logo

మహిళ దారుణ హత్య

నంద్యాల జిల్లా డోన్‌ మండలం చిన్నమల్కాపురం గ్రామంలో ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు,, గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు... చిన్నమల్కాపురం గ్రామానికి చెందిన నాగేశ్వరమ్మ (35) ఆదివారం ఉదయం తమ పొలానికి వెళ్లారు.

Published : 27 Mar 2023 03:07 IST

నాగేశ్వరమ్మ (పాతచిత్రం)

డోన్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా డోన్‌ మండలం చిన్నమల్కాపురం గ్రామంలో ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు,, గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు... చిన్నమల్కాపురం గ్రామానికి చెందిన నాగేశ్వరమ్మ (35) ఆదివారం ఉదయం తమ పొలానికి వెళ్లారు. పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వస్తుండగా షాలు మైనింగ్‌ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు బండ రాళ్లతో ఆమె తలపై కొట్టారు. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. రక్తం మడుగులో ఉన్న నాగేశ్వరమ్మను అటుగా వెళ్తున్నవారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ఈ హత్య ఎవరు చేశారు అనే కోణంలో విచారిస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఆమె భర్త మద్దయ్య డోన్‌ మండలంలోని యర్రగుంగ్ల సమీపంలో ఆటోలో నుంచి కింద పడి మృతి చెందారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు