logo

మావైపు వచ్చేందుకు 30 మంది వైకాపా ఎమ్మెల్యేలు సిద్ధం

వైకాపాకు పోయే కాలం దగ్గర పడిందని, అసెంబ్లీ ఎన్నికల నాటికల్లా రాష్ట్రంలో అధికార వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు తెదేపాలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రాలయం తెదేపా బాధ్యుడు తిక్కారెడ్డి అన్నారు.

Published : 24 Mar 2023 05:11 IST

మాట్లాడుతున్న మంత్రాలయం తెదేపా బాధ్యుడు తిక్కారెడ్డి

కౌతాళం, న్యూస్‌టుడే: వైకాపాకు పోయే కాలం దగ్గర పడిందని, అసెంబ్లీ ఎన్నికల నాటికల్లా రాష్ట్రంలో అధికార వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు తెదేపాలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రాలయం తెదేపా బాధ్యుడు తిక్కారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించిన నేపథ్యంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడుకు మూడు స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించారని, దాన్నిబట్టి అధికార పార్టీపై ఎంత వ్యతిరేకత ఉందో తెలిసిపోయిందన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడు స్థానాల్లో వైకాపా గెలిచేందుకు అవసరమైన ఓట్లు, ఎమ్మెల్యేలు ఉన్నా తెదేపా విజయం సాధించిందని, వైకాపాపై సొంత ఎమ్మెల్యేలే అసంతృప్తితో ఉన్నారో ఇట్టే తెలుస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాను ఇంటికి సాగనంపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా పనిచేసి పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని