కాళ్లు కదపలేరు.. నడుము తిప్పలేరు
పట్టణ ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదం కోసం రూ.లక్షలు వెచ్చించి పట్టణాల్లో పార్కులు, ఖాళీ స్థలాల్లో బహిరంగ వ్యాయామ శాలలు (ఓపెన్ జిమ్ములు) ఏర్పాటు చేశారు
బహిరంగ వ్యాయామశాలలో పాడైన పరికాలు
నిర్వహణ మరచిన పురపాలక శాఖ అధికారులు
పట్టణ ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదం కోసం రూ.లక్షలు వెచ్చించి పట్టణాల్లో పార్కులు, ఖాళీ స్థలాల్లో బహిరంగ వ్యాయామ శాలలు (ఓపెన్ జిమ్ములు) ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణను గాలికి వదిలేయడంతో ప్రస్తుతం పనికిరాకుండా పోయాయి. చాలాచోట్ల పరికరాలు దెబ్బతిన్నాయి. తుప్పుపట్టి, రబ్బరుసీళ్లు, బోల్టులు ఊడిపోయి విరిగిపోయాయి. మరికొన్ని చోట్ల పరికరాల విడి భాగాలు దొంగలు ఎత్తుకెళ్లారు. గ్రీజు పూసే వారు లేకపోవడంతో వినియోగానికి పనికిరాకుండా పోయాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో చాలావరకు మూలకు చేరాయి. దీంతో ప్రజాధనం కరిగిపోయినా లక్ష్యం నెరవేరలేదు. ప్రజలకు వ్యాయామం నెరవేరని స్వప్నంగానే మిగిలింది.
వ్యాయంపై .. రాళ్లు
ఎమ్మిగనూరు పట్టణం మాచాని సోమప్ప పార్కులో రూ.20 లక్షలతో ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేశారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. నిత్యం వంద నుంచి రెండు వందల మంది వరకు ఇక్కడకు వస్తుంటారు. నిర్వహణ సరిగా లేక పరికరాలు మూలనపడ్డాయి. పుర అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
న్యూస్టుడే, ఎమ్మిగనూరు
బిల్లులు ఇవ్వరు.. పరికరాలు వాడరు
నాలుగేళ్ల కిందట రూ.6 లక్షలు వెచ్చించి గత ప్రభుత్వం ఆత్మకూరు పురపాలక సంఘానికి ఓపెన్ జిమ్ పరికరాలు సమకూర్చించింది. వీటిని ఎక్కడా అమర్చకుండా గోదాములో ఉంచారు. ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేయాలని ఐదు నెలల కిందట నిర్ణయించారు. సామగ్రి సరఫరా చేసిన గుత్తేదారుడికి రూ.6 లక్షలు చెల్లించాల్సి ఉందని అధికారులు పాలకవర్గం దృష్టికి తీసుకొచ్చారు. సాధారణ నిధులు తక్కువగా ఉండటంతో కొందరు కౌన్సెలర్లు అభ్యంతరం చెప్పారు. కనీసం రూ.లక్ష చెల్లిస్తే బిగిస్తామని గుత్తేదారు చెప్పారు.. అయినా పాలకవర్గం కరుణించలేదు. చేసేది లేక సామగ్రిని అర్బన్కాలనీలో మూతబడిన బీసీ వసతి గృహం ప్రదేశంలో పడేశారు.
తుప్పు పట్టాయి
రూ.2.60 లక్షలు వెచ్చించి 2018లో వ్యాయామ పరికరాలు కొనుగోలు చేశారు.ప్రజలు ఉదయం, సాయంత్రం వేళ వ్యాయామం చేసుకోవడానికి వీలుగా ఉండేలా పార్కుల్లో బిగించాలి. పార్కులు లేవంటూ 13 ఏళ్లుగా పుర కార్యాలయంలో వృథాగా పెట్టారు.
న్యూస్టుడే, ఆళ్లగడ్డ
ఊడిన బోల్టులు
స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ కింద 2019లో ప్రభుత్వం రూ.7 లక్షలు వెచ్చించి డోన్ పురపాలక సంఘానికి వ్యాయామ పరికరాలు సమకూర్చింది. కేవీఎస్ కాలనీలోని మున్సిపల్ పార్కులో వీటిని బిగించారు. రూ.70 వేలు వెచ్చించి కంచె, గేటు, పరికరాల మధ్యలో కంకర, సిమెంట్తో బెడ్ వేశారు. రోవర్ పరికరానికి బోల్టులు లూజుగా మారడంతో ఊడే స్థితికి చేరింది. సమయానికి గ్రీస్ పూయకపోవడం, బోల్టులు, బాల్స్ అరిగిపోవడంతో బలవంతంగా నెట్టాల్సి వస్తోందని యువకులు పేర్కొంటున్నారు.
న్యూస్టుడే, డోన్ పట్టణం
రూ.15 లక్షలు వెచ్చించారు
నంద్యాల పట్టణంలో చెరువుకట్టపై రూ.15 లక్షలకుపైగా వ్యయం చేసి ఏడు నెలల కిందట మహిళలు, పురుషులకు వేర్వేరుగా వ్యాయామ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహిళలు వ్యాయామ కేంద్రంలోని చాలా పరికరాలకు గ్రీజు పూయలేదు. కొన్నింటికి బోల్టులు ఊడిపోయాయి. మరికొన్ని విరిగిపోయాయి. పురుషుల కోసం ఏర్పాటు చేసిన పరికరాల చుట్టూ పిచ్చిమొక్కలు, కంపచెట్లు పెరిగిపోయాయి. కొన్నింటికి గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేయలేదు. దీంతో సిమెంటు దిమ్మెలపైనే నిల్చుని వ్యాయామం చేయాల్సిన పరిస్థితి. ఇక్కడ కొన్ని పరికరాలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు ప్రజలు చెబుతున్నారు. ఇక్కడికి ప్రతిరోజు వందల మంది వ్యాయామం కోసం వస్తుంటారు.
న్యూస్టుడే, నంద్యాల పురపాలకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆలూరులో ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
తెదేపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలూరులో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు పార్టీ డాక్టర్ సెల్ కార్యదర్శి నెట్టెప్ప ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. -
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
[ 29-03-2024]
తమది విజన్.. జగన్ది పాయిజన్ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. -
తెదేపాతోనే పేదలకు న్యాయం
[ 29-03-2024]
తెదేపాతోనే పేద, బడుగు, బలహీన వర్గాల వారికి న్యాయం జరుగుతుందని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి నర్సప్ప అన్నారు. -
సీ బెళగల్లో తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
మండలకేంద్రమైన సీ బెళగల్లో శుక్రవారం మండల తెదేపా నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
పశ్చిమాన జగన్ పచ్చి మోసం
[ 29-03-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 19 మండలాలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి. ఆయా మండలాల్లో 4,84,619.2 హెక్టార్ల (82.05 శాతం) సాగు భూమి విస్తరించి ఉంది. -
జగనన్నా..కరవు సీమ కష్టాలు చూడవా
[ 29-03-2024]
కనిపించలేదా కరవు రైతు వేదన.. వినిపించలేదా పశ్చిమ పల్లెల కన్నీటి రోదన. పొలాలు బీడుబారాయి.. ఊరిలో పనులు కరవయ్యాయి.. ఇళ్లకు తాళాలు పడ్డాయి.. -
వసతిగృహాల్లో ఆకలికేకలు
[ 29-03-2024]
విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, మామయ్యలా అండగా వారికి ఉంటానని ఎక్కడికక్కడ ఊదరగొట్టే ప్రసంగాలతో అదరగొట్టే జగన్ పిల్లలకు భోజనాన్ని అందించే వార్డు సంరక్షకుల సమస్యల్ని కూడా పట్టించుకోవడం లేదు -
ప్రయాణికులకు పరీక్ష
[ 29-03-2024]
బస్సులన్నీ మేమంతా సిద్ధం సభకు తరలివెళ్లాయి. ఆర్టీసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి వైకాపా వారు అడిగింతే తడవుగా బస్సులన్నింటినీ మళ్లించారు -
ముఖ్యమంత్రి జగన్రెడ్డి క్షమాపణలు చెప్పి పర్యటించండి
[ 29-03-2024]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని, తెదేపా హయాంలో రూ.2 వేల కోట్లతో మంజూరు చేసిన ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టు పనులకు పైసా నిధులు ఇవ్వని ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పి పర్యటించాలని ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం
[ 29-03-2024]
తాము 40 ఏళ్లుగా రాజకీయాలకతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నామని, 20 రోజుల ముందు వచ్చిన ఓ వ్యక్తి ప్రజలకు సేవ చేస్తామని.. ఓటేయండి అని అంటున్నారని.. ఆ మాటలు నమ్మొద్దని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్ కోరారు. -
తెదేపాను గెలిపించుకుందాం
[ 29-03-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపాను గెలిపించుకుందామని మాజీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు. కల్లూరు మండల పరిధి పర్ల గ్రామంలో గురువారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు -
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత జగన్మోహన్రెడ్డిదే
[ 29-03-2024]
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిదేనని మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ