పసుపు కొనని ప్రభుత్వం
పసుపు పంటను కొనేవారు లేక రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి ఎదురుచూస్తున్నారు.
మహానందిలో పసుపును వండుతున్న రైతులు
మహానంది, పాణ్యం గ్రామీణం, న్యూస్టుడే: పసుపు పంటను కొనేవారు లేక రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి ఎదురుచూస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 700 హెక్టార్లలో పంట సాగైంది. మహానంది మండలంలో 218 హెక్టార్లు, చాగలమర్రి 150, రుద్రవరం 105, నంద్యాల 54, పాములపాడు 48, ఆళ్లగడ్డ 18, కొలిమిగుండ్ల 23, పాణ్యం 10, శిరివెళ్ల మండలాల్లో 15 హెక్టార్లలో సాగు చేశారు. వాతావరణ పరిస్థితులు, తెగుళ్ల కారణంతో ఈ ఏడాది పంట దిగుబడి భారీగా తగ్గింది. ఎకరాకు 35 నుంచి 30 క్వింటాళ్లు రావాల్సి ఉండగా.. 10 నుంచి 20 క్వింటాళ్ల వరకు వచ్చింది. పసుపు తవ్వి ఉడకబెట్టి ఆరబోశారు.
అనుమతులు రాలేదంటున్న అధికారులు
క్వింటా రూ.6,800 మద్దతు ధర చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేపట్టారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కొనుగోళ్ల ఆనవాళ్లు కనిపించడం లేదు. ‘‘ ఈ ఏడాది పసుపు కొనుగోలుకు అనుమతులు రాలేదు. గతేడాది మే నెలలో కొనుగోలు చేసిన 1,100 టన్నుల పసుపు సెంట్రల్ వేర్ హౌస్లో నిల్వ ఉంచినట్లు’’ మార్క్ఫెడ్ నంద్యాల జిల్లా మేనేజర్ నాగరాజు తెలిపారు.
లక్షలు పెట్టుబడి పెట్టా
చంద్రనాయక్, గోరుకల్లుతండా, పాణ్యం
నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని పసుపు సాగు చేశా. ఎకరాకు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. ఎకరాకు 20 క్వింటాళ్లు మించి దిగుబడి రాలేదు. వచ్చిన పంటను అమ్ముకుందామని చూసినా ఎవరూ రావడం లేదు. ఇతర ప్రాంతాల్లోని మార్కెట్లో ధరలు తెలుసుకున్నాం. క్వింటా రూ.5 వేల నుంచి రూ.5,500 పలుకుతోందని సమాచారం. కష్టపడి అంతదూరం తీసుకెళ్తే ఏమాత్రం గిట్టుబాటు కాదు.
క్వింటాకు రూ.8 వేలు ఇవ్వాలి
ఎన్.చంద్రశేఖరరెడ్డి, తమడపల్లె, మహానంది
నాలుగు ఎకరాల్లో పసుపు సాగు చేశా. ఎకరాకు రూ.20-25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. బయట మార్కెట్లో ధర లేదు.. ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. క్వింటాకు రూ.8 వేలు ఇస్తే గిట్టుబాటు అవుతుంది. ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు చేస్తుందోనని ఎదురుచూస్తున్నాం.
విత్తన రకాలు మార్చాలి
శ్రీధర్, ఉద్యానశాఖాధికారి, నంద్యాల
మన ప్రాంతంలో పండించే పసుపు లో నాణ్యత లేదని ఇతర దేశాలు దిగుమతి చేసుకోవడం లేదు. ప్రస్తుతం మైదుకూరు సుగంధం రకాన్ని పండిస్తున్నారు. ఇందులో కుర్కుమిన్ శాతం తక్కువగా ఉంటుంది. స్థానిక మార్కెట్కు సరిపోతాయి. ఇప్పటికైనా రైతులు సేలం, బీఎస్ఆర్-2 రోమా రకాలు సాగు చేసుకుంటే మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
‘‘మద్యం కారణంగా అన్యాయానికి గురవుతున్న అక్కచెల్లెమ్మల బాధ చూడలేకున్నా.. అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యపాన నిషేధం అమలు చేస్తామని’’ 2017లో ప్రజా సంకల్ప పాదయాత్రకు చాగలమర్రికి వచ్చిన సందర్భంలో జగన్ ప్రగల్భాలు పలికారు.