బెంచీలే అసలు పరీక్ష
‘‘ పదో తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పరీక్షల సమయం సమీపిస్తున్నా ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో నేటికీ ఏర్పాట్లు కానరావడం లేదు.
ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు
బల్లలు సమకూర్చుకోవాలని ఆదేశాలు
రుద్రవరం: ఉన్నత పాఠశాలలో మూలకు చేరిన బల్లలు
కర్నూలు విద్య, న్యూస్టుడే: ‘‘ పదో తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పరీక్షల సమయం సమీపిస్తున్నా ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో నేటికీ ఏర్పాట్లు కానరావడం లేదు. నాడు- నేడు పనులు జరుగుతున్న ఉన్నత పాఠశాలల్లో సమస్యలు ఉన్నాయని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది. చాలా చోట్ల బెంచీల సమస్య వేధిస్తోంది. ఎవరి పరిధిలో వారే బల్లలు సమకూర్చుకోవాలని పరీక్షల విభాగం అధికారులు చెప్పడంతో ప్రధానోపాధ్యాయులు మండిపడుతున్నారు. ’’
హాజరు కానున్న 50,720 మంది
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, పురపాలక, నగరపాలక, ఆదర్శ, సాంఘిక, గిరిజన సంక్షేమ, కేజీబీవీ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలు 941 వరకు ఉన్నాయి. ఇందులో కర్నూలు జిల్లాలో 25,366 మంది, నంద్యాలలో 25,354 మంది విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరు కానున్నారు. వీరి కోసం కర్నూలు జిల్లాలో 149 కేంద్రాలు, నంద్యాలలో 125 పరీక్షా కేంద్రాలు ఎంపిక చేశారు. వీటిలో చాలా చోట్ల మనబడి నాడు-నేడు పనులు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ గదులు పడగొట్టారు. బిల్లులు రాకపోవడంతో పనులను గుత్తేదారులు మధ్యలో ఆపేశారు.
ఇక్కడే సమస్య ఎక్కువ
నంద్యాల జిల్లాలోని కోవెలకుంట్ల, చాగలమర్రి, రుద్రవరం, దొర్నిపాడు, గోస్పాడు, ఆత్మకూరు, నందికొట్కూరు, పాణ్యం, బనగానపల్లి, కొలిమిగుండ్ల, అవుకు, శిరివెళ్ల మండల కేంద్రాలు, కర్నూలు జిల్లా పరిధిలో కోడుమూరు, సి.బెళగల్, గూడూరు, పత్తికొండ, దేవనకొండ, కోసిగి, కౌతాళం, పెద్దకడబూరు, ఆలూరు, ఆస్పరి, వెల్దుర్తి, కర్నూలు, కల్లూరు మండల పరిధిలో ఉన్న పరీక్ష కేంద్రాల్లో పూర్తి స్థాయిలో బల్లలు లేవని అధికారులు గుర్తించినట్లు సమాచారం. వీటిలో ఎక్కువగా నాడు-నేడు పనులు జరగుతుండడం గమనార్హం. దీంతోపాటు పాఠశాలల విలీన ప్రక్రియ నేపథ్యంలో బల్లల సమస్య మరింత రెట్టింపైనట్లు తెలుస్తోంది.
ప్రత్యేక నిధులేవీ
పరీక్ష కేంద్రాల నిర్వహణకు అయ్యే ఖర్చు పాఠశాలలకు కేటాయించిన గ్రాంట్ నుంచి వెచ్చించాలని అధికారులు సలహా ఇచ్చారు. 2022-23 సంవత్సరానికి చెందిన గ్రాంట్లో ఇప్పటి వరకు 20 శాతం మంజూరైంది. వాటితో మరుగుదొడ్ల నిర్వహణ, పాఠశాల ఆవరణ శుభ్రం చేయడం, సుద్ద ముక్కల కొనుగోలు, బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్ కోసం ఖర్చు చేశామని పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జిల్లా విద్యాశాఖకు సమాధానం ఇచ్చారు. కనీసం పెండింగ్లో ఉన్న 80 శాతం స్కూల్ గ్రాంట్స్ మంజూరు చేస్తే కొంతవరకు వసతులు సమకూర్చుకునేందుకు అవకాశం ఉంటుందని ప్రధానోపాధ్యాయులు.. డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోల ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
ప్రైవేటుకు ప్రాధాన్యం
* నాడు-నేడు పనులు జరుగుతున్న నేపథ్యంలో 70 శాతానికిపైగా ప్రైవేటు పాఠశాలలను పరీక్ష కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. ఇక్కడ వసతులు, బల్లలు ఉంటాయని ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. నంద్యాల, కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో ఎక్కువగా ప్రైవేటు పాఠశాలలను గుర్తించారు. అధికారుల తీరుపై విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
* కర్నూలు నగరంలో 23 ప్రైవేటు పాఠశాలలను ఎంపిక చేయగా.. పశ్చిమ ప్రాంతంలో 27 ఎంపిక చేశారు.
* పత్తికొండ, బనగానపల్లి, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు, ఓర్వకల్లు, పత్తికొండ, కోసిగి, పెద్దకడబూరు, మంత్రాలయం, కోడుమూరు, పెద్దపాడులో గ్రామానికి దూరంగా ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా బస్సు సౌకర్యం లేనప్పటికీ పరీక్ష కేంద్రాలుగా గుర్తించారు. ప్రధాన రహదారికి దూరంగా ఉన్న పరీక్ష కేంద్రాల వరకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. గతంలో బస్సు సౌకర్యం లేని గ్రామాల నుంచి విద్యార్థులు ఆటోలు, ట్రాక్టర్లలో ప్రమాదకరంగా పరీక్ష కేంద్రాలకు చేరుకుని పరీక్షలు రాశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 28-03-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు అన్నారు. -
పాదయాత్ర మాటపాలనలో జూట
[ 28-03-2024]
ప్రజా సంకల్ప పాదయాత్ర పేరుతో పల్లెలకొచ్చారు.. నా అక్కాచెల్లెమ్మలు, అన్నలు అంటూ ‘హామీ’లు కురిపించారు.. ఒక సంవత్సరం ఓపిక పడితే ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మించారు.. జగన్ వస్తే జనాలకు మంచి జరుగుతుందని భ్రమింపజేశారు.. అధికార పీఠమెక్కి ‘ప్రజా’స్వామ్యం మరిచారు.. అడిగితే అణచివేశారు.. ప్రశ్నిస్తే భయపెట్టారు.. -
ఎమ్మెల్యే కబ్జాలో రూ.4 కోట్ల విలువైన స్థలం
[ 28-03-2024]
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి రూ.4 కోట్ల విలువైన 40 సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారని బాధితుడు కె.వి.కుమార్ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. -
బస్సులు మళ్లించారు..ఎండలో నిలబెట్టారు
[ 28-03-2024]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు వస్తున్నారంటే జనం హడలిపోతున్నారు. -
మఠం స్థలానికి ఎసరు
[ 28-03-2024]
ఆదోని పట్టణ శివారులోని బైపాస్ రహదారిపై మండగిరి గ్రామ పంచాయతీ పరిధిలో కల్లుమఠానికి చెందిన రూ.కోట్లు విలువ చేసే భూమిని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు కబ్జా పర్వానికి తెర లేపారు. -
ఆదోని భాజపా అభ్యర్థి డా.పార్థసారథి
[ 28-03-2024]
ఉత్కంఠ వీడింది.. ఆదోని అభ్యర్థిగా భాజపా ఓబీసీ మోర్చా కార్యదర్శి డా.పార్థసారథి బరిలో ఉండనున్నారు. -
29న బనగానపల్లికి చంద్రబాబు రాక
[ 28-03-2024]
బనగానపల్లికి ఈ నెల 29న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి బుధవారం తెలిపారు. -
కేసులు నమోదైతే కొలువు కష్టమే
[ 28-03-2024]
చట్ట నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడే వాలంటీర్లపై కేసులు నమోదైతే మళ్లీ వారిని ఉద్యోగంలోకి తీసుకోవడం సాధ్యం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కలెక్టర్ జి.సృజన హెచ్చరించారు. -
తెదేపాలోనే బీసీలకు పెద్దపీట
[ 28-03-2024]
రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు చట్టసభలో సీట్లు కేటాయించి అత్యున్నత స్థానం కల్పించిన ఘనత తెదేపాకే దక్కుతుందని తెదేపా కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు. -
వైకాపా అరాచక పాలనలో ఇబ్బందులు
[ 28-03-2024]
వైకాపా పాలనలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని తెదేపా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. -
ఉర్దూ వర్సిటీ పనులు పూర్తి చేయాలి
[ 28-03-2024]
ఓర్వకల్లు సమీపంలో తెదేపా హయాంలో చేపట్టిన ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ డిమాండ్ చేశారు. -
జగన్ను ఇంటికి సాగనంపుదాం
[ 28-03-2024]
ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దఎత్తున హామీలిచ్చారని.. అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని, రానున్న ఎన్నికల్లో ఓడించి ఇంటికి సాగనంపాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు కోరారు. -
అభివృద్ధికి ఓటేయండి
[ 28-03-2024]
కర్నూలును అభివృద్ధి చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన తనకు మద్దతు ఇవ్వాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్ అన్నారు. -
తెదేపా అభ్యర్థిగా కచ్చితంగా పోటీ చేస్తా
[ 28-03-2024]
మంత్రాలయం నియోజకవర్గం తెదేపా అభ్యర్థిగా కచ్చితంగా నేనే పోటీ చేస్తానని ఆ పార్టీ నాయకుడు తిక్కారెడ్డి అన్నారు. -
ముగ్గురు సైబర్ నేరగాళ్ల అరెస్టు
[ 28-03-2024]
సైబర్ నేరాలకు పాల్పడుతున్న కర్నూలు మండలం మునగాలపాడుకు చెందిన మాస్టిక్ నవీన్కుమార్, అతని సోదరుడు అరుణ్కుమార్, అదే గ్రామానికి చెందిన మహేశ్ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
ఎంఎఫ్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట