పెద్దాసుపత్రికి గుండెపోటు
కర్నూలు నగరంలోని నంద్యాల చెక్పోస్టు ప్రాంతానికి చెందిన నాగార్జునకు 34 ఏళ్లు.. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సర్వజన వైద్యశాలలోని అత్యవసర విభాగంలో చేరారు.
సర్వజన వైద్యశాలలో కార్డియాలజీ విభాగం
కర్నూలు నగరంలోని నంద్యాల చెక్పోస్టు ప్రాంతానికి చెందిన నాగార్జునకు 34 ఏళ్లు.. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సర్వజన వైద్యశాలలోని అత్యవసర విభాగంలో చేరారు. పరీక్షలు చేయగా గుండెపోటు అని వైద్యులు నిర్ధారించారు. కార్డియాలజీ విభాగం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కర్నూలు నగరానికి చెందిన 27 ఏళ్ల లోకేశ్ గత నెలలో గుండెనొప్పి రావడంతో కార్డియాలజీ విభాగంలో చేరి వైద్యం పొందారు.
కర్నూలు వైద్యాలయం, న్యూస్టుడే: ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారికే గుండెజబ్బులు వస్తాయనుకునేవారు. ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. మూడు పదుల వయసులోనే గుండెపోటుతో చనిపోతున్నవారు ఎక్కువగా ఉంటున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కేసులు సర్వజన వైద్యశాలకు నెలకు 100 వరకు వస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు, ఒంగోలు, అనంతపురం, తెలంగాణ రాష్ట్రం గద్వాల, వనపర్తి జిల్లాల నుంచి బాధితులు వస్తుంటారు. ఇక్కడ క్యాథ్ల్యాబ్ పని చేయకపోవడంతో ప్రైవేటుకు పంపిస్తున్నారు.
టెండర్ల దశలోనే క్యాథ్ల్యాబ్
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 89 పీహెచ్సీలు, 18 సీహెచ్సీలు, నంద్యాల జిల్లా ఆసుపత్రి, ఆదోని ప్రాంతీయ ఆసుపత్రులు ఉన్నాయి. ఎక్కడా గుండె వ్యాధులకు సంబంధించి వైద్య సేవలు లేవు. గుండెపోటు వచ్చిందంటే బాధితులు 108 వాహనంలో పెద్దాసుపత్రికి చేరాల్సిందే. అక్కడ క్యాథ్ల్యాబ్ మరమ్మతులకు గురైంది. కొత్తది ఏర్పాటు చేయాలని టెండర్లు పిలిచి ఏడాదైనా అతీగతీ లేదు. క్యాథ్ల్యాబ్ లేకపోవడంతో కేవలం నాడి పట్టి ప్రైవేటుకు రెఫర్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఏ మూల నుంచి కర్నూలుకు రావాలన్నా సుమారు 100 కి.మీ. దాటాల్సిందే. అక్కడి నుంచి వచ్చేలోగా వైద్యం అందక ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది.
ఓపీ వెయ్యి దాటుతోంది
సర్వజన వైద్యశాలలోని గుండె జబ్బుల విభాగానికి నెలకు 1,100 నుంచి 1,200 వరకు ఓపీ ఉంటోంది. అందులో 250 నుంచి 300 మంది ఆసుపత్రిలో చేరుతున్నారు. ఆసుపత్రిలో టూడీ ఎకోలు 15 వేలు ఉన్నాయి.. వాటిలో యాంజియోగ్రామ్లు ఏడాదికి 800 వరకు ఉంటున్నాయి. 300 మందికి స్టెంట్లు వేస్తున్నారు. కార్డియోథోరాసిక్ విభాగంలో నెలకు 10 నుంచి 15 మందికి శస్త్రచికిత్సలు చేస్తున్నట్లు ఆసుపత్రి లెక్కలు చెబుతున్నాయి.
ప్రైవేటుకు పంపిస్తున్నారు
సర్వజన వైద్యశాలలో క్యాథ్ల్యాబ్ మరమ్మతులకు గురై రెండేళ్లు అవుతోంది. యాంజియోగ్రామ్, స్టెంట్లు వేసే పరిస్థితి లేదు. బాధితులను విశ్వభారతికి పంపిస్తున్నారు. 891 యాంజియోగ్రామ్లు, 263 స్టెంట్లు విశ్వభారతి ఆసుపత్రిలో చేశారు. ఆసుపత్రికొచ్చే ఆరోగ్యశ్రీ నిధులు మళ్లించి చేయడం గమనార్హం. ఆరోగ్యశ్రీ సేవలూ కొరవడటంతో సేవా రుసుము ఆసుపత్రికి రావడం లేదు. వైద్యశాలలో డీఎం సీటు పొందినవారు పాఠాలు నేర్చుకోవాలంటే ఇతర ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. కొవిడ్ రాకముందు కార్డియోథోరాసిక్ విభాగంలో ఏడాదికి 200 గుండె శస్త్రచికిత్సలు చేసేవారు. ఆ తర్వాత వాటి సంఖ్య వందకు తగ్గింది. ఈ విభాగంలో చేసే కేసుల సంఖ్య తక్కువ... ప్రచారం ఎక్కువగా ఉందని తోటి వైద్యులు చెప్పుకోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరాచక పాలనకు చరమ గీతం పాడాలి
[ 25-04-2024]
రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని మండల తెదేపా నాయకులు నజీర్ సాహెబ్, తిమ్మారెడ్డి, తిరుపతయ్య, రామాంజనేయులు, బేతాళ బడే సాహెబ్ అన్నారు. -
మలేరియాపై అవగాహన
[ 25-04-2024]
మండలంలో అన్ని గ్రామాల్లో మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని మలేరియా వ్యాధి సబ్ యూనిట్ అధికారి సాయిబాబా అన్నారు. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 25-04-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర అన్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్