ప్రాధాన్యం తగ్గింది
కల్లూరు మండలం తడకనపల్లెకు రెండేళ్ల కిందట రైతు భరోసా కేంద్రం మంజూరైంది. స్థల సమస్యతో ఏడాది గడిచింది.
ఏళ్లుగా సాగుతున్న భవన నిర్మాణాలు
భారీగా పేరుకుపోయిన బిల్లులు
న్యూస్టుడే-కర్నూలు సచివాలయం
గడివేములలో అసంపూర్తిగా సచివాలయ భవనం
కల్లూరు మండలం తడకనపల్లెకు రెండేళ్ల కిందట రైతు భరోసా కేంద్రం మంజూరైంది. స్థల సమస్యతో ఏడాది గడిచింది. ఎట్టకేలకు ఆరు నెలల కిందట స్థలం సమస్య పరిష్కారమైంది. బేస్మెంట్ వద్దే భవన నిర్మాణం ఆగిపోయింది.. ఇక్కడ ఆర్బీకే ఎప్పుడు పూర్తవుతుందో తెలియని అయోమయ పరిస్థితి.
గడివేముల మండలంలో 16 పంచాయతీలకుగాను 14 సచివాలయాలు ఉండగా గని సచివాలయం ఒక్కటి మాత్రమే వినియోగంలోకి వచ్చింది. 14 రైతు భరోసా కేంద్రాలకు ఒక్క కరిమద్దెల ఆర్బీకే వినియోగంలోకి వచ్చింది. చిందుకూరులో ఆర్బీకే నిర్మాణం మొదలు కాలేదు. మిగిలిన గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకేల నిర్మాణాలు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. బిలకలగూడూరు, కొరటమద్ది, గడిగరేవుల సచివాలయాల నిర్మాణాలు పూర్తయ్యాయి.
2020-21 ఏడాదిలో గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, బల్క్మిల్క్, చెత్త సంపద తదితర కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3,393 భవనాలు మంజూరు చేసినా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటివరకు కేవలం 570 భవనాలు మాత్రమే పూర్తయినట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం, నిర్మాణ వ్యయం పెరగడం తదితర కారణాలతో పనులు ముందుకు కదలడం లేదు.
* ఉమ్మడి జిల్లాలో రూ.332.85 కోట్లతో గ్రామ సచివాలయాల నిర్మాణాలు చేపడితే ఇప్పటివరకు సగం పూర్తి కాని పరిస్థితి.
165 ఆర్బీకేలు పూర్తి
రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందించేందుకు గ్రామాల్లో రూ.184.68 కోట్ల అంచనాలతో రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు చేపట్టారు. గడిచిన రెండేళ్లల్లో ఇప్పటి వరకు 165 మాత్రమే పూర్తయ్యాయి. నిర్మాణాలు ఆలస్యం కావడంతో అద్దె భవనాల్లో ఆర్బీకేల నిర్వహణ భారంగా మారింది. సకాలంలో అద్దెలు చెల్లించడం లేదని భవన యజమానులు కేంద్రాలకు తాళాలు వేసిన ఘటనలు లేకపోలేదు.
* వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నిర్మాణాలను రూ.104.68 కోట్లతో చేపట్టారు. ఇందులో ఇప్పటి వరకు కేవలం 52 నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి.
* గ్రామంలో పేద మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో బల్క్ మిల్క్ కేంద్ర భవన నిర్మాణాలు చేపట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ.45.76 కోట్లతో బల్క్ మిల్క్ కేంద్రాల నిర్మాణాలు చేపడుతుండగా.. ఇప్పటి వరకు మూడు మాత్రమే పూర్తవడం గమనార్హం.
* గ్రామీణ ప్రాంతాల్లో రూ.50.88 కోట్లతో డిజిటల్ గ్రంథాలయాల పనులు చేపట్టగా ఒక్కటీ పూర్తి కాలేదు. కర్నూలులో 92, నంద్యాలలో 18 భవనాలు పురోగతిలో ఉన్నాయి. ఘన, వ్యర్థ పదార్థాల నిర్వహణ (చెత్త నుంచి సంపద) కేంద్రాలు 336 మంజూరు చేయగా.. ఇప్పటి వరకు కేవలం 32 మాత్రమే పూర్తయ్యాయి.
నిత్యం సమీక్షిస్తున్నా..
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్య భవన నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. ఏళ్లు గడుస్తున్నా.. అధికారులు నిత్యం సమీక్షిస్తున్నా ప్రయోజనం అంతంతమాత్రంగానే ఉంది. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపొనెంట్ నిధులతో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, డిజిటల్ గ్రంథాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామస్థాయిలో వీటి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనేది దీని ఉద్దేశం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వీటిని ప్రాధాన్య కేటగిరీల్లో చేర్చారు. కాంపోనెంట్ నిధుల్లో ఎక్కువ భాగం భవనాలకే కేటాయించారు. ఈనెల 31వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
బిల్లుల మంజూరులో నిర్లక్ష్యం
* ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ.50 కోట్లకుపైగా బిల్లులు మంజూరు కాక నిర్మాణాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. బిల్లులు చెల్లింపులు చేస్తారో? లేదో? అన్న అనుమానాలతో నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. కోట్లాది రూపాయలతో చేపడుతున్న ప్రాధాన్య భవన నిర్మాణాలకు సంబంధించి ఎఫ్టీఓలు (ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్) పెండింగ్లో ఉన్నాయి.
* ఒక్క కర్నూలు జిల్లాలోనే రూ.45 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో కేవలం 5 రోజుల వ్యవధిలో భవనాల నిర్మాణాలు చేపట్టడం సాధ్యమేనా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నంద్యాల జిల్లాలో రూ.40 కోట్లకు పైగా కాంపోనెంట్ నిధులను వెచ్చించాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయ్యకొండలో ప్రభోత్సవం
[ 23-04-2024]
మండలంలోని అయ్యకొండ గ్రామంలో పౌర్ణమిని పురస్కరించుకొని మంగళవారం సూర్యోదయమే చింతల మునిస్వామి ప్రభోత్సవం వైభవంగా జరిగింది. -
భక్తిశ్రద్ధలతో భోగేశ్వర స్వామి రథోత్సవం
[ 23-04-2024]
చిప్పగిరిలో శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన భోగేశ్వర దేవాలయంలో స్వామివారి కల్యాణం, రథోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వాహకులు చేపట్టారు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన
[ 23-04-2024]
పోలకల్లు, గొల్లల దొడ్డి గ్రామాల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
నాయకుడు వెంకటేశ్వర్లు ఆశయాల సాధన కోసం పోరాడదాం
[ 23-04-2024]
పోరాట యోధుడు బండమీద వెంకటేశ్వుర్లు ఆశయాల సాధన కోసం కలిసి పోరాడదామని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గిడ్డయ్య, సీపీఐ జిల్లా సీసీఐ జిల్లా సమితి సభ్యులు సురేంద్రకుమార్ అన్నారు. -
తెదేపా ఇంటింటి ప్రచారం
[ 23-04-2024]
కౌతాళం మండలంలోని కుంటనహళు గ్రామాల్లో కూటమి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి సోదరుడు రామకృష్ణ రెడ్డి, తెలుగు యువత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
తెదేపా నాయకుల ప్రచారం
[ 23-04-2024]
మండలంలో ఎమ్మిగనూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు తరఫున తెదేపా మండల కన్వీనర్ నజీర్ సాహెబ్, ఇతర నాయకులు, కార్యకర్తలు కున్నూరు, లింగందిన్నె గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. -
చీనీ తోటలో అగ్ని ప్రమాదం
[ 23-04-2024]
మండలంలోని బైలుప్పల గ్రామంలో మాధవరెడ్డి సాగు చేసిన చీని తోట అగ్ని ప్రమాదానికి గురైంది. స్థానికులు మంటలను అదుపు చేశారు. -
తెదేపా ఎన్నికల ప్రచారం
[ 23-04-2024]
రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు తగ్గించాలంటే తెదేపాతోనే సాధ్యమని తెదేపా అభ్యర్థి బీవీ జయనగేశ్వరరెడ్డి అన్నారు. -
వైకాపా పాలనకు చరమగీతం పాడాలి
[ 23-04-2024]
రాష్ట్రంలో వైకాపా పాలనకు చరమగీతం పాడాలని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
‘చేదోడు’.. జగన్ చెడుగుడు
[ 23-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో బీసీ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉంటారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వారిని వెన్నువిరిచారు. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న బీసీ కార్పొరేషన్, బీసీ కులాల కార్పొరేషన్లను వైకాపా ప్రభుత్వం నామమాత్రంగా మార్చేశారు. -
పారిశ్రామిక వాడ.. జగన్ విధ్వంస జాడ
[ 23-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమల ఏర్పాటు పక్కన పెట్టింది. తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన శిలాఫలకాలను వైకాపా నాయకులు ధ్వంసం చేయడం తప్ప ఒక్క పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
జగన్ ఏలు‘బడి’.. ఫలితం బోల్తాపడి
[ 23-04-2024]
‘కాలం’ కలిసి రాలేదు.. పిల్లాజెల్లా వలసబాట పట్టారు.. పశ్చిమాన ఊళ్లు ఖాళీ అయ్యాయి.. విద్యార్థుల్లేక తరగతి గదులు వెలవెలబోయాయి.. గ్లోబల్ విద్యార్థులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గొప్పగా చెప్పే సీఎం జగన్ పట్టించుకోలేదు.. ఫలితం తిరగబడింది.. -
ఒకటినే వేతనాలు చెల్లించేలా చట్టం చేయాలి
[ 23-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు వేతనాలు ఏరోజు వస్తాయో తెలియక అయోమయానికి గురవుతున్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
ఐదేళ్ల అధికారం.. 2కి.మీ కాల్వ నిర్మించలేదు
[ 23-04-2024]
శ్రీశైలం ఎగువన (ఫోర్ షోర్) సుమారు 4.8 కి.మీ. దూరంపాటు అప్రోచ్ కాలువ నిర్మించి 40 టీఎంసీల కృష్ణా జలాలను మల్యాల ఎత్తిపోతల పథకం వరకు తరలించి అక్కడ నీటిని ఎత్తిపోస్తున్నారు. -
అందుబాటులో ఉంటా అభివృద్ధి చేస్తా
[ 23-04-2024]
నంద్యాల ఎంపీగా తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎంపీ అభ్యర్థి డా.బైరెడ్డి శబరి అన్నారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గానికి తెదేపా తరఫున సోమవారం ఆమె నామినేషన్ వేశారు. -
ప్రజల నమ్మకంతోనే గెలిచా: బుగ్గన
[ 23-04-2024]
కార్యకర్తల త్యాగం.. ప్రజల నమ్మకం వల్లే రెండు సార్లు గెలిచా.. వారిపై నమ్మకంతోనే మూడోసారి బరిలో నిలిచానని రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. -
నగరడోణ.. కల తీరేనా
[ 23-04-2024]
పశ్చిమ ప్రాంతం కరువును పారదోలేందుకు నగరడోణ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి, ఆలూరు, హాలహర్వి మండలాల్లో సాగునీరు అందించటం దీని ప్రధాన ఉద్దేశం. -
నిర్లక్ష్యానికి శిలా సాక్ష్యాలు
[ 23-04-2024]
వరద నీరు వృధా కాకుండా, కడప జిల్లాలో 91వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకై రాజోలి ఆనకట్ట వద్ద కుందూ నదిపై 2.95టీఎంసీల సామర్థ్యంతో రాజోలి జలాశయం నిర్మాణానికి 2008లో బీజం పడింది. -
పల్లెల అభివృద్ధి భాజపాతోనే సాధ్యం
[ 23-04-2024]
ఆదోని మండలం జాలిమంచి గ్రామానికి చెందిన 80 మంది భాజపా అభ్యర్థి పార్థసారథి సమక్షంలో పార్టీలో చేరారు. -
సాయన్నా ఈ నరకయాతనకు కారకులెవరో...
[ 23-04-2024]
ఆదోని పట్టణంలో వైకాపా అభ్యర్థి సాయిప్రసాద్రెడ్డి నామినేషన్ సందర్భంగా సోమవారం ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పట్టణ దారులను విస్తరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అది నెరవేరక ఇరుకు దారులే మిగిలాయి. -
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం
[ 23-04-2024]
జిల్లాలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్, పార్టీ ఎన్నికల రాష్ట్ర సమన్వయకర్త వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. -
అభ్యర్థులు.. ఆస్తులు
[ 23-04-2024]
ఆదోని వైకాపా అభ్యర్థిగా సాయిప్రసాద్రెడ్డి సోమవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆయన కుటుంబానికి సంబంధించిన స్ధిర, చర ఆస్తుల వివరాలతో పాటుగా బంగారు ఆభరణాలు, భూముల వివరాలను అఫిడవిట్లో వెల్లడించారు. -
నాలుగో రోజు జోరుగా నామినేషన్లు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కర్నూలు పార్లమెంట్తోపాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. 34 మంది అభ్యర్థులు 38 సెట్ల నామపత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు. -
అంగట్లో రాష్ట్ర ప్రజల వ్యక్తిగత డేటా
[ 23-04-2024]
రాష్ట్ర ప్రజల కీలకమైన వ్యక్తిగత డేటా విచ్చలవిడిగా చేతులు మారుతోందని వైకాపా కార్యకర్త, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కామిని విష్ణువర్ధన్రెడ్డి ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్