logo

ముగిసిన ఇంటర్‌ పరీక్షలు

మార్చి 16వ తేదీ మొదలైన జరిగిన ఇంటర్మీడియట్‌ రెండో ఏడాది పబ్లిక్‌ పరీక్షలు బుధవారంతో ముగిసినట్లు ఆర్‌ఐవో గురువయ్యశెట్టి తెలిపారు.

Published : 30 Mar 2023 02:43 IST

మార్చి 16వ తేదీ మొదలైన జరిగిన ఇంటర్మీడియట్‌ రెండో ఏడాది పబ్లిక్‌ పరీక్షలు బుధవారంతో ముగిసినట్లు ఆర్‌ఐవో గురువయ్యశెట్టి తెలిపారు. మొత్తం 32,979 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 31,798 మంది హాజరయ్యారన్నారు. 1,181 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. నందికొట్కూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 8 మాల్‌ ప్రాక్టీసు కేసులు నమోదు చేశామన్నారు. ఆర్‌ఐవో ఐదు కేంద్రాలు, డీవీఈవోలు ఏడు, హైపవర్‌ కమిటీ ఆరు, డీఈసీ ఆరు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ 29, సిట్టింగ్‌ స్క్వాడ్‌ 12, కస్టోడియన్‌ బృందం 29 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు.

న్యూస్‌టుడే, కర్నూలు విద్య

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని