శ్రీగిరిపై కన్నడిగుల భక్తిపారవశ్యం
శ్రీశైల మహాక్షేత్రం లక్షలాదిమంది కన్నడ భక్తులతో కిటకిటలాడుతోంది. సోమవారం పెద్ద సంఖ్యలో భక్తులు పాదయాత్రగా తరలిరావడంతో క్షేత్ర పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి.
పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు
శ్రీశైలం ఆలయం, న్యూస్టుడే : శ్రీశైల మహాక్షేత్రం లక్షలాదిమంది కన్నడ భక్తులతో కిటకిటలాడుతోంది. సోమవారం పెద్ద సంఖ్యలో భక్తులు పాదయాత్రగా తరలిరావడంతో క్షేత్ర పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. కన్నడ, మరాఠా భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. దర్శనం కాగానే కొందరు భక్తులు తిరుగుముఖం పడుతున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. స్వచ్ఛంద సేవకులు, కన్నడ భక్తులు వాలంటీర్లుగా పనిచేస్తూ భక్తులకు అవసరమైన సమాచారం తెలియజేస్తున్నారు.
గ్రామోత్సవం ఎదుట కళాకారుల సందడి
అన్నపూర్ణ ఆశ్రమంలో అన్నదానం
శ్రీశైలంలోని ఘంటామఠం సమీపంలో ఉన్న అన్నపూర్ణాదేవి ఆశ్రమంలో శివోహం టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కన్నడ భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు. మూడు పూటలా అన్నప్రసాదం అందజేస్తున్నారు. ఉత్సవాలు ముగిసే వరకు అన్నదానం కొనసాగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
శ్రీశైలంలో నేడు...
శ్రీశైలంలో ఉగాది మహోత్సవాల మూడోరోజు మంగళవారం భ్రమరాంబాదేవి, మల్లికార్జున స్వామివార్లకు సాయంత్రం 5 గంటల ప్రభోత్సవం జరుగనుంది. రాత్రి 7 గంటలకు భ్రమరాంబాదేవి మహాసరస్వతి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నంది వాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు.
భక్తులకు అన్నదాన కార్యక్రమం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరాచక పాలనకు చరమ గీతం పాడాలి
[ 25-04-2024]
రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని మండల తెదేపా నాయకులు నజీర్ సాహెబ్, తిమ్మారెడ్డి, తిరుపతయ్య, రామాంజనేయులు, బేతాళ బడే సాహెబ్ అన్నారు. -
మలేరియాపై అవగాహన
[ 25-04-2024]
మండలంలో అన్ని గ్రామాల్లో మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని మలేరియా వ్యాధి సబ్ యూనిట్ అధికారి సాయిబాబా అన్నారు. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 25-04-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర అన్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు