నిధులు.. నినాదాలు
పల్లెల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది.. బిందెడు నీళ్లు ఇవ్వలేకపోతున్నాం.. నిధుల్లేక అబద్ధాలు చెప్పాల్సి వస్తోంది.. సమస్యల గురించి ఎన్నిసార్లు చెప్పినా ఎలాంటి ఫలితం ఉండటం లేదు.. ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయామని మహిళా జడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
అధికార పార్టీ సభ్యుల నిరసన
సమాధానం చెప్పలేకపోయిన మంత్రి
సభ్యులకు సర్దిచెబుతున్న కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, జడ్పీ ఛైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి
కర్నూలు జడ్పీ, న్యూస్టుడే: పల్లెల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది.. బిందెడు నీళ్లు ఇవ్వలేకపోతున్నాం.. నిధుల్లేక అబద్ధాలు చెప్పాల్సి వస్తోంది.. సమస్యల గురించి ఎన్నిసార్లు చెప్పినా ఎలాంటి ఫలితం ఉండటం లేదు.. ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయామని మహిళా జడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అధికారపార్టీకి చెందిన 32 మంది జడ్పీటీసీ సభ్యులు జడ్పీ అధ్యక్షుడు యర్రబోతుల పాపిరెడ్డి, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. తొలిసారిగా జడ్పీ సమావేశానికి హాజరైన గుమ్మనూరు జయరాం జిల్లా ప్రజలకు ఒక్కహామీ ఇవ్వకపోవడం గమనార్హం.
ప్రజలకు ఏం చెప్పాలో అర్థంకావడం లేదు
* ఏడాదిన్నర క్రితం జడ్పీటీసీ సభ్యులుగా బాధ్యతలు చేపట్టాం.. ఇప్పటి వరకు ఎన్ని నిధులు కేటాయించారో చెప్పండి... నిధుల్లేని పదవులు ఎందుకు.. ప్రజలకు ఏం చెప్పాలో అర్థంకాక సతమతమవుతున్నాం.. తమ సమస్యలు ముఖ్యమంత్రికి చెప్పాలని మహిళా సభ్యురాళ్లు ముక్తకంఠంతో నినదించారు.
* జడ్పీ సమావేశాలకు రావడం వృథా ? వచ్చామా స్వీట్, కారా తిన్నామా.. ఇళ్లకు వెళ్లి అన్నం తిన్నామా అనే స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సభ్యులు లేచి నిరసన వ్యక్తం చేస్తుండగా, మిగిలిన జడ్పీటీసీ సభ్యులు మూకుమ్మడిగా నిలబడి వారికి సంఘీభావం తెలిపారు.
* నంద్యాల జడ్పీటీసీ సభ్యుడు మాట్లాడుతూ సమస్యలు తెలియచేసే సమయంలో ఛైర్మన్ అభ్యంతరం చెప్పడం సరికాదు.. సమావేశాలకు మమ్మల్ని ఎందుకు ఆహ్వానిస్తున్నారు.. మీరే నిర్వహించుకోండని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరసన తెలుపుతున్న జడ్పీటీసీ సభ్యురాళ్లు
మంత్రికి నిరసన సెగ
సభ్యుల నుంచి వచ్చే వ్యతిరేకతతో మంత్రికి ఏం చేయాలో అంతుపట్టక నవ్వుతూ శాంతింపజేసే ప్రయత్నం చేశారు. మంచిరోజులు వస్తాయని, సీఎం ఆధ్వర్యంలో అంతా మంచి జరుగుతుందని, అన్ని సమస్యలూ అధిగమిస్తామనే ప్రకటన తప్ప జిల్లాకు ఒక్క హామీ ఇవ్వలేదు. కనీసం పశ్చిమప్రాంతంలోని తాగునీటి సమస్యపైనా స్పందించకపోడం ఏమిటని సభ్యులు చర్చించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పశ్చిమాన జగన్ పచ్చి మోసం
[ 29-03-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 19 మండలాలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి. ఆయా మండలాల్లో 4,84,619.2 హెక్టార్ల (82.05 శాతం) సాగు భూమి విస్తరించి ఉంది. -
జగనన్నా..కరవు సీమ కష్టాలు చూడవా
[ 29-03-2024]
కనిపించలేదా కరవు రైతు వేదన.. వినిపించలేదా పశ్చిమ పల్లెల కన్నీటి రోదన. పొలాలు బీడుబారాయి.. ఊరిలో పనులు కరవయ్యాయి.. ఇళ్లకు తాళాలు పడ్డాయి.. -
వసతిగృహాల్లో ఆకలికేకలు
[ 29-03-2024]
విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, మామయ్యలా అండగా వారికి ఉంటానని ఎక్కడికక్కడ ఊదరగొట్టే ప్రసంగాలతో అదరగొట్టే జగన్ పిల్లలకు భోజనాన్ని అందించే వార్డు సంరక్షకుల సమస్యల్ని కూడా పట్టించుకోవడం లేదు -
ప్రయాణికులకు పరీక్ష
[ 29-03-2024]
బస్సులన్నీ మేమంతా సిద్ధం సభకు తరలివెళ్లాయి. ఆర్టీసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి వైకాపా వారు అడిగింతే తడవుగా బస్సులన్నింటినీ మళ్లించారు -
ముఖ్యమంత్రి జగన్రెడ్డి క్షమాపణలు చెప్పి పర్యటించండి
[ 29-03-2024]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని, తెదేపా హయాంలో రూ.2 వేల కోట్లతో మంజూరు చేసిన ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టు పనులకు పైసా నిధులు ఇవ్వని ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పి పర్యటించాలని ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం
[ 29-03-2024]
తాము 40 ఏళ్లుగా రాజకీయాలకతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నామని, 20 రోజుల ముందు వచ్చిన ఓ వ్యక్తి ప్రజలకు సేవ చేస్తామని.. ఓటేయండి అని అంటున్నారని.. ఆ మాటలు నమ్మొద్దని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్ కోరారు. -
తెదేపాను గెలిపించుకుందాం
[ 29-03-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపాను గెలిపించుకుందామని మాజీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు. కల్లూరు మండల పరిధి పర్ల గ్రామంలో గురువారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు -
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత జగన్మోహన్రెడ్డిదే
[ 29-03-2024]
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిదేనని మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!