ఖాళీ స్థలం.. అధికార ఆదాయం
చేనేత పురిలో అధికార పార్టీ నేతలు కొత్త దందా మొదలుపెట్టారు. ఆదాయ వనరుల పేరిట ఖాళీ స్థలాల్లో దుకాణాలు నిర్మిస్తున్నారు.
దుకాణాల నిర్మాణమంటూ దందా
రోడ్డున పడ్డ చిరు వ్యాపారులు
ఎమ్మిగనూరులో తొలగించిన చిరు వ్యాపారుల దుకాణాలు
న్యూస్టుడే, ఎమ్మిగనూరు: చేనేత పురిలో అధికార పార్టీ నేతలు కొత్త దందా మొదలుపెట్టారు. ఆదాయ వనరుల పేరిట ఖాళీ స్థలాల్లో దుకాణాలు నిర్మిస్తున్నారు. అక్కడ ఏళ్లుగా జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులను ఖాళీ చేయించి దుకాణాల పేరిట దూరి పోతున్నారు. చేతికి మట్టి అంటకుండా ఆయా శాఖల ఆధ్వర్యంలో దుకాణాలు నిర్మిస్తున్నారు. వాటి కేటాయింపులో ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఒక్కో దుకాణానికి రూ.9 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మార్కెట్ యార్డు సమీపంలో, స్టేషన్ పక్కన, చిరు వ్యాపారుల దుకాణాలు ఇటీవల పురపాలక శాఖ అధికారులు దౌర్జన్యంగా తొలగించారు. పురపాలక సంఘంలోని ఓ ప్రజా ప్రతినిధి తెర వెనుక చక్రం తిప్పి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.’’
మార్కెట్ యార్డులో పాగా
ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో గతంలో ఎలాంటి దుకాణాలు లేవు. వైకాపా ప్రభుత్వం అధికారంలో వచ్చాక.. ఆదాయ వనరుల పేరిట దుకాణాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కోసిగి దారిలో ఎనిమిది, ఆదోని- మంత్రాలయం రహదారిలో ఎనిమిది నిర్మించారు. గుడ్విల్, ప్రజా ప్రతినిధి మామూళ్ల కింద దాదాపు రూ.50 లక్షలకు పైగా వసూలు చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇందులో అధికార పార్టీకి చెందిన పురపాలక ప్రజాప్రతినిధి చక్రం తిప్పినట్లు సమాచారం.
రూ.వంద కోట్ల ఆస్తులపై కన్ను
వీవర్స్ కాలనీలో మైదానం పేరుతో సర్వే నంబరు 431లో 6.23 ఎకరాల స్థలాన్ని వదిలేశారు. 1947 మద్రాసు చట్టం ప్రకారం ఈ స్థలాలు పురపాలక చట్టం పరిధిలోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఓపెన్ స్థలం కింద రావడంతో ప్రజల సౌకర్యార్థం వ్యాయామం, క్రీడలు ఇతర సౌకర్యాలకు స్థలం వదలిపెట్టాలి. ఈ స్థలంపై ఎవరికీ హక్కు ఉండదు. ఇక్కడ సెంటు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పలుకుతోంది. ప్రస్తుతం అక్కడ కొందరితో డబ్బాలు వేయించారు. దాని విలువ రూ.50 లక్షలు ఉంటుంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధి జోక్యంతో మైదానంలో 12 రేకుల షెడ్లు వెలిశాయి. మామూళ్లు తీసుకుని ప్రోత్సహించారనే ఆరోపణలున్నాయి.
పేదల బతుకులు కూల్చి..
* ఎమ్మిగనూరు పట్టణంలో శ్రీనివాస కూడలి నుంచి మార్కెట్ యార్డుకు వెళ్లే దారి పక్కన 25 మంది చిరు వ్యాపారులు గత 40 ఏళ్లుగా బతుకుబండిని లాగిస్తున్నారు. డబ్బాలు వేసుకుని వడ్రంగి, దర్జీ, పండ్లు, ఇతర వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఏటా మున్సిపాలిటీకి రూ.2,500 పన్ను చెల్లిస్తున్నారు. ప్రధాన రహదారి, ఆసుపత్రి పక్కనే ఉండటంతో ఇక్కడ సెంటు రూ.20 లక్షల వరకు పలుకుతోంది. ఇంకేముంది ఖాళీ స్థలంపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. అక్కడ దుకాణాలు నిర్మించాలని పుర అధికారులను ఆదేశించారు. ‘అధికారం’ ఆదేశించడంతో అధికారులు చిరు వ్యాపారుల స్థావరాలు కూల్చివేశారు.
* ఖాళీ స్థలంలో 21 దుకాణాలు నిర్మించేందుకు పురపాలక శాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. నిబంధనల ప్రకారం పట్టణ ప్రణాళిక అనుమతులు తీసుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్మాణాలకు శ్రీకారం చుట్టాలి. ఇవేవీ ఇక్కడ కొనసాగడం లేదు. ఒక్కో దుకాణం నిర్మాణానికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల బేరం కుదిరినట్లు సమాచారం. ఇందులో ‘అధికార’ మామూళ్లు రూ.9 లక్షలు సమర్పించుకోవాల్సి ఉంటుందని నేతలు చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. దుకాణాలన్నీ తన అనుచరులకే ఇప్పించుకోవడానికి ఓ ప్రజాప్రతినిధి ప్రయత్నిస్తున్నారు. ‘మాకు దుకాణాలు ఇవ్వండని సదరు ప్రజాప్రతినిధి వద్దకు చిరు వ్యాపారులు వెళ్తే.. మీకు ఇచ్చేది లేదు.. ఇతరులకు ఇచ్చేస్తాం’ అని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.
పాత భవనాలు కూల్చి..
పట్టణంలో పోలీస్స్టేషన్ పక్కన పంచాయతీ కార్యాలయానికి సంబంధించిన స్థలాలు ఉన్నాయి. అక్కడున్న పాత భవనాలు కూల్చి వేశారు. ప్రణాళిక విభాగం అధికారుల అనుమతులు లేకుండానే దుకాణాల నిర్మాణానికి పునాదులు వేశారు. ఒక్కో దుకాణానికి నేతలు రూ.9 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు రాకుండానే నిర్మాణాలు ప్రారంభించారు.
30 ఏళ్ల నుంచి జీవనం
ఓంకారప్ప, చిరు వ్యాపారి, ఎమ్మిగనూరు
30 ఏళ్ల నుంచి ఆసుపత్రి పక్కనే స్థలంలో చిన్న గుడిసె వేసుకొని జీవనం సాగిస్తూ.. వ్యాపారం చేస్తున్నాం. తడకలు అల్లి అమ్ముకుంటూ బతుకున్నాం. ఆ డబ్బుతో మా కుటుంబాన్ని పోషిస్తున్నా. నెల రోజుల కిందట గుడిసె, బండలు తొలగించారు. జీవనాధారం కోల్పోయాం. దుకాణాలు నిర్మించి తమకు ఇవ్వాలని అడిగినా అధికారులు, ప్రజాప్రతినిధి స్పందించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అహోబిలంలో ఘనంగా స్వాతి వేడుకలు
[ 24-04-2024]
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో బుధవారం స్వాతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ప్లాస్టిక్ నివారణకు సహకరించండి
[ 24-04-2024]
శ్రీశైలం అటవీ శాఖలో ప్లాస్టిక్ నివారణకు సహకరించాలని శ్రీశైలం, నాగార్జున సాగర్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ బీఎన్ఎన్ మూర్తి అన్నారు. -
మైనారిటీల అభివృద్ధిని విస్మరించిన వైకాపా
[ 24-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల నుంచి మైనార్టీల అభివృద్ధిని విస్మరించిందని మండల ముస్లిం మైనారిటీ నాయకులు నజీర్ సాహెబ్, ఫక్రుద్దీన్, బేతాళ భలే సాహెబ్, మదీనా అన్నారు. -
తెదేపాను గెలిపిస్తే అర్హలందరికీ సంక్షేమ పథకాలు
[ 24-04-2024]
రాష్ట్రంలో తెదేపాను గెలిపిస్తే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి అన్నారు. -
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
[ 24-04-2024]
‘నా జీవితం నాశనం కావడానికి కారణం నువ్వే. మీ కుటుంబం నాకు అన్యాయం చేసింది’ అంటూ ఓ మహిళ నంద్యాల వైకాపా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి సతీమణి, కౌన్సిలర్ నాగినిరెడ్డిని నిలదీయడం తీవ్ర చర్చనీయాంశమైంది. -
కేసీ.. జగన్ నిర్లక్ష్యం చేసి
[ 24-04-2024]
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రగల్బాలు పలికిన జగన్ ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఐదువందలు కేటాయించలేదు.. కేసీ కాల్వకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూపాయి వెచ్చించలేదని శాసనసభా సాక్షిగా ‘కాగ్’ తేల్చింది.. -
గ్రామ స్వరాజ్యం.. జగనాసుర అరాచకం
[ 24-04-2024]
పంచాయతీ, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు స్థానిక ప్రభుత్వాలుగా వ్యవహరిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాల్సి ఉండగా వాటిపై జగన్ కుట్ర పన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం -
బలగం పెంచుకుని బరిలోకి!
[ 24-04-2024]
వైకాపాలో విభేదాలు... ఐదేళ్లుగా ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం.. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మల్చుకొని విజయం దిశగా వెళ్లాలని కోడుమూరు తెదేపా నేతలు వ్యూహాలకు పదునుపెట్టారు. -
డీసీసీబీ తాత్కాలిక సీఈవోపై వేటు
[ 24-04-2024]
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తాత్కాలిక ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) శివలీలపై వేటు పడింది. -
కోట్ల గూటికి పాత నేతలు
[ 24-04-2024]
ఇన్నాళ్లు పార్టీని ఉపయోగించుకొని వీడిన వారికి తాము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా రిటర్న్గిఫ్ట్ ఇస్తామని అధికారపార్టీ నేత హెచ్చరికలు ‘డోన్’ నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి.. -
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయం
[ 24-04-2024]
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయమని ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ అన్నారు. మండలంలోని తంగడరడోణ, తుర్వగల్లు, తొగలగల్లు, యాటకల్లు, కల్లపరి, చొక్కనహళ్లి, శంకరబండ తదితర గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగనన్న వెన్నుపోటు.. పల్లెల తిరుగుబాటు
[ 24-04-2024]
ప్రస్తుతం పల్లెలు కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్నాయి. జగన్ ప్రభుత్వం నిర్వాకంతో సమస్యలతో సతమతమవుతున్నాయి. కనీసం కుళాయి బిగించేందుకు కూడా చిల్లర లేని పరిస్థితి. కేంద్రం నుంచి వచ్చే నిధులను సైతం మళ్లించి.. -
పాణ్యం ఎన్నికల్లో ప్రముఖం
[ 24-04-2024]
పాణికేశ్వరస్వామి పేరుతో పాణ్యం గ్రామం ఏర్పడింది. కాలక్రమేణా నియోజకవర్గంగా మారింది. కర్నూలు, నంద్యాల మధ్య వారధిగా ఉన్న పాణ్యం నియోజకవర్గం అత్యంత కీలకం. జిల్లాలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం కావడం విశేషం. -
పుస్తక పుటలకు జగనన్న చెద
[ 24-04-2024]
గ్రంథాలయాల్లో పాఠకుల్ని సమస్యలు వేధిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. పాఠకులకు కొత్త పుస్తకాలు అందుబాటులో ఉండటం లేదు. -
కాటసాని ఆస్తులు రూ.75.19 కోట్లు
[ 24-04-2024]
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.75.19 కోట్లుగా చూపారు. సోమవారం నామినేషన్తోపాటు ఇచ్చిన అఫిడవిట్లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించిన రిటర్నింగ్ అధికారి నారపురెడ్డి మౌర్య వాటిని సవరించాలని సూచించారు. -
టీజీ భరత్ నామపత్రం దాఖలు
[ 24-04-2024]
కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి మంగళవారం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. తెదేపా అభ్యర్థి టీజీ భరత్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ