బంతి ఆట... పతకాల పంట
పేదింటి బిడ్డ కఠోర శ్రమ, పట్టుదలతో సాధన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నా.. చదువుతోపాటు ఫుట్బాల్ ఆటపై కసరత్తు చేశారు. జాతీయస్థాయి ప్రదర్శనతో వివిధ పతకాలు సాధించి భేష్ అనిపిస్తున్నారు.
- న్యూస్టుడే, ఎమ్మిగనూరు
మెమెంటో అందుకుంటున్న సుభాన్
పేదింటి బిడ్డ కఠోర శ్రమ, పట్టుదలతో సాధన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నా.. చదువుతోపాటు ఫుట్బాల్ ఆటపై కసరత్తు చేశారు. జాతీయస్థాయి ప్రదర్శనతో వివిధ పతకాలు సాధించి భేష్ అనిపిస్తున్నారు. సెలవు రోజుల్లో ఏదో పని చేసుకుంటూ క్రీడా సామగ్రి కొని సాధన చేస్తున్న ఆ యువకుడు జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణిస్తున్నారు.
ఎమ్మిగనూరులో నివాసముంటున్న హుసేనమ్మ, ఉరుకుందల కుమారుడు సుభాన్ సిదార్థ కళాశాలలో బీఏ చదివారు. చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ ఆట అంటే ఇష్టపడే ఆ యువకుడు మెలకువలు తెలుసుకుని సాధన చేశారు. ఫార్వార్డ్గా గోల్స్ సాధిస్తూ పతకాలు సాధిస్తున్నారు. 2023 ఫిబ్రవరి, 5, 6, 7, 8వ తేదీల్లో వైజాగ్లో జరిగిన పోటీల్లో పాల్గొని బేష్ అనిపించారు. క్లబ్ కేసీడీ, బ్లూస్టార్, సంతోష్ ట్రోఫీ పోటీల్లో రాణించి ఉత్తమ క్రీడాకారుడిగా పురస్కారం అందుకున్నారు. కర్నూలు జిల్లా జట్టు తరపున ఆడి రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించి జాతీయ స్థాయి సంతోష్ ట్రోఫీ పోటీలకు ఎంపికయ్యారు. రాజస్థాన్, మిజోరం, కేరళ, బిహార్, జమ్ము కశ్మీర్ జట్లతో తలపడి క్వార్టర్స్కు చేరడంలో కీలకంగా వ్యవహరించారు.
విజయ ప్రస్థానం ఇదీ..
* 2010లో జార్ఖండ్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో రాజస్థాన్, మణిపూర్ జట్లపై రెండు గోల్స్ సాధించి జట్టును ద్వితీయ స్థానంలో నిలిపారు.
* 2012-13లో జమ్ము కశ్మీర్లో జరిగిన జాతీయ స్థాయి ఎస్జీఎఫ్ పోటీల్లో యూపీ, మణిపూర్, కేరళ జట్లతో జరిగిన పోటీల్లో రాణించారు.
* 2014లో గుల్బర్గాలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో గోల్ సాధించి చెన్నె, మధురై, బెంగళూరు జట్లతో జరిగిన పోటీలో కీలకంగా వ్యవహరించారు.
* 2017లో కోలకతాలో జరిగిన దక్షిణ భారత ఫుట్బాల్ పోటీల్లో హైదరాబాద్, శ్రీకాకుళం, నల్గొండ, చెన్నె అలగప్ప యూనివర్సిటీ జట్లతో జరిగిన పోటీల్లో రాణించి భళా అనిపించారు.
* 2018లో పాండిచ్చేరిలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో కేరళ, చెన్నై జట్లతో జరిగిన పోటీల్లో గోల్స్ సాధించి విజయపథంలో నిలిపారు.
* 2019లో విజయనగరంలో జరిగిన సీఎం కప్ పోటీల్లో గీతం, ఆంధ్ర యూనివర్సిటీ జట్లతో తలపడి జట్టును ప్రథమ స్థానంలో నిలిపారు.
* 2021, 22లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్