేషన్తోపాటు ఇచ్చిన అఫిడవిట్లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించిన రిటర్నింగ్ అధికారి నారపురెడ్డి మౌర్య వాటిని సవరించాలని సూచించారు. -
టీజీ భరత్ నామపత్రం దాఖలు
[ 24-04-2024]
కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి మంగళవారం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. తెదేపా అభ్యర్థి టీజీ భరత్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM