పాలకుల కారణంగానే సీమ వెనుకబాటు
ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుంచి నేటి ప్రత్యేక నవ్యాంధ్రప్రదేశ్ వరకు అన్నివిధాలుగా నష్టపోయి, వెనుకబాటుతనానికి గురైంది రాయలసీమ వాసులేనని ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి అన్నారు.
మాట్లాడుతున్న శ్రీనివాసరెడ్డి
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుంచి నేటి ప్రత్యేక నవ్యాంధ్రప్రదేశ్ వరకు అన్నివిధాలుగా నష్టపోయి, వెనుకబాటుతనానికి గురైంది రాయలసీమ వాసులేనని ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి అన్నారు. సీమ అభివృద్ధికి ప్రజలు, పాలకులు, పాత్రికేయులు నడుం బిగించాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని దేవీ ఫంక్షన్హాల్లో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కె.నాగరాజు అధ్యక్షతన ‘రాయలసీమ అభివృద్ధి- మీడియా పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. నాటి నుంచి నేటి వరకు అధికశాతం రాయలసీమకు చెందిన నేతలే ముఖ్యమంత్రులుగా వ్యవహరించారని, అయినా ఈ కరవుసీమ అభివృద్ధి గురించి ఆలోచించిన దాఖలాల్లేవన్నారు. కృష్ణా బేసిన్కు సంబంధించిన నీటి వాటాల విషయంలో ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రుల సంప్రదింపులతో సమస్యను పరిష్కరించుకోవచ్చన్నారు. ఎగువభద్ర ప్రాజెక్టుతో సీమకు ఉరితాడు తప్పదని సామాజిక విశ్లేషకులు లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. విభజనతో దారుణంగా నష్టపోయిన ప్రాంతం రాయలసీమ అని మాజీ ఎమ్మెల్యే గఫూర్, సీపీఐ రాష్ట్ర నాయకులు రామచంద్రయ్య పేర్కొన్నారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ బొజ్జా దశరథ రామిరెడ్డి, మేయర్ బి.వై.రామయ్య, భాజపా నాయకులు కపిలేశ్వరయ్య మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న వెన్నుపోటు.. పల్లెల తిరుగుబాటు
[ 24-04-2024]
ప్రస్తుతం పల్లెలు కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్నాయి. జగన్ ప్రభుత్వం నిర్వాకంతో సమస్యలతో సతమతమవుతున్నాయి. కనీసం కుళాయి బిగించేందుకు కూడా చిల్లర లేని పరిస్థితి. కేంద్రం నుంచి వచ్చే నిధులను సైతం మళ్లించి.. -
పాణ్యం ఎన్నికల్లో ప్రముఖం
[ 24-04-2024]
పాణికేశ్వరస్వామి పేరుతో పాణ్యం గ్రామం ఏర్పడింది. కాలక్రమేణా నియోజకవర్గంగా మారింది. కర్నూలు, నంద్యాల మధ్య వారధిగా ఉన్న పాణ్యం నియోజకవర్గం అత్యంత కీలకం. జిల్లాలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం కావడం విశేషం. -
పుస్తక పుటలకు జగనన్న చెద
[ 24-04-2024]
గ్రంథాలయాల్లో పాఠకుల్ని సమస్యలు వేధిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. పాఠకులకు కొత్త పుస్తకాలు అందుబాటులో ఉండటం లేదు. -
కాటసాని ఆస్తులు రూ.75.19 కోట్లు
[ 24-04-2024]
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.75.19 కోట్లుగా చూపారు. సోమవారం నామినేషన్తోపాటు ఇచ్చిన అఫిడవిట్లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించిన రిటర్నింగ్ అధికారి నారపురెడ్డి మౌర్య వాటిని సవరించాలని సూచించారు. -
టీజీ భరత్ నామపత్రం దాఖలు
[ 24-04-2024]
కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి మంగళవారం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. తెదేపా అభ్యర్థి టీజీ భరత్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.