logo

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

ఆదోని పట్టణంలోని శంకర్‌నగర్‌కు చెందిన జనసేన క్రియాశీల కార్యకర్త నామాల పరశురామ్‌ ఇటీవల మృతిచెందాడు.

Updated : 06 Feb 2023 20:54 IST

ఆదోని మార్కెట్‌: ఆదోని పట్టణంలోని శంకర్‌నగర్‌కు చెందిన జనసేన క్రియాశీల కార్యకర్త నామాల పరశురామ్‌ ఇటీవల మృతిచెందాడు. దీంతో ఆయన కుటుంబానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లిశెట్టి సత్యనారాయణ రూ.5లక్షల చెక్కు అందజేశారు. సోమవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. గత ఏడాది నవంబర్‌లో పరశురామ్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో మృతి విషయాన్ని పార్టీ నియోజకవర్గ బాధ్యుడు మల్లప్ప అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన పవన్‌ కల్యాణ్‌ పార్టీ తరఫున రూ.5లక్షలు అందించాలని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని