చెరువును చెరిపిన అధికారం
ఖాళీ స్థలం కనిపిస్తే చాలు ‘అధికారం’ అధీనం చేసుకుంటోంది. స్థానికులు అడ్డుకుంటే దాడులకు దిగుతున్నారు. విన్నవించినా అధికారులు తమ వల్ల కాదంటున్నారు.
రూ.2 కోట్ల స్థలం కబ్జా
వైకాపా నాయకుడి దౌర్జన్యం
చెరువు కట్ట ముందు భాగంలో ఖాళీ స్థలాన్ని మట్టితో నింపేశారు ఇలా
ఖాళీ స్థలం కనిపిస్తే చాలు ‘అధికారం’ అధీనం చేసుకుంటోంది. స్థానికులు అడ్డుకుంటే దాడులకు దిగుతున్నారు. విన్నవించినా అధికారులు తమ వల్ల కాదంటున్నారు. పత్తికొండ నియోజకవర్గ కేంద్రంలో రూ.2 కోట్ల విలువైన చెరువు స్థలానికి వైకాపా నాయకుడు ఎసరు పెట్టారు. కొంత భాగం చదును చేసుకుంటూ కాజేసేందుకు యత్నిస్తున్నారు. చెరువు స్థలాన్ని సదరు నాయకుడు ఆక్రమించుకుంటుండగా అడ్డుకోబోయిన ఆయకట్టు రైతులను కాలితో తన్నడమే కాదూ.. వారిపై దాడులకు దిగారు. ఈ ఘటన జరిగి మూడు రోజులవుతున్నా అధికారులు స్పందించకపోవడం గమనార్హం.
తూముకు తూట్లు
తూమును మట్టి కుప్పలతో కప్పేశారు
పత్తికొండలో సర్వే నంబరు 602-2లో 184.5 ఎకరాలు, 602-2ఏలో 35 సెంట్ల స్థలం విస్తీర్ణంలో చెరువు ఉంది. 180 ఎకరాలు సాగవుతోంది. వర్షాకాలంలో అధిక నీరు వస్తే బయటకు వెళ్లడానికి రెండు చోట్ల తూములు ఏర్పాటు చేశారు. చిన్న తూము ముందు భాగంలో 1.5 ఎకరాలు ఖాళీగా ఉంది.. దీని విలువ ప్రస్తుతం సుమారు రూ.2 కోట్లు పలుకుతోంది. దీనిని ఆక్రమించేందుకు పట్టణానికి చెందిన అధికార పార్టీ నాయకుడు పథకం పన్నారు. ఆ స్థలంలోకి నీరు రాకుండా చెరువు మట్టినే తవ్వి చదును చేయడం గమనార్హం. అంతే కాకుండా నీరు పారేందుకు నిర్మించిన తూమునూ పూడ్చి వేసేందుకు మట్టి తరలించారు.
ఇళ్లు మునగడం ఖాయం
చెరువు నిండిన సమయంలో నీరు బయటకు రాకుండా తూమును పూడిస్తే సమీపంలోని కాలనీ మునగడం ఖాయం. ఇళ్లల్లోకి పెద్ద ఎత్తున నీళ్లు వచ్చే ప్రమాదం ఉంది. చెరువు నిండితే గ్రామానికి ఎలాంటి నీటి ముప్పు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో పూర్వీకులు తూము నిర్మాణం చేపట్టారు. తూమును మూసేసి.. దాని ముందున్న స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడితే.. ఇళ్లల్లోకి నీరొచ్చే ప్రమాదముంది. అయినా సంబంధిత అధికారులకు ఏమీ పట్టడం లేదని స్థానికులు నిరసన వ్యక్తంచేస్తున్నారు. ‘‘ అవకాశం దొరికినప్పుడల్లా సాబ్దిన్ నూర్బాషా చెరువు స్థలాన్ని ఆక్రమిస్తూ వస్తున్నాడు. గతంలోనూ ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని’’ ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
హద్దులు నిర్ణయించి స్వాధీనం :
చంద్రశేఖర్, డీఈ, మైనర్ఇరిగేషన్ శాఖ, పత్తికొండ
హద్దులు నిర్ణయించి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం. తూము ప్రాంతాన్ని మూసేస్తే ఇళ్లల్లోకి నీరు వెళ్లే ప్రమాదముంది. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు, ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకుంటాం. అంశాన్ని మైనర్ ఇరిగేషన్ డీఈ చంద్రశేఖర్ దృష్టికి తీసుకెళ్లాం.
న్యూస్టుడే, పత్తికొండ, పత్తికొండ పట్టణం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అహోబిలంలో ఘనంగా స్వాతి వేడుకలు
[ 24-04-2024]
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో బుధవారం స్వాతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ప్లాస్టిక్ నివారణకు సహకరించండి
[ 24-04-2024]
శ్రీశైలం అటవీ శాఖలో ప్లాస్టిక్ నివారణకు సహకరించాలని శ్రీశైలం, నాగార్జున సాగర్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ బీఎన్ఎన్ మూర్తి అన్నారు. -
మైనారిటీల అభివృద్ధిని విస్మరించిన వైకాపా
[ 24-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల నుంచి మైనార్టీల అభివృద్ధిని విస్మరించిందని మండల ముస్లిం మైనారిటీ నాయకులు నజీర్ సాహెబ్, ఫక్రుద్దీన్, బేతాళ భలే సాహెబ్, మదీనా అన్నారు. -
తెదేపాను గెలిపిస్తే అర్హలందరికీ సంక్షేమ పథకాలు
[ 24-04-2024]
రాష్ట్రంలో తెదేపాను గెలిపిస్తే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి అన్నారు. -
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
[ 24-04-2024]
‘నా జీవితం నాశనం కావడానికి కారణం నువ్వే. మీ కుటుంబం నాకు అన్యాయం చేసింది’ అంటూ ఓ మహిళ నంద్యాల వైకాపా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి సతీమణి, కౌన్సిలర్ నాగినిరెడ్డిని నిలదీయడం తీవ్ర చర్చనీయాంశమైంది. -
కేసీ.. జగన్ నిర్లక్ష్యం చేసి
[ 24-04-2024]
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రగల్బాలు పలికిన జగన్ ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఐదువందలు కేటాయించలేదు.. కేసీ కాల్వకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూపాయి వెచ్చించలేదని శాసనసభా సాక్షిగా ‘కాగ్’ తేల్చింది.. -
గ్రామ స్వరాజ్యం.. జగనాసుర అరాచకం
[ 24-04-2024]
పంచాయతీ, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు స్థానిక ప్రభుత్వాలుగా వ్యవహరిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాల్సి ఉండగా వాటిపై జగన్ కుట్ర పన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం -
బలగం పెంచుకుని బరిలోకి!
[ 24-04-2024]
వైకాపాలో విభేదాలు... ఐదేళ్లుగా ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం.. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మల్చుకొని విజయం దిశగా వెళ్లాలని కోడుమూరు తెదేపా నేతలు వ్యూహాలకు పదునుపెట్టారు. -
డీసీసీబీ తాత్కాలిక సీఈవోపై వేటు
[ 24-04-2024]
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తాత్కాలిక ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) శివలీలపై వేటు పడింది. -
కోట్ల గూటికి పాత నేతలు
[ 24-04-2024]
ఇన్నాళ్లు పార్టీని ఉపయోగించుకొని వీడిన వారికి తాము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా రిటర్న్గిఫ్ట్ ఇస్తామని అధికారపార్టీ నేత హెచ్చరికలు ‘డోన్’ నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి.. -
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయం
[ 24-04-2024]
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయమని ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ అన్నారు. మండలంలోని తంగడరడోణ, తుర్వగల్లు, తొగలగల్లు, యాటకల్లు, కల్లపరి, చొక్కనహళ్లి, శంకరబండ తదితర గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగనన్న వెన్నుపోటు.. పల్లెల తిరుగుబాటు
[ 24-04-2024]
ప్రస్తుతం పల్లెలు కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్నాయి. జగన్ ప్రభుత్వం నిర్వాకంతో సమస్యలతో సతమతమవుతున్నాయి. కనీసం కుళాయి బిగించేందుకు కూడా చిల్లర లేని పరిస్థితి. కేంద్రం నుంచి వచ్చే నిధులను సైతం మళ్లించి.. -
పాణ్యం ఎన్నికల్లో ప్రముఖం
[ 24-04-2024]
పాణికేశ్వరస్వామి పేరుతో పాణ్యం గ్రామం ఏర్పడింది. కాలక్రమేణా నియోజకవర్గంగా మారింది. కర్నూలు, నంద్యాల మధ్య వారధిగా ఉన్న పాణ్యం నియోజకవర్గం అత్యంత కీలకం. జిల్లాలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం కావడం విశేషం. -
పుస్తక పుటలకు జగనన్న చెద
[ 24-04-2024]
గ్రంథాలయాల్లో పాఠకుల్ని సమస్యలు వేధిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. పాఠకులకు కొత్త పుస్తకాలు అందుబాటులో ఉండటం లేదు. -
కాటసాని ఆస్తులు రూ.75.19 కోట్లు
[ 24-04-2024]
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.75.19 కోట్లుగా చూపారు. సోమవారం నామినేషన్తోపాటు ఇచ్చిన అఫిడవిట్లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించిన రిటర్నింగ్ అధికారి నారపురెడ్డి మౌర్య వాటిని సవరించాలని సూచించారు. -
టీజీ భరత్ నామపత్రం దాఖలు
[ 24-04-2024]
కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి మంగళవారం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. తెదేపా అభ్యర్థి టీజీ భరత్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్