logo

ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

ఓ యువకుడు ఉద్యోగం రాలేదని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే ఎస్సై రామస్వామి తెలిపారు.

Published : 07 Feb 2023 04:30 IST

ఎం.ప్రసాద్‌ (పాత చిత్రం)

ఆదోని పట్టణం, న్యూస్‌టుడే: ఓ యువకుడు ఉద్యోగం రాలేదని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే ఎస్సై రామస్వామి తెలిపారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ఎం.ప్రసాద్‌(26) మూడేళ్లుగా ఉద్యోగం రాకపోవటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఆదోని- నగరూరు రైల్వే స్టేష్టన్ల మధ్య 493-8-10 కి.మీ. సంఖ్య వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఆదోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని