చిత్తశుద్ధి ఉంటే సమస్యలు పరిష్కరించండి
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు
జ్యోతి వెలిగిస్తున్న బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఇతర నాయకులు
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలో ఏపీ ఐకాస అమరావతి (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సేవా సంఘాల ఐక్య కార్యాచరణ సమితి) రాష్ట్ర మూడో మహాసభను ఆదివారం నిర్వహించారు. ఒకటో తేదీ వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. వేతనాలు, పింఛను కోసం ఎదురుచూపులు చూడక తప్పడం లేదన్నారు. కరోనా సమయంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకాల కింద నేటికీ ఉద్యోగాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. చిరు ఉద్యోగుల రేషన్ కార్డులు తొలగించారన్నారు. ఆర్థిక చెల్లింపుల విషయంలో ఉద్యోగుల పరిస్థితి హీనంగా ఉందన్నారు. దాచుకున్న సొమ్ము, పెట్టుకున్న బిల్లులూ పెండింగ్లో ఉండటంతో పిల్లల పెళ్లిళ్లు వాయిదా వేసుకోవడం, సమయానికి ఆరోగ్య సంబంధమైన విషయాలనూ పక్కన పెట్టాల్సి వస్తోందని చెప్పారు. తాజా మాజీ ప్రధాన కార్యదర్శి వై.వి.రావు మాట్లాడుతూ మరోమారు ఉద్యమ కార్యాచరణకు సిద్ధం కావాలన్నారు. అసోసియేట్ ఛైర్మన్ ఫణి పేర్రాజు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం నుంచి రావాల్సిన సౌకర్యాలు చెల్లించకపోవడం బాధాకరమని విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, ఐకాస సీనియర్ నాయకులు అల్ఫ్రెడ్ విచారం వ్యక్తం చేశారు. అధికారం చేపట్టిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్న ముఖ్యమంత్రి, మూడున్నరేళ్లయినా దాని ఊసేలేదని ఏపీసీపీఎస్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్థసారథి మండిపడ్డారు. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల సమస్యలపై ఆ సంఘాల ప్రధాన కార్యదర్శులు కె.సుమన్, భానోజీ, మహిళా ఉద్యోగుల సమస్యలు, చైల్డ్ కేర్, ప్రసూతి సెలవులు తదితర సమస్యలపై ఐకాస అమరావతి మహిళా నాయకురాలు జి.జ్యోతి మాట్లాడారు. ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్వరరావు, ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.ఆర్లయ్య తదితరులు ప్రసంగించారు. వివిధ సంఘాల నాయకులు ప్రసంగించారు.
* ఈ మహాసభలో ఏపీ ఐకాస అమరావతిలో మరో ఆరు సంఘాలు చేరాయి. ఈ సంఘాలు చేరికతో 100 సంఘాలు అయ్యాయని బొప్పరాజు చెప్పారు. ఈ సందర్భంగా కేకు కోసి సంబరాలు చేసుకున్నారు.
* సభలో తీసుకున్న నిర్ణయం మేరకు మేధావులైన ఏడుగురు సభ్యులతో సలహాదారులను ఏర్పాటు చేసినట్లు బొప్పరాజు తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ ఐకాస అమరావతికి నూతనంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గాన్ని, 26 జిల్లాల నూతన అధ్యక్ష, కార్యదర్శులను మహాసభకు బొప్పరాజు పరిచయం చేశారు.
ప్రమాణ స్వీకారం చేసిన నూతన కార్యవర్గం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యోగుల సొమ్ము.. జగన్ వమ్ము
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్ ఉద్యోగుల వరకు 35 వేల మంది ఉన్నారు. ఆర్టీసీ, సచివాలయ ఉద్యోగులు కలిపితే 56 వేల మంది వరకు ఉన్నారు. వీరంతా గత ఐదేళ్ల జగన్ జమానాలో నరకం అనుభవించారు. -
అక్కా.. చెల్లెమ్మలకు జగనన్న బురిడీ
[ 19-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 80 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలుండగా.. అందులో 8 లక్షల మందికిపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. -
కదిలొచ్చిన పసుపు దళం
[ 19-04-2024]
చేనేత పురి పసుపుమయంగా మారింది.. ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరెడ్డి గురువారం నామపత్రాలు దాఖలు చేశారు. ఉదయం 11:30 గంటలకు ఒక సెట్ వేశారు. బీవీ జయనాగేశ్వరరెడ్డి 2, ఆయన సతీమణి నిత్యాదేవి 2 సెట్లు వేశారు. -
భద్రత పేరుతో ఆంక్షలు
[ 19-04-2024]
నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద పోలీసు శాఖ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు అందరికీ ఇబ్బందిగా మారాయి. కర్నూలు ఎంపీ, పాణ్యం ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కలెక్టరేట్లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
వైకాపా పాలనలో వలసలే మిగిలాయి
[ 19-04-2024]
పశ్చిమ ప్రాంతంలో కరవును తరిమేసేందుకు తెదేపా హయాంలో వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2వేల కోట్లు మంజూరు చేశారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. -
నీరింకిన జలాశయం.. నెరవేరని ఆశయం
[ 19-04-2024]
తాగు, సాగునీరు అందించాలనే ఆశయంతో నిర్మించిన జలాశయాలు కళతప్పాయి. జలం లేక వెలవెలబోతున్నాయి. పశ్చిమ పల్లెలు దాహంతో తల్లడిల్లుతున్నా.. చుక్క నీరు అందించలేని పరిస్థితి. -
మహిళా కార్పొరేటర్ ఇంటిపై దుండగుడి దాడి
[ 19-04-2024]
కర్నూలు నగరంలోని ఎల్కూరుబంగ్లాలో ఉంటున్న 41వ వార్డు కార్పొరేటర్ శ్వేతారెడ్డి ఇంటి వద్ద ఓ దుండుగుడు హల్చల్ చేశాడు. -
నగరాభివృద్ధికి కృషి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టీజీ భరత్ కోరారు. ఎస్.ఎ.పి. క్యాంపు వద్ద గురువారం 4వ విడత సైకిల్ భరోసాయాత్ర చేపట్టారు. -
భావోద్వేగానికి గురైన కోట్ల
[ 19-04-2024]
కోడుమూరు తనదైనప్పటికీ కర్నూలు వదిలివెళ్లడం ఎంతో బాధగా ఉందని, జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయతలు తనను కట్టిపడేస్తున్నాయంటూ మాజీ కేంద్ర మంత్రి, డోన్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోట జయసూర్యప్రకాశ్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. -
డివైడర్ను ఢీకొన్న ప్రైవేటు బస్సు
[ 19-04-2024]
ఓర్వకల్లు మండలం పూడిచెర్లమెట్ట వద్ద జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. -
ఉద్యోగుల పింఛన్.. జగన్ వంచించెన్
[ 19-04-2024]
పాత పింఛను విధానాన్నే అమలు చేయండి మహాప్రభో అంటున్నా.. తన మతం తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. తాను అధికారంలోకి వచ్చాక సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పింఛను స్కిమ్) రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించారు. -
అతివలకు సాయం.. అంతంతమాత్రం
[ 19-04-2024]
గతంలో ఓ వెలుగు వెలిగిన పొదుపు సంఘాలు, గ్రామైక్య సంఘాలు ప్రస్తుత వైకాపా పాలనలో నిర్వీర్యమవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోంది. -
కదంతొక్కిన పసుపు దళం
[ 19-04-2024]
శ్రీశైల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి గురువారం నామపత్రం దాఖలు చేశారు. ముందుగా నల్లకాల్వ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
[ 19-04-2024]
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
గడప.. గడపకు వెళ్లాల్సిందే
[ 19-04-2024]
వాలంటీర్లు వైకాపా తరఫున ప్రచారం చేయాల్సిందేనని ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. -
వైకాపాను భూ స్థాపితం చేయాలి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేయాలని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు తహసీల్దారు కార్యాలయంలో గురువారం ఆయన నామపత్రం దాఖలు చేశారు. -
ప్రచండ భానుడు
[ 19-04-2024]
పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భానుడి ధాటికి జనం అల్లాడిపోతున్నారు. నంద్యాల జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటేశాయి. -
తొలి రోజు 11 మంది నామపత్రాల దాఖలు
[ 19-04-2024]
కర్నూలు జిల్లా పరిధిలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన గురువారం విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్