తడారిన గడప.. గడప పనులు
సారూ.. మా కాలనీకి బిందెడు నీరు రావడం లేదు.. పైపులైన్లు శిథిలావస్థకు చేరడంతో మంచినీరు లీకేజీ అవుతోంది.. కలుషిత నీటిని తాగాల్సి వస్తోంది.. ఏళ్లుగా మంచినీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాం.. సమస్య పరిష్కరించాలని గడప.. గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేలకు స్థానికులు విన్నవించారు.
సారూ.. మా కాలనీకి బిందెడు నీరు రావడం లేదు.. పైపులైన్లు శిథిలావస్థకు చేరడంతో మంచినీరు లీకేజీ అవుతోంది.. కలుషిత నీటిని తాగాల్సి వస్తోంది.. ఏళ్లుగా మంచినీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాం.. సమస్య పరిష్కరించాలని గడప.. గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేలకు స్థానికులు విన్నవించారు. ఇదిగో పరిష్కరిస్తామని గడపలోనే ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. నెలలు గడుస్తున్నాయి.. తట్టెడు మట్టి పని జరగలేదు.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 362 పనులకు ఆమోదం వస్తే 39 పనులే పూర్తవడం గమనార్హం.
పెద్దపాడులో పెద్ద కష్టం
కల్లూరు పట్టణం పెద్దపాడులో స్థానికులు తాగునీటి ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది ఆగస్టు 16, 17, 18 తేదీల్లో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి పెద్దపాడులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికులు ఎమ్మెల్యేకు తాగునీటి సమస్యను విన్నవించారు.స్పందించిన ఆయన నగరపాలక సంస్థ అధికారులతో మాట్లాడి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయించారు. ట్యాంకర్లూ సకాలంలో రాకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
న్యూస్టుడే, కల్లూరు గ్రామీణ
సంక్రాంతి పోయింది.. ఉగాది దాటింది
హరిజనవాడలో ఎమ్మెల్యే శిల్పాకు సమస్య విన్నవిస్తున్న మహిళ (పాతచిత్రం)
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వచ్చిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డికి నంద్యాల ప్రజలు నీటి ఎద్దడిని విన్నవించారు. సంక్రాంతి నాటికి పట్టణంలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉగాది దాటినా సరే సరిపడా నీరు ఇవ్వకపోగా సమస్య మరింత తీవ్రమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండాపోయిందని దేవనగర్, జగజ్జననినగర్, నడిగడ్డ, హరిజనవాడ, పీవీ నగర్, మూలసాగరం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ సంక్రాంతి నాటికి మంచినీటి సమస్య పరిష్కరిస్తామన్నారు... ఇప్పటి వరకు కదలికలేదని’’ ఒకటో వార్డుకు చెందిన నాగన్న వాపోయారు.
న్యూస్టుడే, నంద్యాల పురపాలకం
ఎనిమిది నెలలు.. అందని జలం
మంత్రి జయరాంను నిలదీస్తున్న మహిళలు (పాతచిత్రం)
ఆస్పరి మండలంలోని కైరుప్పలలో గతేడాది జులైలో మంత్రి జయరాం పర్యటించారు. బీసీ కాలనీలో మహిళలు ఖాళీ బిందెలతో మంత్రి ఎదుట నిరసన తెలిపారు. 20 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని మంత్రి జయరాం వారికి హామీ ఇచ్చారు. ఎనిమిది నెలలు కావొస్తున్నా.. నేటికీ పరిష్కారానికి నోచుకోలేదు. బీసీ కాలనీలో బోర్లు కానీ, మినీ ట్యాంకులు లేవు. మురుగు కాల్వ దాటి పక్కనే ఉన్న ఎస్సీ కాలనీలో నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. - న్యూస్టుడే, ఆలూరు గ్రామీణం
మంచినీటి ఎద్దడిని తీర్చాలని ఎమ్మెల్యే సుధాకర్కు విన్నవిస్తున్న ప్రజలు (పాతచిత్రం)
గూడూరు నగర పంచాయతీ పరిధిలోని కాలనీల్లో ఎమ్మెల్యే డా.సుధాకర్ 21 జనవరి 2023న పర్యటించారు. తమ కాలనీకి మంచినీరు సరఫరా కావడం లేదని కొత్తగేరి వాసులు ఎమ్మెల్యేకు విన్నవించారు. ఇప్పటికీ సమస్య వెంటాడుతోంది.. ఆస్తి, నీటి పన్నును ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.. బిందెడు నీళ్లు ఇవ్వడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు.
న్యూస్టుడే, గూడూరు
బురుజుల దాహం తీరలేదు
ఎమ్మెల్యే శ్రీదేవిని ప్రశ్నిస్తున్న మహిళ (పాతచిత్రం)
మద్దికెర మండలం బురుజులలో గత అక్టోబరు 23, 24వ తేదీల్లో రెండ్రోజుల పాటు ఎమ్మెల్యే శ్రీదేవి పర్యటించారు. మంచినీటి సమస్య పరిష్కరించాలని స్థానికులు విన్నవించారు. అందుకు ఆమె హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.. సమీప గ్రామాలకు వెళ్లి మంచినీటిని తెచ్చుకోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొందని గ్రామస్థులు పేర్కొంటున్నారు.
న్యూస్టుడే, మద్దికెర
పైపులు పడేశారు
మదిరెలో పైప్లైన్ ఏర్పాటుకు సిద్ధంగా పైపులు
కౌతాళం మండలం మదిరెలో 25 ఆగస్టు 2023న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పర్యటించారు. నీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.. వెంటనే సమస్య పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాలేదు. మూడు నెలల కిందట పైపులు తీసుకొచ్చి గ్రామంలో పడేశారు. పనులు ప్రారంభించలేదు.
న్యూస్టుడే, కౌతాళం
చిన్నపెండేకల్.. ఆగని కన్నీళ్లు
ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డికి విన్నవిస్తున్న జనం (పాతచిత్రం)
ఆదోని మండలం చిన్నపెండేకల్లో 10 జూన్ 2022న ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి పర్యటించారు. మంచినీటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం.. సమస్యను పరిష్కరించాలని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. జల్జీవన్ మిషన్ పథకం కింద ఉగాది వరకు మంచినీరు అందిస్తామన్నారు. ఇప్పటి వరకు పూర్తికాలేదు
న్యూస్టుడే, ఆదోని గ్రామీణం
ఇప్పటి వరకు 39 పూర్తి
* కర్నూలు జిల్లాలో 163 పనులకు ప్రతిపాదనలు పంపించగా 159 పనులకు కలెక్టర్ ఆమోదం తెలిపారు. కేవలం ఒక్క పథకం పూర్తి అయ్యింది.. భౌతికంగా 37 పూర్తయ్యాయని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు.
* నంద్యాల జిల్లాలో రూ.7.35 కోట్లతో 199 పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 38 పూర్తవ్వగా.. 131 పురోగతిలో ఉన్నాయి.. 30 ప్రారంభానికి నోచుకోలేదు. ప్రస్తుతం చేసిన పనుల వివరాలు సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసినా నిధులు విడుదల కావడం లేదు.
అధికారుల నీటిమాటలు
ఆలూరు: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరు నియోజకవర్గంలో రూ.2.51 కోట్లతో 58 మంచినీటి పథకాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 10 పూర్తి అయ్యాయి.
* కోడుమూరు: సి.బెళగల్, కోడుమూరు, గూడూరు, కర్నూలు మండలాల్లో 41 తాగునీటి పనులకు రూ.1.35 కోట్లు కేటాయించారు. గూడూరు మండలంలో ఒక్కటి పూర్తైంది.
* ఆదోని: రూ.45 లక్షలతో 17 పనులు చేపట్టగా ఐదు పూర్తయ్యాయి. 12 పురోగతిలో ఉన్నాయి.
* మంత్రాలయం: కోసిగి, మంత్రాలయం, పెద్దకడబూరు మండలాల్లో రూ.1.11 కోట్లతో 32 పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. ఇందులో 10 పూర్తి చేయగా 21 వివిధ దశలో ఉన్నాయి. కోసిగి మండలంలో ఒకటి టెండరు దశలో ఉంది.
* పాణ్యం: ఓర్వకల్లులో రూ.32 లక్షలతో ఐదు పనులు, కల్లూరులో రూ.20 లక్షలతో నాలుగు పనులు చేపట్టారు.
* పత్తికొండ: నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో రూ.45 లక్షలతో 9 పనులు చేపట్టాలని నిర్ణయించారు. మద్దికెర మండలంలో రూ.3 లక్షలతో చేపట్టిన పని మాత్రమే పూర్తయ్యింది.
* ఎమ్మిగనూరు: నియోజకవర్గానికి ఒక్క పని మంజూరు కాలేదు.
న్యూస్టుడే, కర్నూలు సచివాలయం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యోగుల సొమ్ము.. జగన్ వమ్ము
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్ ఉద్యోగుల వరకు 35 వేల మంది ఉన్నారు. ఆర్టీసీ, సచివాలయ ఉద్యోగులు కలిపితే 56 వేల మంది వరకు ఉన్నారు. వీరంతా గత ఐదేళ్ల జగన్ జమానాలో నరకం అనుభవించారు. -
అక్కా.. చెల్లెమ్మలకు జగనన్న బురిడీ
[ 19-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 80 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలుండగా.. అందులో 8 లక్షల మందికిపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. -
కదిలొచ్చిన పసుపు దళం
[ 19-04-2024]
చేనేత పురి పసుపుమయంగా మారింది.. ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరెడ్డి గురువారం నామపత్రాలు దాఖలు చేశారు. ఉదయం 11:30 గంటలకు ఒక సెట్ వేశారు. బీవీ జయనాగేశ్వరరెడ్డి 2, ఆయన సతీమణి నిత్యాదేవి 2 సెట్లు వేశారు. -
భద్రత పేరుతో ఆంక్షలు
[ 19-04-2024]
నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద పోలీసు శాఖ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు అందరికీ ఇబ్బందిగా మారాయి. కర్నూలు ఎంపీ, పాణ్యం ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కలెక్టరేట్లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
వైకాపా పాలనలో వలసలే మిగిలాయి
[ 19-04-2024]
పశ్చిమ ప్రాంతంలో కరవును తరిమేసేందుకు తెదేపా హయాంలో వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2వేల కోట్లు మంజూరు చేశారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. -
నీరింకిన జలాశయం.. నెరవేరని ఆశయం
[ 19-04-2024]
తాగు, సాగునీరు అందించాలనే ఆశయంతో నిర్మించిన జలాశయాలు కళతప్పాయి. జలం లేక వెలవెలబోతున్నాయి. పశ్చిమ పల్లెలు దాహంతో తల్లడిల్లుతున్నా.. చుక్క నీరు అందించలేని పరిస్థితి. -
మహిళా కార్పొరేటర్ ఇంటిపై దుండగుడి దాడి
[ 19-04-2024]
కర్నూలు నగరంలోని ఎల్కూరుబంగ్లాలో ఉంటున్న 41వ వార్డు కార్పొరేటర్ శ్వేతారెడ్డి ఇంటి వద్ద ఓ దుండుగుడు హల్చల్ చేశాడు. -
నగరాభివృద్ధికి కృషి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టీజీ భరత్ కోరారు. ఎస్.ఎ.పి. క్యాంపు వద్ద గురువారం 4వ విడత సైకిల్ భరోసాయాత్ర చేపట్టారు. -
భావోద్వేగానికి గురైన కోట్ల
[ 19-04-2024]
కోడుమూరు తనదైనప్పటికీ కర్నూలు వదిలివెళ్లడం ఎంతో బాధగా ఉందని, జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయతలు తనను కట్టిపడేస్తున్నాయంటూ మాజీ కేంద్ర మంత్రి, డోన్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోట జయసూర్యప్రకాశ్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. -
డివైడర్ను ఢీకొన్న ప్రైవేటు బస్సు
[ 19-04-2024]
ఓర్వకల్లు మండలం పూడిచెర్లమెట్ట వద్ద జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. -
ఉద్యోగుల పింఛన్.. జగన్ వంచించెన్
[ 19-04-2024]
పాత పింఛను విధానాన్నే అమలు చేయండి మహాప్రభో అంటున్నా.. తన మతం తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. తాను అధికారంలోకి వచ్చాక సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పింఛను స్కిమ్) రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించారు. -
అతివలకు సాయం.. అంతంతమాత్రం
[ 19-04-2024]
గతంలో ఓ వెలుగు వెలిగిన పొదుపు సంఘాలు, గ్రామైక్య సంఘాలు ప్రస్తుత వైకాపా పాలనలో నిర్వీర్యమవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోంది. -
కదంతొక్కిన పసుపు దళం
[ 19-04-2024]
శ్రీశైల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి గురువారం నామపత్రం దాఖలు చేశారు. ముందుగా నల్లకాల్వ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
[ 19-04-2024]
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
గడప.. గడపకు వెళ్లాల్సిందే
[ 19-04-2024]
వాలంటీర్లు వైకాపా తరఫున ప్రచారం చేయాల్సిందేనని ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. -
వైకాపాను భూ స్థాపితం చేయాలి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేయాలని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు తహసీల్దారు కార్యాలయంలో గురువారం ఆయన నామపత్రం దాఖలు చేశారు. -
ప్రచండ భానుడు
[ 19-04-2024]
పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భానుడి ధాటికి జనం అల్లాడిపోతున్నారు. నంద్యాల జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటేశాయి. -
తొలి రోజు 11 మంది నామపత్రాల దాఖలు
[ 19-04-2024]
కర్నూలు జిల్లా పరిధిలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన గురువారం విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!