logo

జనసేన కార్యకర్తకు రూ.5 లక్షల సాయం

జనసేన పార్టీ జనసైనికులకు.. వారి కుటుంబాలకు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అండగా ఉంటారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు.

Published : 07 Feb 2023 04:30 IST

కుటుంబ సభ్యులకు చెక్కు అందజేస్తున్న జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, మల్లప్ప

ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే: జనసేన పార్టీ జనసైనికులకు.. వారి కుటుంబాలకు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అండగా ఉంటారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. ఆదోని పట్టణంలోని శంకర్‌నగర్‌కు చెందిన జనసేన కార్యకర్త నామాల పరుశురాం మృతిచెందగా.. పెద్దరాజు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వీరి కుటుంబాలకు అండగా నిలవాలనుకున్నారు. సత్యనారాయణ, ఆదోని బాధ్యుడు మల్లప్పతో కలిసి వెళ్లి  సోమవారం కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రూ.5 లక్షల చెక్కును మృతుడి కుటుంబ సభ్యులకు అందించారు. గాయపడిన పెద్దరాజుకు రూ.16,500 చెక్కు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు సురేశ్‌, సుధాకర్‌, అనిత, హసీనాబేగం, రాజేశ్వరి, చల్లా వరుణ్‌, రాజశేఖర్‌, తిరుమలరెడ్డి, వెంకటేశు, తాహెర్‌వలి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని