జీవనాడులు.. నిర్లక్ష్యపు జాడలు
కేటాయింపులకే పరిమితం
అధ్వానంగా సాగునీటి కాల్వలు
ఆళ్లగడ్డ, న్యూస్టుడే: కేసీ, తెలుగు గంగ, ఎస్సార్బీసీ ప్రధాన సాగునీటి వనరులు. జిల్లాలో 70 శాతం భూములకు నీరందించేవి ఈ కాల్వలే. ఉమ్మడి జిల్లాకు జీవనాడులైన వీటి బాగోగులకు తీసుకుంటున్న చర్యలు కాగితంపై కనిపిస్తున్నంతగా క్షేత్ర స్థాయిలో కానరావడం లేదు. బడ్జెట్లో విడుదలవుతున్న నిధులు ప్రధాన కాల్వల అభివృద్ధికి, జలాశయాల నిర్మాణాలకు పరిమితం చేస్తున్నారు, తప్పించి పంట కాల్వల మరమ్మతులపై దృష్టి సారించడం లేదు.
కేటాయింపులకే పరిమితం
కేసీ, తెలుగు గంగ, ఎస్సార్బీసీలకు ఈ ఏడాది బడ్జెట్లో కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. తెలుగు గంగకు కేటాయించిన నిధులు రూ.232 కోట్లను నాలుగు జిల్లాల పరిధిలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందులో మన జిల్లాకు ఎంతమేర కేటాయింపులున్నాయో ఏప్రిల్లో తిరుపతి సీఈ నిర్ణయించనున్నారు. ప్రస్తుత బడ్జెట్ నిధుల్లో కొంతమేర జిల్లాకు కేటాయింపులున్నా ప్రధాన కాల్వల లైనింగ్ పనులకే పరిమితం చేస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీ రూ.225.22 కోట్ల మొత్తం రాజోలి-జొళదరాశి పనులకే పరిమితం చేయనున్నారు. ఇక ఎస్సార్బీసీకి కేటాయించిన రూ.42 కోట్లు నిధులన్నీ గతంలో చేసిన పనుల చెల్లింపులకే సరిపోతుంది.
ఉపాధి హామీ పథకమే గతి
జిల్లాలోని మూడు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో కేటాయించిన నిధులు పంట కాల్వల అభివృద్ధికి ఏమాత్రం సరిపోకపోవడంతో ఉపాధి హామీ పథకం కింద కాల్వల పూడికతీత పనులు మాత్రమే చేస్తున్నారు. ప్రతి ఏటా జిల్లాలో జరిగే పనుల్లో 60 శాతం పంట కాల్వలు, చెరువుల పూడికతీత పనులే ఉంటున్నాయి. ఈ ఏడాది ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఒప్పందం కష్టాలు
రుద్రవరం సమీపంలోని తెలుగు గంగ బ్లాక్ ఛానల్. కాల్వలకు లైనింగ్ లేదు. తరచూ గండ్లు పడుతూ నీళ్లు వృథా కావడంతోపాటు, పంట పొలాలను నష్టానికి గురిచేస్తుంటాయి. నిర్మించి 15 ఏళ్లవుతున్నా ఎలాంటి మరమ్మతులు లేవు. కనీసం ముళ్ల చెట్లను తొలగించేందుకు నిధులు ఖర్చు చేసిన దాఖలాలు లేవు. 2008లో దాదాపు రూ.8 కోట్లతో కాల్వలను పూర్తి చేసేందుకు నిధులు మంజూరయ్యాయి. గుత్తేదారు పనులను అసంపూర్తిగానే వదిలేశారు. ఒప్పందాన్ని రద్దు చేయకపోవడంతో సాంకేతికంగా కొత్త టెండర్ పిలిచేందుకు వీల్లేకుండా పోయింది. పంట కాల్వలు పూర్తి కాక రైతులు తెలుగు గంగ నీటి కోసం ఎదురుచూస్తున్నారు.
గతంలో చేసిన పనులకే సరి : సుబ్బరాయుడు, ఈఈ, ఎస్సార్బీసీ
ఎస్సార్బీసీ కింద గతంలో చేసిన పనులకు రూ.42 కోట్లు బిల్లులు బకాయిలు ఉన్నాయి. ఈ మొత్తం ప్రస్తుత బడ్జెట్లో విడుదలైంది. కొత్త పనులకు అంచనాలు రూపొందించి అనుమతుల కోసం ఉన్నతాధికారులకు పంపించాం. నిధులు రాగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం.
ఉయ్యాలవాడ మండలం బోడెమ్మనూరు వద్ద అసంపూర్తిగా ఉన్న ఎస్సార్బీసీ పంట కాల్వ. చెంతనే నీళ్లున్నా, నిధుల్లేక పనులు అసంపూర్తిగా ఉండిపోయాయి. ఈ ప్రాంతంలో బోర్లు వేసినా ఉప్పు నీరు వస్తుండటంతో సారవంతమైన భూములున్నా కేవలం వర్షాధార పంటలే సాగు చేయక తప్పడం లేదని రైతులు వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
[ 24-04-2024]
‘నా జీవితం నాశనం కావడానికి కారణం నువ్వే. మీ కుటుంబం నాకు అన్యాయం చేసింది’ అంటూ ఓ మహిళ నంద్యాల వైకాపా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి సతీమణి, కౌన్సిలర్ నాగినిరెడ్డిని నిలదీయడం తీవ్ర చర్చనీయాంశమైంది. -
కేసీ.. జగన్ నిర్లక్ష్యం చేసి
[ 24-04-2024]
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రగల్బాలు పలికిన జగన్ ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఐదువందలు కేటాయించలేదు.. కేసీ కాల్వకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూపాయి వెచ్చించలేదని శాసనసభా సాక్షిగా ‘కాగ్’ తేల్చింది.. -
గ్రామ స్వరాజ్యం.. జగనాసుర అరాచకం
[ 24-04-2024]
పంచాయతీ, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు స్థానిక ప్రభుత్వాలుగా వ్యవహరిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాల్సి ఉండగా వాటిపై జగన్ కుట్ర పన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం -
బలగం పెంచుకుని బరిలోకి!
[ 24-04-2024]
వైకాపాలో విభేదాలు... ఐదేళ్లుగా ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం.. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మల్చుకొని విజయం దిశగా వెళ్లాలని కోడుమూరు తెదేపా నేతలు వ్యూహాలకు పదునుపెట్టారు. -
డీసీసీబీ తాత్కాలిక సీఈవోపై వేటు
[ 24-04-2024]
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తాత్కాలిక ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) శివలీలపై వేటు పడింది. -
కోట్ల గూటికి పాత నేతలు
[ 24-04-2024]
ఇన్నాళ్లు పార్టీని ఉపయోగించుకొని వీడిన వారికి తాము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా రిటర్న్గిఫ్ట్ ఇస్తామని అధికారపార్టీ నేత హెచ్చరికలు ‘డోన్’ నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి.. -
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయం
[ 24-04-2024]
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయమని ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ అన్నారు. మండలంలోని తంగడరడోణ, తుర్వగల్లు, తొగలగల్లు, యాటకల్లు, కల్లపరి, చొక్కనహళ్లి, శంకరబండ తదితర గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగనన్న వెన్నుపోటు.. పల్లెల తిరుగుబాటు
[ 24-04-2024]
ప్రస్తుతం పల్లెలు కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్నాయి. జగన్ ప్రభుత్వం నిర్వాకంతో సమస్యలతో సతమతమవుతున్నాయి. కనీసం కుళాయి బిగించేందుకు కూడా చిల్లర లేని పరిస్థితి. కేంద్రం నుంచి వచ్చే నిధులను సైతం మళ్లించి.. -
పాణ్యం ఎన్నికల్లో ప్రముఖం
[ 24-04-2024]
పాణికేశ్వరస్వామి పేరుతో పాణ్యం గ్రామం ఏర్పడింది. కాలక్రమేణా నియోజకవర్గంగా మారింది. కర్నూలు, నంద్యాల మధ్య వారధిగా ఉన్న పాణ్యం నియోజకవర్గం అత్యంత కీలకం. జిల్లాలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం కావడం విశేషం. -
పుస్తక పుటలకు జగనన్న చెద
[ 24-04-2024]
గ్రంథాలయాల్లో పాఠకుల్ని సమస్యలు వేధిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. పాఠకులకు కొత్త పుస్తకాలు అందుబాటులో ఉండటం లేదు. -
కాటసాని ఆస్తులు రూ.75.19 కోట్లు
[ 24-04-2024]
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.75.19 కోట్లుగా చూపారు. సోమవారం నామినేషన్తోపాటు ఇచ్చిన అఫిడవిట్లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించిన రిటర్నింగ్ అధికారి నారపురెడ్డి మౌర్య వాటిని సవరించాలని సూచించారు. -
టీజీ భరత్ నామపత్రం దాఖలు
[ 24-04-2024]
కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి మంగళవారం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. తెదేపా అభ్యర్థి టీజీ భరత్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
-
బస్సులో సీఎం... ఎండలో జనం
-
విజయవాడ రైల్వేస్టేషన్లో రూ.20కే నాణ్యమైన భోజనం