లేగ దూడలే రేపటి పాడి పశువులు
లేగ దూడలే రేపటి పాడి పశువులని, పాడి పశుపోషణ రైతులు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు, నంద్యాల పశుసంవర్దక శాఖ కార్యనిర్వహణాధికారి రాజశేఖర్ అన్నారు.
రహిమాన్పురం, బైనపల్లె (బేతంచెర్ల), న్యూస్టుడే: లేగ దూడలే రేపటి పాడి పశువులని, పాడి పశుపోషణ రైతులు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు, నంద్యాల పశుసంవర్దక శాఖ కార్యనిర్వహణాధికారి రాజశేఖర్ అన్నారు. బుధవారం మండలంలోని రహిమాన్పురం, బైనపల్లె గ్రామాల్లో పశుగణాభివృద్ధి సంస్థ, పశు సంవర్దక శాఖ ఆధ్వర్యంలో జాతీయ కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన లేగదూడల ప్రదర్శన నిర్వహించారు. ముర్రా, ఒంగోలు, గిర్ జాతుల దూడలను ప్రదర్శించి, వాటి యజమానులకు బహుమతులు, కాల్షియం టానిక్లు అందజేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. దూడల పోషణలో జాగ్రత్తలు తీసుకోవాలని, దూడ పుట్టిన 7, 15, 30వ రోజు నట్టల నివారణ మందు తాగించాలన్నారు. 70 శాతం దూడలు ఏలిక పాముల బెడద వల్ల మరణిస్తాయన్నారు. సహాయ సంచాలకురాలు వసంతలక్ష్మి మాట్లాడుతూ. లింగ నిర్ధారిత వీర్యం అందుబాటులో ఉందని, రూ.1350 ధరకుగాను రైతుకు రూ.500 రాయితీ చెల్లిస్తే రెండు ఎద సూదులు వేస్తారన్నారు. రూ.850 రాయితీ ద్వారా ఈ వీర్యం ద్వారా ఆడదూడలు మాత్రమే పుడతాయన్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్యులు షంషాద్, రంగస్వామి, అజయ్, గోపాలమిత్రలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
జాతీయ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని పత్తికొండలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
సెబ్ పోలీసుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆదేశాల మేరకు కర్నూలు సెబ్ ఎన్ఫోర్స్ మెంట్ ఇన్ఛార్జి అడిషనల్ ఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో సెబ్ సూపరింటెండెంట్ ఎస్.రవి కుమార్ పర్యవేక్షణలో అక్రమంగా నాటుసారా తయారీ, నిల్వ, అక్రమ మద్యం రవాణా అమ్మకాలపై పత్తికొండ, కర్నూలు పోలీసులు గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. -
అరాచక పాలనకు చరమ గీతం పాడాలి
[ 25-04-2024]
రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని మండల తెదేపా నాయకులు నజీర్ సాహెబ్, తిమ్మారెడ్డి, తిరుపతయ్య, రామాంజనేయులు, బేతాళ బడే సాహెబ్ అన్నారు. -
మలేరియాపై అవగాహన
[ 25-04-2024]
మండలంలో అన్ని గ్రామాల్లో మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని మలేరియా వ్యాధి సబ్ యూనిట్ అధికారి సాయిబాబా అన్నారు. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 25-04-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర అన్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM