లోకేశ్ పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారు
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు పెద్దఎత్తున జనాదరణ లభిస్తోందని, దీనిని చూసి ఓర్వలేక వైకాపా ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు పెద్దఎత్తున జనాదరణ లభిస్తోందని, దీనిని చూసి ఓర్వలేక వైకాపా ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. దీనిని చూస్తుంటే ముఖ్యమంత్రి తన ఓటమిని ముందుగానే ఒప్పుకున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ తెదేపా బాధ్యుడు బి.వి.జయనాగేశ్వరరెడ్డితో కలిసి సోమవారం మాట్లాడారు. తెదేపా నాయకులపై అక్రమ కేసులు పెట్టడం తప్ప ఈ ప్రభుత్వం ఏమి చేసిందని ప్రశ్నించారు. సీఎం బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి నాలుగేళ్లవుతున్నా హంతకులను పట్టుకోకుండా ఏం చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్ సహకరించి ఉంటే పది రోజుల్లోనే ఈ కేసు తేలిపోయేదన్నారు. రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్గా మార్చారని... రాష్ట్రం తిరిగి గాడిలో పడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పారు.
ఎవరిని మోసం చేస్తున్నారు
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాయలసీమ ప్రాంతంపై వివక్ష చూపుతోందని బీవీ జయనాగేశ్వర రెడ్డి ధ్వజమెత్తారు. అప్పర్ భద్రపై తక్షణమే న్యాయ పోరాటమని.. దీనిని ఆపేయాలంటూ ప్రభుత్వం చెబుతోందని.. అసలు ఎవరు.. ఎవరిని ఆదేశించాలని ప్రశ్నించారు. దీనిపై పార్లమెంటులో నిలదీయకుండా పోరాటం చేస్తామని ప్రకటనలతో సరిపెడుతున్నారని అన్నారు. ఆర్డీఎస్, వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులకు తెదేపా ప్రభుత్వం నిధులు మంజూరు చేసి.. టెండర్లు పిలిచిందని.. మరి చంద్రబాబును రాయలసీమ ద్రోహి అని ఎలా అంటారని నిలదీశారు. దమ్ముంటే గుండ్రేవులకు జాతీయ హోదా తీసుకురావాలని సవాల్ విసిరారు. రాజోలి, జొలదరాశి, బ్రహ్మంసాగర్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు స్వయాన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపనలు చేశారని, ఒక్క అడుగైనా పడిందా అని ప్రశ్నించారు. కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టి దేశాన్ని బాగు చేస్తానంటున్నారని.. మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్కు వెళ్లింది ఎవరు అని నిలదీశారు. మీ రహస్య మిత్రుడి ద్వారా అడ్డుకుని సీమకు అన్యాయం చేస్తున్నది మీరు కాదా అని దుయ్యబట్టారు. గుండ్రేవుల, ఆర్డీఎస్కు నిధులు మంజూరు చేయాలని, జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సోమిశెట్టి వెంకటేశ్వర్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆలూరులో ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
తెదేపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలూరులో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు పార్టీ డాక్టర్ సెల్ కార్యదర్శి నెట్టెప్ప ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. -
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
[ 29-03-2024]
తమది విజన్.. జగన్ది పాయిజన్ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. -
తెదేపాతోనే పేదలకు న్యాయం
[ 29-03-2024]
తెదేపాతోనే పేద, బడుగు, బలహీన వర్గాల వారికి న్యాయం జరుగుతుందని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి నర్సప్ప అన్నారు. -
సీ బెళగల్లో తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
మండలకేంద్రమైన సీ బెళగల్లో శుక్రవారం మండల తెదేపా నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
పశ్చిమాన జగన్ పచ్చి మోసం
[ 29-03-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 19 మండలాలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి. ఆయా మండలాల్లో 4,84,619.2 హెక్టార్ల (82.05 శాతం) సాగు భూమి విస్తరించి ఉంది. -
జగనన్నా..కరవు సీమ కష్టాలు చూడవా
[ 29-03-2024]
కనిపించలేదా కరవు రైతు వేదన.. వినిపించలేదా పశ్చిమ పల్లెల కన్నీటి రోదన. పొలాలు బీడుబారాయి.. ఊరిలో పనులు కరవయ్యాయి.. ఇళ్లకు తాళాలు పడ్డాయి.. -
వసతిగృహాల్లో ఆకలికేకలు
[ 29-03-2024]
విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, మామయ్యలా అండగా వారికి ఉంటానని ఎక్కడికక్కడ ఊదరగొట్టే ప్రసంగాలతో అదరగొట్టే జగన్ పిల్లలకు భోజనాన్ని అందించే వార్డు సంరక్షకుల సమస్యల్ని కూడా పట్టించుకోవడం లేదు -
ప్రయాణికులకు పరీక్ష
[ 29-03-2024]
బస్సులన్నీ మేమంతా సిద్ధం సభకు తరలివెళ్లాయి. ఆర్టీసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి వైకాపా వారు అడిగింతే తడవుగా బస్సులన్నింటినీ మళ్లించారు -
ముఖ్యమంత్రి జగన్రెడ్డి క్షమాపణలు చెప్పి పర్యటించండి
[ 29-03-2024]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని, తెదేపా హయాంలో రూ.2 వేల కోట్లతో మంజూరు చేసిన ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టు పనులకు పైసా నిధులు ఇవ్వని ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పి పర్యటించాలని ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం
[ 29-03-2024]
తాము 40 ఏళ్లుగా రాజకీయాలకతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నామని, 20 రోజుల ముందు వచ్చిన ఓ వ్యక్తి ప్రజలకు సేవ చేస్తామని.. ఓటేయండి అని అంటున్నారని.. ఆ మాటలు నమ్మొద్దని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్ కోరారు. -
తెదేపాను గెలిపించుకుందాం
[ 29-03-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపాను గెలిపించుకుందామని మాజీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు. కల్లూరు మండల పరిధి పర్ల గ్రామంలో గురువారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు -
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత జగన్మోహన్రెడ్డిదే
[ 29-03-2024]
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిదేనని మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు