జీవితాలు మట్కాష్
మట్కా.. చీటీలు జీవితాలను లూటీ చేస్తున్నాయి. జూదానికి అలవాటు పడిన వారు అప్పులపాలవుతున్నారు. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిన కష్టంతో వచ్చిన ఆదాయాన్ని అందులో గుమ్మరిస్తున్నారు.
ఉచ్చులో చిక్కుకుంటున్న కూలీలు, యువత
రూ.కోట్లలో వ్యాపారం
అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
న్యూస్టుడే, ఆదోని నేరవార్తలు: మట్కా.. చీటీలు జీవితాలను లూటీ చేస్తున్నాయి. జూదానికి అలవాటు పడిన వారు అప్పులపాలవుతున్నారు. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిన కష్టంతో వచ్చిన ఆదాయాన్ని అందులో గుమ్మరిస్తున్నారు. ఈ ఆట మన రాష్ట్రంలో నిషేధం ఉన్నా.. ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతోంది. మాట్కా ఆటను అదుపు చేయాల్సిన పోలీసు శాఖ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ఆదోని డివిజన్లో ఈ మట్కా నిర్వహణతో రోజూ రూ.కోట్లలో లావాదేవీలు కొనసాగుతున్నాయి.
సరిహద్దే స్థావరం
ఆదోని ప్రాంతం కర్ణాటక సరిహద్దులో ఉండడంతో జిల్లాలో మట్కా ప్రభావం అధికంగా ఉంది. మట్కా నిర్వాహకులు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు, శిరుగుప, బళ్ళారి ప్రాంతాల్లో ఉంటూ ఆయా గ్రామాల్లో, పట్టణాల్లో తమ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని మట్కా కొనసాగిస్తున్నారు. ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం, ఆలూరు ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఆటకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. సోమవారం నుంచి శనివారం వరకు కొనసాగే ఈ ఆటపై ప్రధానంగా దినసరి కూలీలు, యువకులు అధికంగా ఆకర్షితులవుతూ సంపాదనలో సగానికి పైగానే ఈ మహమ్మారి ఆటపై పెట్టి సొమ్ము పోగొట్టుకుంటున్నారు.
కానరాని కఠిన చర్యలు
మట్కా నిర్వహణను అరికట్టాల్సిన పోలీసు శాఖ ఇటీవల నిఘా వైఫల్యంతో మట్కా నిర్వహణ చాపకింద నీరులా కొనసాగుతోంది. ప్రధానంగా పట్టణంలోని మట్కార్గేరిలో ఆరు చోట్ల, శక్తిగుడి ప్రాంతంలో 2, వాల్మీకినగర్లో 2, చౌదరిబావి ప్రాంతంలో 2, మార్కెట్ యార్డు ప్రాంతంలో 2, కౌడల్పేటలో 4, కొత్త బస్టాండు ప్రాంతంలో ఒకచోట, చిన్నమార్కెట్, క్రాంతినగర్లో 3, కల్లుబావి, ఇందిరానగర్, హనుమాన్నగర్ ప్రాంతాల్లో రెండు చోట్ల మట్కా నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. రోజూ రూ.లక్షల్లో లావాదేవీలు కొనసాగుతున్నాయని విశ్వసనీయ సమాచారం. ఇక్కడే కాకుండా ఆయా గ్రామాల్లోనూ మట్కా నిర్వాహకులు తమ ఏజెంట్లను నియమించుకొని మట్కా నిర్వహిస్తున్నారు. కొత్త అధికారులు వస్తే ఆయా స్టేషన్ల పరిధిలోని మట్కా బీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇస్తున్నారే తప్ప.. నియంత్రణపై దృష్టిసారించడం లేదు. మరికొందరు పోలీసు సిబ్బంది ప్రతి నెలా మట్కా బీటర్ల నుంచి మామూళ్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
రూపాయికి రూ.80
మహారాష్ట్రాలోని ముంబయి నగరంలో ఈ మట్కా ఆట నిర్వాహిస్తారు. అక్కడి నుంచి కర్ణాటక.. తర్వాత ఆంధ్రప్రదేశ్కు విస్తరించింది. బాంబే మిలన్, కల్యాణ్, కల్యాణ్ నైట్, మిలన్ నైట్ తదితర కంపెనీలకు సంబంధించి మట్కా నిర్వహిస్తారు. ఇందులో ఓపెన్ నెంబరు, క్లోజ్ నెంబర్లు రోజూ ప్రకటిస్తారు. ఓపెన్ లేక క్లోజ్ నెంబరుపై రూపాయి ఆడితే.. అదే నెంబరు వస్తే రూ.8 వస్తుంది. అదే ఓపెన్, క్లోజ్ రెండు నెంబర్లు కలిసి నెంబరుపై రూపాయి ఆడితే ఆ నెంబరు వస్తే రూ.80 వస్తోంది. రోజు కూలీలు సుమారు రోజుకు రూ.300 సంపాదిస్తే ఇందులో రూ.50 నుంచి రూ.100 దాకా పెట్టి తమ జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నారు.
నిర్వహణ ఇలా చేస్తూ..
మట్కా నిర్వాహకులపై పోలీసుల దృష్టి మరల్చేందుకు మట్కా బీటర్లు సామాజిక మాధ్యమాల ఆధారంగా కొనసాగిస్తున్నారు. నిర్వాహకులు మట్కా ఆడే వారి నుంచి ఫోన్ పే ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. మరికొందరు ఆయా ప్రాంతాల్లోని ఇళ్లలో మహిళల చేత డబ్బులు తీసుకొని మట్కా చీటీలు రాసుకుంటుండగా.. కొందరు యువకులు మట్కా నిర్వాహకుల వద్ద మట్కా చీటీలు రాసేందుకు రోజు కూలీలా పని చేస్తున్నారు. చాపకింద నీరులా కొనసాగుతున్న మట్కా నిర్వాహణపై జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టి అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా తోనే అభివృద్ధి
[ 18-04-2024]
మండలంలోని కలుగొట్ల, కృష్ణాపురం గ్రామాలలో మండల తెదేపా నాయకులు సుబ్బరాయుడు, బలరాం గౌడ్, జ్ఞానేశ్వర్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
రామళ్లకోటలో స్వామివారి కళ్యాణం
[ 18-04-2024]
మండలంలోని రామళ్లకోట గ్రామంలో శ్రీ వనం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా గురువారం స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. -
అక్రమ మద్యం పట్టివేత
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
[ 18-04-2024]
మండల కేంద్రమైన చిప్పగిరికి చెందిన రైతు కొండా చంద్ర విద్యుదాఘాతంతో గురువారం మృతి చెందారు. -
ఆస్పత్రిలో కనీస సదుపాయాలు కల్పించాలి
[ 18-04-2024]
ఆదోని జిల్లా సర్వజన ఆస్పత్రిలో మంచాల కోరతతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ఎన్నికల భేరి.. ప్రచార వే‘ఢీ’
[ 18-04-2024]
రెండు ఎంపీ స్థానాలు.. 14 అసెంబ్లీ స్థానాలున్న ఉమ్మడి జిల్లాలో గురువారం నుంచి రాజకీయం మరింత వే‘ఢీ’రాజుకోనుంది.. ఈ నెల 18 నుంచి ఈనెల 25 వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. -
జనం గుండెల్లో జగన్ విల్లం‘భూ’
[ 18-04-2024]
ప్రాజెక్టులు నిర్మించలేదు.. పరిశ్రమలు ఏర్పాటు లేదు.. రోడ్లు లేవు.. పల్లె మొదలు పట్టణం వరకు ప్ర‘గతి’ తప్పింది. ఫలితంగా స్థిరాస్తి రంగం కుప్పకూలింది. -
ఎమ్మెల్యే వస్తున్నారని.. ఉపాధి పనులు బంద్
[ 18-04-2024]
ఆదోని మండలం అరేకల్లో బుధవారం ఉపాధి పనులు చేపట్టలేదు. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని, ఉపాధి పనులు బంద్ చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మాటకారి మామయ్యా.. ‘దీవెన’లేవయ్య
[ 18-04-2024]
తల్లిదండ్రులు మీ పిల్లల్ని పాఠశాలలు, కళాశాలలకు పంపండి.. వారిని చదివించే బాధ్యత నేనే తీసుకుంటా’’ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అమ్మఒడి పథకం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తున్నాం. -
నిలువెల్లా గాయాలు.. నీళ్లు పారని కాల్వలు
[ 18-04-2024]
‘మాది రైతు ప్రభుత్వం.. పంటలు ఎండనీయం.. అన్నదాతల కంట నీరు రానీయం’ అని ఎన్నోసార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రసంగాలు ఊదరగొట్టారు. తీరా చూస్తే.. పంట కాల్వలు దయనీయంగా మారాయి. -
ఓట్ల ఆట!
[ 18-04-2024]
ఆటైనా.. ఓటైనా ప్రజలకు ఆసక్తికరమైన అంశాలే. ఉత్కంఠ రేకిత్తించే విషయాలే. తరచి చూస్తే ఈ రెండింటి మధ్య పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ఎక్కడ నలుగురు కలిసినా.. వీటికి సంబంధించిన విషయాలపైనే చర్చ కొనసాగుతోంది. -
పోలింగ్ శాతం పెంచేలా చర్యలు
[ 18-04-2024]
విధి నిర్వహణలో భాగంగా అధికారులు, ఉద్యోగులు నిబంధనలు పాటించాల్సిందేనని.. ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని కలెక్టర్ జి.సృజన అన్నారు. -
జగన్ మామయ్య దీవెనా.. అంతా మాయ
[ 18-04-2024]
విద్యార్థులకు ఆర్థిక సాయం, చదువుకు తోడ్పాడు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు వారికి ఖాళీ చేతులే చూపుతోంది. విద్యాభ్యాసానికి ఆటంకంగా మారింది. జగన్ చెప్పిన మాటలు నమ్మి ఉన్నత చదువులు చదువుదామని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది. -
సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధి చెప్పండి
[ 18-04-2024]
సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ‘ప్రజాగళం’లో భాగంగా పట్టణంలోని బీసీ కాలనీలో ఆయన పర్యటించారు. -
రహదారుల బాగుకు చర్యలు : బుగ్గన
[ 18-04-2024]
వైకాపా వెన్నుపోటుదారులకు, అవాకులు చవాకులు మాట్లాడే వారికి ఎన్నికల తర్వాత కోలుకోలేని విధంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. -
కర్నూలు నియోజకవర్గం చుట్టూ మూడు చెక్పోస్టులు
[ 18-04-2024]
కర్నూలు నియోజకవర్గం చుట్టూ 24 గంటలు నిఘా ఉంచేందుకు మూడు స్టాటస్టికల్ సరైలైన్స్ టీమ్లతో కూడిన చెక్పోస్టులను ఏర్పాటుచేస్తూ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల అధికారి, కర్నూలు నగరపాలకసంస్థ కమిషనర్ భార్గవ్తేజ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
నామినేషన్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకానుంది. -
వైకాపా అంతర్గత వైరం.. బహిరంగం
[ 18-04-2024]
వైకాపా అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. బలనిరూపణ, సామాజికవర్గంలో పెత్తనం, గ్రామాలు, మండలాల్లో ఆధిపత్యం చెలాయించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ విభేదాలు బహిర్గతమవుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం