ఉగాది ఉషస్సు.. తెలుగింటి తేజస్సు
శోభకృత్ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో వెలుగొందాలి.. ఉగాది ఉషస్సు.. తెలుగింటి తేజస్సు అని జడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ ఆకాంక్షించారు.
ఉగాది పురస్కారం అందుకున్న అర్చకులతో కలెక్టర్, జడ్పీ ఛైర్మన్
నంద్యాల పట్టణం, న్యూస్టుడే : శోభకృత్ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో వెలుగొందాలి.. ఉగాది ఉషస్సు.. తెలుగింటి తేజస్సు అని జడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ ఆకాంక్షించారు. కలెక్టరేట్లో దేవాదాయ, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో బుధవారం శోభకృత్ నామ సంవత్సరం వేడుకలు నిర్వహించారు. అంతకుముందు అర్చకులు కలెక్టర్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సుధీంద్ర ఆచారి శాస్త్రోకంగా గణపతి పూజ నిర్వహించి ఆశీర్వదించారు. అనంతరం పంచాంగ శ్రవణం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి అందరిలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుందన్నారు. జడ్పీ ఛైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. దేవదాయ శాఖ ద్వారా అర్చకులకు ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు. కోటపాడు గ్రామ చెన్నకేశవస్వామి ఆలయ అర్చకులు శ్రీనివాసులు, నంద్యాల బ్రహ్మనందీశ్వరస్వామి ఆలయ అర్చకులు రాచకొండ మురళీకృష్ణశర్మ, నొస్సం బుగ్గ వెంకటేశ్వర రామలింగేశ్వర స్వామి ఆలయం అర్చకులు పెట్టినకోట శ్రీకాంత్శర్మకు రూ.10,116 పారితోషికం, ప్రశంసాపత్రం, కండువాలను జిల్లా కలెక్టర్, జడ్పీ ఛైర్మన్లు అందజేసి సన్మానించారు. కార్యక్రమానికి హాజరైన వారికి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి, ప్రసాదాలు అందజేశారు. వేడుకలకు జిల్లా అధికారులు సంప్రదాయ వస్త్రధారణలో హాజరయ్యారు. డీఆర్వో పుల్లయ్య, డీసీఎంఎస్ ఛైర్మన్ సీహెచ్ శిరోమణి మద్దయ్య, దేవదాయ శాఖ ఏసీ సుధాకర్రెడ్డి, పర్యాటక శాఖ అధికారి సత్యనారాయణ, డీఎంహెచ్వో డా.వెంకటరమణ, మున్సిపల్ ఛైర్పర్సన్ మాబున్ని, కమిషనర్ రవిచంద్రారెడ్డి, డీఎస్వో ఆచార్యులు, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
జాతీయ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని పత్తికొండలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
సెబ్ పోలీసుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆదేశాల మేరకు కర్నూలు సెబ్ ఎన్ఫోర్స్ మెంట్ ఇన్ఛార్జి అడిషనల్ ఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో సెబ్ సూపరింటెండెంట్ ఎస్.రవి కుమార్ పర్యవేక్షణలో అక్రమంగా నాటుసారా తయారీ, నిల్వ, అక్రమ మద్యం రవాణా అమ్మకాలపై పత్తికొండ, కర్నూలు పోలీసులు గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. -
అరాచక పాలనకు చరమ గీతం పాడాలి
[ 25-04-2024]
రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని మండల తెదేపా నాయకులు నజీర్ సాహెబ్, తిమ్మారెడ్డి, తిరుపతయ్య, రామాంజనేయులు, బేతాళ బడే సాహెబ్ అన్నారు. -
మలేరియాపై అవగాహన
[ 25-04-2024]
మండలంలో అన్ని గ్రామాల్లో మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని మలేరియా వ్యాధి సబ్ యూనిట్ అధికారి సాయిబాబా అన్నారు. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 25-04-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర అన్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ