logo

కారు బోల్తా : ముగ్గురికి గాయాలు

నిద్రమత్తు కారణంగా పుల్లూరు టోల్‌ప్లాజాకు సమీపంలోని వాగులో కారు బోల్తా పడటంతో ముగ్గురికి గాయాలైన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండల పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.

Published : 06 Feb 2023 03:17 IST

వాగులో పడటంతో నుజ్జునుజ్జైన కారు

ఉండవల్లి, న్యూస్‌టుడే : నిద్రమత్తు కారణంగా పుల్లూరు టోల్‌ప్లాజాకు సమీపంలోని వాగులో కారు బోల్తా పడటంతో ముగ్గురికి గాయాలైన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండల పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం కర్నూలుకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి, వంశీ, అనిల్‌కుమార్‌రెడ్డి కారులో జాతీయ రహదారిగుండా ఆదివారం తెల్లవారుజామున కర్నూలు వైపు వెళ్తున్నారు. పుల్లూరు టోల్‌ప్లాజా సమీపంలోకి రాగానే నిద్రమత్తు కారణంగా కారు జాతీయ రహదారి రెయిలింగ్‌ పక్కన నుంచి దూసుకెళ్లి వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్‌రెడ్డికి తీవ్రగాయాలు, అనిల్‌కుమార్‌రెడ్డి, వంశీకి స్వల్ప గాయాలవగా జాతీయ రహదారి అంబులెన్సులో కర్నూలు ఆసుపత్రికి తరలించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని