logo

అప్పులు తప్పించుకునేందుకు చోరీ నాటకం

ఆళ్లగడ్డ మండలం ఓబులంపల్లె గ్రామంలో ఓ వ్యక్తి తన ఇంట్లో చోరీ జరిగిందంటూ ప్రచారం చేశాడు.

Published : 21 Mar 2023 02:26 IST

ఓబులంపల్లె(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: ఆళ్లగడ్డ మండలం ఓబులంపల్లె గ్రామంలో ఓ వ్యక్తి తన ఇంట్లో చోరీ జరిగిందంటూ ప్రచారం చేశాడు. తీరా పోలీసులు వచ్చి విచారణ చేపట్టగా అదంతా నాటకం అని తేలింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సద్దాం హుసేన్‌ ఇంట్లో చోరీ జరిగిందనే వార్త స్థానికంగా హల్‌చల్‌ చేసింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఇంటికి తాళం వేసి పక్కనే ఉన్న టీ దుకాణంలో అతను నిద్రించగా, దొంగలు ఇంటి గూడు పగలగొట్టి లోనికి చొరబడి రూ.80 వేల నగదు, ఐదున్నర తులాల బంగారం దొంగలించారని సద్దాం హుసేన్‌ తెలిపాడు. పోలీసులు బాధితుడిని ఠాణాకు తరలించి విచారించగా చోరీ జరగలేదని, తానే ఇదంతా చేసినట్లు ఒప్పుకున్నాడు. అప్పుల నుంచి తప్పించుకొనేందుకు అతను నాటకం ఆడినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని