ఫిష్ ఆంధ్ర తుస్
వినియోగదారులకు తాజా చేపలు అందించడం.. విక్రయదారులు, ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ఫిష్ ఆంధ్ర’ పేరుతో చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేసింది.
రూ.20 లక్షల విలువ చేసే ఫిష్ వెండింగ్ యూనిట్ నమూనా
నంద్యాల పట్టణం, న్యూస్టుడే : వినియోగదారులకు తాజా చేపలు అందించడం.. విక్రయదారులు, ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ఫిష్ ఆంధ్ర’ పేరుతో చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన పథకానికి మరిన్ని మెరుగులు దిద్ది ఫ్రెష్ రిటైల్ యూనిట్ల ఏర్పాటకు శ్రీకారం చుట్టారు. యూనిట్ల స్థాపనకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. మూడేళ్లుగా ఉమ్మడి జిల్లాలో ఆదరణ కరవైంది.
మూడేళ్లుగా ముందుకు కదలక
* ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, డొమెస్టిక్ మార్కెటింగ్ పథకాల కింద లబ్ధిదారులను గుర్తించేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2020లో యూనిట్లు మంజూరయ్యాయి. మొదట గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో రూ.2 లక్షల యూనిట్ విలువతో పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత రూ.10 లక్షల విలువ చేసే డెలీషియస్ రెస్టారెంట్లు, రూ.20 లక్షల విలువ చేసే సూపర్ రెస్టారెంట్లు, రూ.50 లక్షల లాంజ్ రెస్టారెంట్లు, రూ.కోటి వ్యయమయ్యే ఆక్వా హబ్లను మంజూరు చేశారు. వ్యాపారులు, లబ్ధిదారులు ఎవరూ ముందుకు రాలేదు.
* ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫిష్ రిటైల్ ఔట్లెట్లు మంజూరై మూడేళ్లవుతోంది. ఇంత వరకు ఈ పథకానికి ఆశించిన స్పందన లేదు. నంద్యాల జిల్లాలో రూ.10 లక్షల యూనిట్కు సంబంధించి ఓ ఔత్సాహికుడు మాత్రమే ముందుకొచ్చారు. కర్నూలు జిల్లాలో రూ.10 లక్షల యూనిట్కు ఎనిమిది మంది, రూ.20 లక్షల యూనిట్కు ఆరుగురు, రూ.50 లక్షల యూనిట్కు ముగ్గురు దరఖాస్తు చేసుకోగా ఇవి ఉన్నతాధికారుల పరిశీలనలో ఉన్నాయి.
* పథకం ప్రారంభంలో పెద్దగా రాయితీలు లేకపోవడంతో అప్పట్లో ఎవరూ ముందుకు రాలేదు. తర్వాత రాయితీ సౌకర్యాలు కల్పించినా లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు.
పూర్తి స్థాయిలో ప్రచారం
శ్యామలమ్మ, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్, కర్నూలు
గతంతో పోలిస్తే ప్రస్తుతం యూనిట్లు స్థాపించే లబ్ధిదారులకు ఎక్కువ రాయితీలు కల్పిస్తున్నాం. పథకం గురించి పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తున్నాం. కర్నూలు జిల్లాలో గతంతో పోలిస్తే దరఖాస్తుల సంఖ్య పెరిగింది. డీఆర్డీఏ, మెప్మా శాఖలతో కలిసి పనిచేస్తున్నాం. రైతులకు మేలు కలిగించే విధంగా చర్యలు ఉండనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఇంటింటి ప్రచారం
[ 23-04-2024]
కౌతాళం మండలంలోని కుంటనహళు గ్రామాల్లో కూటమి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి సోదరుడు రామకృష్ణ రెడ్డి, తెలుగు యువత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
తెదేపా నాయకుల ప్రచారం
[ 23-04-2024]
మండలంలో ఎమ్మిగనూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు తరఫున తెదేపా మండల కన్వీనర్ నజీర్ సాహెబ్, ఇతర నాయకులు, కార్యకర్తలు కున్నూరు, లింగందిన్నె గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. -
చీనీ తోటలో అగ్ని ప్రమాదం
[ 23-04-2024]
మండలంలోని బైలుప్పల గ్రామంలో మాధవరెడ్డి సాగు చేసిన చీని తోట అగ్ని ప్రమాదానికి గురైంది. స్థానికులు మంటలను అదుపు చేశారు. -
తెదేపా ఎన్నికల ప్రచారం
[ 23-04-2024]
రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు తగ్గించాలంటే తెదేపాతోనే సాధ్యమని తెదేపా అభ్యర్థి బీవీ జయనగేశ్వరరెడ్డి అన్నారు. -
వైకాపా పాలనకు చరమగీతం పాడాలి
[ 23-04-2024]
రాష్ట్రంలో వైకాపా పాలనకు చరమగీతం పాడాలని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
‘చేదోడు’.. జగన్ చెడుగుడు
[ 23-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో బీసీ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉంటారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వారిని వెన్నువిరిచారు. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న బీసీ కార్పొరేషన్, బీసీ కులాల కార్పొరేషన్లను వైకాపా ప్రభుత్వం నామమాత్రంగా మార్చేశారు. -
పారిశ్రామిక వాడ.. జగన్ విధ్వంస జాడ
[ 23-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమల ఏర్పాటు పక్కన పెట్టింది. తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన శిలాఫలకాలను వైకాపా నాయకులు ధ్వంసం చేయడం తప్ప ఒక్క పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
జగన్ ఏలు‘బడి’.. ఫలితం బోల్తాపడి
[ 23-04-2024]
‘కాలం’ కలిసి రాలేదు.. పిల్లాజెల్లా వలసబాట పట్టారు.. పశ్చిమాన ఊళ్లు ఖాళీ అయ్యాయి.. విద్యార్థుల్లేక తరగతి గదులు వెలవెలబోయాయి.. గ్లోబల్ విద్యార్థులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గొప్పగా చెప్పే సీఎం జగన్ పట్టించుకోలేదు.. ఫలితం తిరగబడింది.. -
ఒకటినే వేతనాలు చెల్లించేలా చట్టం చేయాలి
[ 23-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు వేతనాలు ఏరోజు వస్తాయో తెలియక అయోమయానికి గురవుతున్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
ఐదేళ్ల అధికారం.. 2కి.మీ కాల్వ నిర్మించలేదు
[ 23-04-2024]
శ్రీశైలం ఎగువన (ఫోర్ షోర్) సుమారు 4.8 కి.మీ. దూరంపాటు అప్రోచ్ కాలువ నిర్మించి 40 టీఎంసీల కృష్ణా జలాలను మల్యాల ఎత్తిపోతల పథకం వరకు తరలించి అక్కడ నీటిని ఎత్తిపోస్తున్నారు. -
అందుబాటులో ఉంటా అభివృద్ధి చేస్తా
[ 23-04-2024]
నంద్యాల ఎంపీగా తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎంపీ అభ్యర్థి డా.బైరెడ్డి శబరి అన్నారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గానికి తెదేపా తరఫున సోమవారం ఆమె నామినేషన్ వేశారు. -
ప్రజల నమ్మకంతోనే గెలిచా: బుగ్గన
[ 23-04-2024]
కార్యకర్తల త్యాగం.. ప్రజల నమ్మకం వల్లే రెండు సార్లు గెలిచా.. వారిపై నమ్మకంతోనే మూడోసారి బరిలో నిలిచానని రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. -
నగరడోణ.. కల తీరేనా
[ 23-04-2024]
పశ్చిమ ప్రాంతం కరువును పారదోలేందుకు నగరడోణ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి, ఆలూరు, హాలహర్వి మండలాల్లో సాగునీరు అందించటం దీని ప్రధాన ఉద్దేశం. -
నిర్లక్ష్యానికి శిలా సాక్ష్యాలు
[ 23-04-2024]
వరద నీరు వృధా కాకుండా, కడప జిల్లాలో 91వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకై రాజోలి ఆనకట్ట వద్ద కుందూ నదిపై 2.95టీఎంసీల సామర్థ్యంతో రాజోలి జలాశయం నిర్మాణానికి 2008లో బీజం పడింది. -
పల్లెల అభివృద్ధి భాజపాతోనే సాధ్యం
[ 23-04-2024]
ఆదోని మండలం జాలిమంచి గ్రామానికి చెందిన 80 మంది భాజపా అభ్యర్థి పార్థసారథి సమక్షంలో పార్టీలో చేరారు. -
సాయన్నా ఈ నరకయాతనకు కారకులెవరో...
[ 23-04-2024]
ఆదోని పట్టణంలో వైకాపా అభ్యర్థి సాయిప్రసాద్రెడ్డి నామినేషన్ సందర్భంగా సోమవారం ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పట్టణ దారులను విస్తరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అది నెరవేరక ఇరుకు దారులే మిగిలాయి. -
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం
[ 23-04-2024]
జిల్లాలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్, పార్టీ ఎన్నికల రాష్ట్ర సమన్వయకర్త వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. -
అభ్యర్థులు.. ఆస్తులు
[ 23-04-2024]
ఆదోని వైకాపా అభ్యర్థిగా సాయిప్రసాద్రెడ్డి సోమవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆయన కుటుంబానికి సంబంధించిన స్ధిర, చర ఆస్తుల వివరాలతో పాటుగా బంగారు ఆభరణాలు, భూముల వివరాలను అఫిడవిట్లో వెల్లడించారు. -
నాలుగో రోజు జోరుగా నామినేషన్లు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కర్నూలు పార్లమెంట్తోపాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. 34 మంది అభ్యర్థులు 38 సెట్ల నామపత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు. -
అంగట్లో రాష్ట్ర ప్రజల వ్యక్తిగత డేటా
[ 23-04-2024]
రాష్ట్ర ప్రజల కీలకమైన వ్యక్తిగత డేటా విచ్చలవిడిగా చేతులు మారుతోందని వైకాపా కార్యకర్త, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కామిని విష్ణువర్ధన్రెడ్డి ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా