Andhra News: రూ.3 లక్షల పెట్టుబడి.. రెండు రోజుల్లో రూ. 30 లక్షల ఆదాయం
రెండు రోజుల్లో రూ.3 లక్షల పెట్టుబడితో ఏకంగా రూ.30 లక్షల ఆదాయం గడించారు. ఇది వ్యాపారం చేసి సంపాదించింది కాదు.
కాయ్రాజా కాయ్.. రూ.లక్షలు మేసెయ్
భోగేశ్వరంలో నిర్వహిస్తున్న కాయ్రాజా కాయ్
గడివేముల, న్యూస్టుడే : రెండు రోజుల్లో రూ.3 లక్షల పెట్టుబడితో ఏకంగా రూ.30 లక్షల ఆదాయం గడించారు. ఇది వ్యాపారం చేసి సంపాదించింది కాదు. భక్తుల నుంచి దోచుకున్నది. స్వామివారిని దర్శించుకుని పిల్లలకు పండ్లు, మిఠాయిలు, ఆటబొమ్మలు తీసుకెళదామని వచ్చిన భక్తులకు ఆశ చూపి వారి జేబులు గుల్ల చేశారు. రూపాయికి రూ.10 అని, రూ.10కి రూ.వంద అని ఆశచూపి వారివద్ద ఉన్నదంతా దోచుకున్నారు. ఇదీ కర్నూలు జిల్లా గడివేములలోని దుర్గాభోగేశ్వర క్షేత్రంలో గ్యాంబ్లింగ్ నిర్వాహకులు చేసిన మాయ. పవిత్ర క్షేత్రంలో యథేచ్ఛగా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నా అధికారులు చూడనట్లు వ్యవరించడంపై పలు ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి.
* శ్రీదుర్గాభోగేశ్వర క్షేత్రంలో జరిగిన శివరాత్రి మహోత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అక్కడితో ఆధ్యాత్మిక కార్యక్రమం ముగించారు. స్వామి వారిని దర్శించుకుని ప్రశాంతంగా ఇళ్లకు వెళాల్సిన భక్తులను ప్రలోభపెట్టేందుకు కొందరు ఇక్కడ జూద కార్యక్రమాలు నిర్వహించారు. భోగేశ్వరంలో కాయ్రాజా కాయ్ ఆట నిర్వహించారు. గత 15 సంవత్సరాలుగా మండలంలో ఇలాంటి ఆటను నిర్వహించకుండా అధికారులు చర్యలు తీసుకునేవారు. ఈఏడాది అధికారులే అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిర్వాహకులు రెచ్చిపోయారు. పదుల సంఖ్యలో టేబుళ్లు ఏర్పాటు చేసి బహిరంగంగా ఆట నిర్వహించారు. భక్తుల నుంచి రెండు రోజుల పాటు యథేచ్ఛగా దోచుకున్నారు.
మామూళ్లు ఇచ్చి దోపిడీ
కాయ్ రాజాకాయ్ ఆట నిర్వహణకు అధికారులకు రూ.3 లక్షల మామూళ్లు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే బహిరంగంగా జూదక్రీడ నిర్వహించారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. భక్తుల నుంచి రెండు రోజుల్లో రూ.30 లక్షలు దోచుకున్నట్లు చర్చించుకుంటున్నారు. కొందరు తెచ్చుకున్న డబ్బులు అయిపోతే ఇంటికెళ్లి తెచ్చుకుని మళ్లీ ఆడటం గమనార్హం. చిన్నపిల్లలు, యువకులు సైతం డబ్బులు పోగొట్టుకున్నారు. రూ.వేలల్లో డబ్బు పోగొట్టుకున్న వారు లబోదిబోమంటున్నారు. మండలంలో ఎన్నడూ లేని విధంగా కాయ్రాజా కాయ్కు అనుమతులు ఇచ్చిన అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ.. జగన్ నిర్లక్ష్యం చేసి
[ 24-04-2024]
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రగల్బాలు పలికిన జగన్ ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఐదువందలు కేటాయించలేదు.. కేసీ కాల్వకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూపాయి వెచ్చించలేదని శాసనసభా సాక్షిగా ‘కాగ్’ తేల్చింది.. -
గ్రామ స్వరాజ్యం.. జగనాసుర అరాచకం
[ 24-04-2024]
పంచాయతీ, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు స్థానిక ప్రభుత్వాలుగా వ్యవహరిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాల్సి ఉండగా వాటిపై జగన్ కుట్ర పన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం -
బలగం పెంచుకుని బరిలోకి!
[ 24-04-2024]
వైకాపాలో విభేదాలు... ఐదేళ్లుగా ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం.. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మల్చుకొని విజయం దిశగా వెళ్లాలని కోడుమూరు తెదేపా నేతలు వ్యూహాలకు పదునుపెట్టారు. -
డీసీసీబీ తాత్కాలిక సీఈవోపై వేటు
[ 24-04-2024]
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తాత్కాలిక ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) శివలీలపై వేటు పడింది. -
కోట్ల గూటికి పాత నేతలు
[ 24-04-2024]
ఇన్నాళ్లు పార్టీని ఉపయోగించుకొని వీడిన వారికి తాము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా రిటర్న్గిఫ్ట్ ఇస్తామని అధికారపార్టీ నేత హెచ్చరికలు ‘డోన్’ నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి.. -
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే
[ 24-04-2024]
‘నా జీవితం నాశనం కావడానికి కారణం నువ్వే. మీ కుటుంబం నాకు అన్యాయం చేసింది’ అంటూ ఓ మహిళ నంద్యాల వైకాపా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి సతీమణి, కౌన్సిలర్ నాగినిరెడ్డిని నిలదీయడం తీవ్ర చర్చనీయాంశమైంది. -
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయం
[ 24-04-2024]
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయమని ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ అన్నారు. మండలంలోని తంగడరడోణ, తుర్వగల్లు, తొగలగల్లు, యాటకల్లు, కల్లపరి, చొక్కనహళ్లి, శంకరబండ తదితర గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగనన్న వెన్నుపోటు.. పల్లెల తిరుగుబాటు
[ 24-04-2024]
ప్రస్తుతం పల్లెలు కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్నాయి. జగన్ ప్రభుత్వం నిర్వాకంతో సమస్యలతో సతమతమవుతున్నాయి. కనీసం కుళాయి బిగించేందుకు కూడా చిల్లర లేని పరిస్థితి. కేంద్రం నుంచి వచ్చే నిధులను సైతం మళ్లించి.. -
పాణ్యం ఎన్నికల్లో ప్రముఖం
[ 24-04-2024]
పాణికేశ్వరస్వామి పేరుతో పాణ్యం గ్రామం ఏర్పడింది. కాలక్రమేణా నియోజకవర్గంగా మారింది. కర్నూలు, నంద్యాల మధ్య వారధిగా ఉన్న పాణ్యం నియోజకవర్గం అత్యంత కీలకం. జిల్లాలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం కావడం విశేషం. -
పుస్తక పుటలకు జగనన్న చెద
[ 24-04-2024]
గ్రంథాలయాల్లో పాఠకుల్ని సమస్యలు వేధిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. పాఠకులకు కొత్త పుస్తకాలు అందుబాటులో ఉండటం లేదు. -
కాటసాని ఆస్తులు రూ.75.19 కోట్లు
[ 24-04-2024]
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.75.19 కోట్లుగా చూపారు. సోమవారం నామినేషన్తోపాటు ఇచ్చిన అఫిడవిట్లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించిన రిటర్నింగ్ అధికారి నారపురెడ్డి మౌర్య వాటిని సవరించాలని సూచించారు. -
టీజీ భరత్ నామపత్రం దాఖలు
[ 24-04-2024]
కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి మంగళవారం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. తెదేపా అభ్యర్థి టీజీ భరత్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.