logo

నలుగురు ఎస్సైల బదిలీ

జిల్లా పోలీసుశాఖలో నలుగురు ఎస్సైలు బదిలీ అయ్యారు.

Published : 30 Mar 2023 02:09 IST

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా పోలీసుశాఖలో నలుగురు ఎస్సైలు బదిలీ అయ్యారు. కర్నూలు నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై రామయ్యను కర్నూలు తాలుకా అర్బన్‌ స్టేషన్‌కు, అక్కడ పనిచేస్తున్న ఎస్సై లక్ష్మీనారాయణను కర్నూలు ఒకటో పట్టణ స్టేషన్‌కు, వీఆర్‌లో ఉన్న మధుసూధన్‌రావును కర్నూలు నాలుగో పట్టణ ఠాణాకు, వీఆర్‌లోని చిన్నపీరయ్యను ఆదోని మూడో పట్టణ పోలీసుస్టేషన్‌కు బదిలీ చేస్తూ ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని