రాబోయే ఎన్నికల్లో తెదేపాదే విజయం
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా విజయం సాధిస్తుందని, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవుతారని తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి పేర్కొన్నారు.
కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి
సమావేశంలో మాట్లాడుతున్న కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి
కోడుమూరు, న్యూస్టుడే: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా విజయం సాధిస్తుందని, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవుతారని తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా విజయం సాధించడంతో కోడుమూరు పంచాయతీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి ఆయన సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ వేదవతి, గాలేరునగరితోపాటు, సుంకేసుల, గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేస్తామన్నారు. వైకాపా నాయకులు రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్నారని, అక్రమ మద్యం ఇసుక, భూదందాకు పాల్పడు తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు అక్రమ సంపాదనే ధ్యేయంగా వైకాపా నాయకులు దందాలు చేస్తున్నారన్నారు. విశాఖలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో రూ.14 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు చేస్తున్న ప్రచారం బూటకమన్నారు. తెదేపా ప్రభుత్వం ఏర్పడితే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు భాగ్యరత్న, ఆంధ్రయ్య, కోట్ల కవితమ్మ, రాంబాబు, ఎం.విష్ణువర్ధన్రెడ్డి, కెఈ.మల్లికార్జునగౌడ్, మధుసూదన్రెడ్డి, హేమాద్రిరెడ్డి, గోపాల్రెడ్డి, తిరుమలనాయుడు, ఎల్లప్పనాయుడు, రవీంద్రగౌడ్, లక్ష్మయ్య శెట్టి, తదితరులు పాల్గొన్నారు.
జగన్ పరిపానలకు కౌంట్డౌన్ మొదలైంది
ఎమ్మిగనూరు, న్యూస్టుడే: రాష్ట్రంలో పంచుమర్తి అనురాధ గెలుపుతో వైకాపా ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని మాజీ ఎమ్మెల్యే బీవీ. జయనాగేశ్వరరెడ్డి అన్నారు. తెదేపా నాయకులు, కార్యకర్తలతో కలిసి తన నివాసం వద్ద శుక్రవారం సంబరాలు చేసుకున్నారు. కేక్కోసం మిఠాయిలు పంచుకున్నారు. బాణ సంచా కాల్చారు. ఈ సందర్భంగా బీవీ మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికల్లో మూడింట గెలిచి తెదేపా సత్తా చాటిందని, రాబోయే రోజుల్లో వైకాపా ప్రభుత్వానికి గుణపాఠం నేర్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. విశాఖకు రాజధాని, కర్నూలుకు న్యాయ రాజధాని అని మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 108 నియోజక వర్గాలు, మూడు ప్రాంతాల్లో పట్టభద్రులు తెదేపాకు మద్దతిచ్చి ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులకు తిరుగులేని మెజార్టీ ఇచ్చారన్నారు. ప్రలోభాలకు గురికాకుండా ప్రజాస్వామ్యానికి ఓటు వేశారన్నారు. కొత్త జీవోలు తీసుకువచ్చి కేసులు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సుందరరాజు, రాముడు, దయాసాగర్, అయ్యళప్ప, బడేసాబ్, తురేగళ్ల నజీర్, తదితరులు పాల్గొన్నారు.
కేక్ కట్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బీవీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పశ్చిమాన సాగునీరు పారిస్తాం
[ 20-04-2024]
‘‘ఆలూరు దద్దరిల్లింది.. ఇంత ఉత్సాహం ఎప్పుడూ చూడలేదు.. ఎన్నికలకు సై అంటూ కర్నూలు కాలు దువ్వుతోంది.. వేదవతి ప్రాజెక్టు పూర్తిచేసే బాధ్యత తీసుకొంటా.. నీటి నిల్వను మూడు టీఎంసీలకు తగ్గించి ప్రాజెక్టు లక్ష్యాన్ని వైకాపా నాశనం చేసింది. -
జగన్ సాయమెంత కౌలు రైతు కలవరింత
[ 20-04-2024]
ఈ మహిళ పేరు అయ్యమ్మ. మండల పరిధిలోని హోసూరుకు చెందిన ఈమె భర్త ఉప్పర తిక్కన్న 2022 ఏప్రిల్ 18న అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. -
జగన్ చోద్యం.. ‘కాడి’తప్పిన కౌలుసేద్యం
[ 20-04-2024]
ముఖ్యమంత్రి గారూ...! మీ ఆత్మబంధువు జగన్ పేరిట 2019 జులై 8న రైతులకు మీరు రాసిన లేఖ గుర్తుందా?... రైతు భరోసా ద్వారా కౌలుదార్లకు మేలు జరగబోతోందని చెప్పారు. మరి నిజంగా ఆదిశగా ఏమైనా చేశారా..? -
వైకాపాను సాగనంపేందుకు సిద్ధం
[ 20-04-2024]
వైకాపాను సాగనంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఏపీ న్యాయయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆదోని పట్టణం స్థానిక అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. -
ఉల్లంఘనులు
[ 20-04-2024]
అధికారం చేతిలో ఉందని నిబంధనలు లెక్కచేయరు.. ఎన్నికల నియమావళిని పాటించరు.. అధికారులు పట్టించుకోరు.. -
‘జగన్ దగా’ఖానాలు
[ 20-04-2024]
కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలలను తీర్చిదిద్దుతాం. ప్రస్తుత ప్రభుత్వాసుపత్రుల ముఖ చిత్రాలు.. వాటి దశ, దిశ మార్చి ఈ చిత్రాలను కూడా రెండేళ్ల తర్వాత మీ ముందుంచుతాం. -
నామపత్రాల సందడి
[ 20-04-2024]
ఆదోని నియోజకవర్గ భాజపా భాజపా అభ్యర్థిగా డాక్టరు పార్థసారథి శుక్రవారం నామపత్రం దాఖలు చేశారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రంలో ఎన్నికల అధికారి శివ్నారయణశర్మకు తన నామపత్రాన్ని అందజేశారు. -
అభ్యర్థులు.. ఆస్తులు
[ 20-04-2024]
కోడుమూరు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఆదిమూలపు సతీశ్ శుక్రవారం నామపత్రాలు దాఖలు చేశారు. కర్నూలులోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్వో శేషిరెడ్డికి రెండు సెట్ల పత్రాలు అందజేశారు. -
చంద్రబాబుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు: బీవీ
[ 20-04-2024]
రాష్ట్రంలో యువత ఉద్యోగాలు, అభివృద్ధి సాధించాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని, ప్రతి ఒక్కరూ తెదేపాను గెలిపించాలని ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
రూ.కోట్లకు బీటలు.. రోగులతో జగన్ ఆటలు
[ 20-04-2024]
ఆదోని జిల్లా సర్వజన వైద్యశాలలో వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రికి వచ్చే రోగులు స్థల భావ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్ పరిధిలో 10-15 మండలాలకు ఈ ఆస్పత్రి ప్రధాన ఆధారం. -
చంద్రబాబుకు జననీరాజనం
[ 20-04-2024]
వీధులన్నీ పసుపుమయంగా మారాయి. జనసైనికులు తరలివచ్చారు. కాషాయం కార్యకర్తలు కదలివచ్చారు. కూటమి కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
ఓటు వినియోగంతోనే దృఢమైన ప్రజాస్వామ్యం
[ 20-04-2024]
ప్రతిఒక్కరు ఓటుహక్కును సద్వినియోగం చేసుకున్నప్పుడే ప్రజాస్వామ్యం దృఢంగా ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు పేర్కొన్నారు. -
ట్యాబు జగన్ డాబు
[ 20-04-2024]
‘ట్యాబ్ల కారణంగా పిల్లలకు చదువులకు ఎంతో మేలు జరుగుతుంది. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినంత సులువుగా పాఠాలు అర్థమయ్యేలా చెప్పొచ్చు. ఉపాధ్యాయులు చెప్పే అంశాలు బాగా అర్థమవుతాయి. -
రెండోరోజు 6 నామపత్రాలు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండోరోజు శుక్రవారం జిల్లాలో ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
[ 20-04-2024]
ఆదోని మండలం బైచిగేరి గ్రామానికి చెందిన వడ్డే రామాంజనేయులు(47) అనే రైతు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తాలూకా ఎస్సై ఎర్రిస్వామి శుక్రవారం తెలిపారు. -
రెండో రోజు 20 మంది
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండో రోజైన శుక్రవారం నామినేషన్ల పర్వం కొనసాగింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఒకరు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 19 మంది అభ్యర్థులు తమ నామపత్రాలు సమర్పించారు. -
గుట్టుగా ట్యాబ్ల పంపిణీ
[ 20-04-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అత్యుత్సాహం చూపుతున్నారు. కర్నూలు మండల పరిధిలోని పూడూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శుక్రవారం ట్యాబ్ల పంపిణీ విషయం చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి