అక్రమార్కుల పట్టు.. చెదిరిన గట్టు
జగన్నాథగట్టును అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. అధికార పార్టీ అండదండలతో రాత్రింబవళ్లు తవ్వేస్తున్నారు. జర్నలిస్టులు, ఐఐఐటీ, క్లస్టర్ విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూముల్లో తవ్వకాలు చేపట్టడం కలకలం సృష్టిస్తోంది.
ఈనాడు, కర్నూలు, న్యూస్టుడే, కల్లూరు గ్రామీణం
తవ్వేశారు ఇలా..
జగన్నాథగట్టును అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. అధికార పార్టీ అండదండలతో రాత్రింబవళ్లు తవ్వేస్తున్నారు. జర్నలిస్టులు, ఐఐఐటీ, క్లస్టర్ విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూముల్లో తవ్వకాలు చేపట్టడం కలకలం సృష్టిస్తోంది. మట్టి తరలింపులో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అనుచరులు కీలకంగా వ్యవహరిస్తుండటం వల్లే అధికారులు గట్టి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
పేదలకిస్తామని పెద్దల కన్ను
జగన్నాథగట్టు దాదాపు ఐదు వందల ఎకరాలు కల్లూరు, కర్నూలు మండలాల పరిధిలో విస్తరించి ఉంది. ఇక్కడ రూపాలసంగమేశ్వర స్వామి ఆలయం, ఈద్గా, 60 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం, ఐఐఐటీ, ఇందిరమ్మ కాలనీ ఉన్నాయి. 250 ఎకరాలు పోలీస్ పరేడ్కు ఇవ్వాలని గతంలో నిర్ణయించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న కాలనీ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. రూ.కోటి వెచ్చించి రోడ్లు, హద్దు రాళ్లు పాతారు. విలువైన స్థలం కావడంతో కొందరు ప్రజాప్రతినిధులు పేచీ పెట్టారు. 250 ఎకరాలు ఖాళీగా ఉండటం.. అక్కడ విలువైన ఎర్రమట్టి, కంకర రాళ్లు ఉండటంతో అక్రమార్కుల కన్నుపడింది.
కొరవడిన సమన్వయం
సహజ వనరుల పరిరక్షణ బాధ్యత పలు ప్రభుత్వ శాఖల పరిధిలో ఉంది. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తేనే దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. ఆమేరకు జిల్లా స్థాయి అధికారుల్లో సమన్వయం లేదు. సమష్టి వ్యూహాన్ని రచించి అమలు చేయకపోవడం అక్రమార్కులకు కలిసి వస్తోంది. బహిరంగంగా ఎర్రమట్టిని భారీ లారీల్లో తరలిస్తున్నా అధికారులకు కనిపించకపోవడం గమనార్హం. చారిత్రక నేపథ్యం ఉన్న జగన్నాథగట్టు కరిగిపోతున్నా కలెక్టర్స్థాయిలో సమీక్షలు జరగకపోవడంపై నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మట్టి తవ్వకాలు పూర్తిగా నిషేధిస్తే ఎలాంటి సమస్య ఉండదు.
అసలు సూత్రధారులను వదిలేసి
జగన్నాథగట్టు ప్రాంతంలోని సర్వే నంబరు 793-1లో ఏకంగా 1,71,308 క్యూబిక్ మీటర్ల ఎర్రమట్టిని అక్రమంగా తవ్వినట్లు అధికారులు గుర్తించారు. గత సంవత్సరం డిసెంబరు నుంచి గనుల శాఖ అధికారులు, గనులశాఖ జిల్లా విజిలెన్స్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేశారు. పది మంది పాత్ర ఉన్నట్లు గుర్తించి రూ.9.49 కోట్ల జరిమానా విధించారు. అధికారుల నోటీసులకు ఇప్పటి వరకు ఒక్కరే సమాధానం ఇచ్చారు. జరిమానా మాత్రం ఒక్కరూ చెల్లించలేదు. మట్టి తరలింపులో తమ పాత్ర లేదని వారంతా న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. 2022-23 ఏడాది జనవరి నెలాఖరు వరకు 93 కేసులు నమోదు చేసి రూ.10,75,473 జరిమానా విధించినట్లు గనులశాఖ అధికారులు చెబుతున్నారు. అధికారులు అసలు సూత్రధారులను వదిలేసి అనామకులకు జరిమానా విధించినట్లు తెలుస్తోంది.
లోయలను తలపిస్తున్న జగన్నాథగట్టు
జగన్నాథగట్టు ప్రాంతంలో ఎర్రమట్టి నిల్వలు, కంకర తయారీకి ఉపయోగపడే బండరాళ్లు భారీగా ఉన్నాయి. భవనాలు, రహదారుల నిర్మాణాలకు అత్యంత కీలకమైన వీటి కోసం అక్రమార్కులు బరితెగిస్తున్నారు. అంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరుగుతోంది. నిత్యం 50 నుంచి 70 టిప్పర్లలో మట్టిని కర్నూలు, నంద్యాల ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్ను రూ.4,000 నుంచి రూ.4,500 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఎన్నికల ప్రచారం
[ 23-04-2024]
రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు తగ్గించాలంటే తెదేపాతోనే సాధ్యమని తెదేపా అభ్యర్థి బీవీ జయనగేశ్వరరెడ్డి అన్నారు. -
వైకాపా పాలనకు చరమగీతం పాడాలి
[ 23-04-2024]
రాష్ట్రంలో వైకాపా పాలనకు చరమగీతం పాడాలని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
‘చేదోడు’.. జగన్ చెడుగుడు
[ 23-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో బీసీ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉంటారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వారిని వెన్నువిరిచారు. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న బీసీ కార్పొరేషన్, బీసీ కులాల కార్పొరేషన్లను వైకాపా ప్రభుత్వం నామమాత్రంగా మార్చేశారు. -
పారిశ్రామిక వాడ.. జగన్ విధ్వంస జాడ
[ 23-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమల ఏర్పాటు పక్కన పెట్టింది. తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన శిలాఫలకాలను వైకాపా నాయకులు ధ్వంసం చేయడం తప్ప ఒక్క పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
జగన్ ఏలు‘బడి’.. ఫలితం బోల్తాపడి
[ 23-04-2024]
‘కాలం’ కలిసి రాలేదు.. పిల్లాజెల్లా వలసబాట పట్టారు.. పశ్చిమాన ఊళ్లు ఖాళీ అయ్యాయి.. విద్యార్థుల్లేక తరగతి గదులు వెలవెలబోయాయి.. గ్లోబల్ విద్యార్థులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గొప్పగా చెప్పే సీఎం జగన్ పట్టించుకోలేదు.. ఫలితం తిరగబడింది.. -
ఒకటినే వేతనాలు చెల్లించేలా చట్టం చేయాలి
[ 23-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు వేతనాలు ఏరోజు వస్తాయో తెలియక అయోమయానికి గురవుతున్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
ఐదేళ్ల అధికారం.. 2కి.మీ కాల్వ నిర్మించలేదు
[ 23-04-2024]
శ్రీశైలం ఎగువన (ఫోర్ షోర్) సుమారు 4.8 కి.మీ. దూరంపాటు అప్రోచ్ కాలువ నిర్మించి 40 టీఎంసీల కృష్ణా జలాలను మల్యాల ఎత్తిపోతల పథకం వరకు తరలించి అక్కడ నీటిని ఎత్తిపోస్తున్నారు. -
అందుబాటులో ఉంటా అభివృద్ధి చేస్తా
[ 23-04-2024]
నంద్యాల ఎంపీగా తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎంపీ అభ్యర్థి డా.బైరెడ్డి శబరి అన్నారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గానికి తెదేపా తరఫున సోమవారం ఆమె నామినేషన్ వేశారు. -
ప్రజల నమ్మకంతోనే గెలిచా: బుగ్గన
[ 23-04-2024]
కార్యకర్తల త్యాగం.. ప్రజల నమ్మకం వల్లే రెండు సార్లు గెలిచా.. వారిపై నమ్మకంతోనే మూడోసారి బరిలో నిలిచానని రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. -
నగరడోణ.. కల తీరేనా
[ 23-04-2024]
పశ్చిమ ప్రాంతం కరువును పారదోలేందుకు నగరడోణ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి, ఆలూరు, హాలహర్వి మండలాల్లో సాగునీరు అందించటం దీని ప్రధాన ఉద్దేశం. -
నిర్లక్ష్యానికి శిలా సాక్ష్యాలు
[ 23-04-2024]
వరద నీరు వృధా కాకుండా, కడప జిల్లాలో 91వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకై రాజోలి ఆనకట్ట వద్ద కుందూ నదిపై 2.95టీఎంసీల సామర్థ్యంతో రాజోలి జలాశయం నిర్మాణానికి 2008లో బీజం పడింది. -
పల్లెల అభివృద్ధి భాజపాతోనే సాధ్యం
[ 23-04-2024]
ఆదోని మండలం జాలిమంచి గ్రామానికి చెందిన 80 మంది భాజపా అభ్యర్థి పార్థసారథి సమక్షంలో పార్టీలో చేరారు. -
సాయన్నా ఈ నరకయాతనకు కారకులెవరో...
[ 23-04-2024]
ఆదోని పట్టణంలో వైకాపా అభ్యర్థి సాయిప్రసాద్రెడ్డి నామినేషన్ సందర్భంగా సోమవారం ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పట్టణ దారులను విస్తరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అది నెరవేరక ఇరుకు దారులే మిగిలాయి. -
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం
[ 23-04-2024]
జిల్లాలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్, పార్టీ ఎన్నికల రాష్ట్ర సమన్వయకర్త వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. -
అభ్యర్థులు.. ఆస్తులు
[ 23-04-2024]
ఆదోని వైకాపా అభ్యర్థిగా సాయిప్రసాద్రెడ్డి సోమవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆయన కుటుంబానికి సంబంధించిన స్ధిర, చర ఆస్తుల వివరాలతో పాటుగా బంగారు ఆభరణాలు, భూముల వివరాలను అఫిడవిట్లో వెల్లడించారు. -
నాలుగో రోజు జోరుగా నామినేషన్లు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కర్నూలు పార్లమెంట్తోపాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. 34 మంది అభ్యర్థులు 38 సెట్ల నామపత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు. -
అంగట్లో రాష్ట్ర ప్రజల వ్యక్తిగత డేటా
[ 23-04-2024]
రాష్ట్ర ప్రజల కీలకమైన వ్యక్తిగత డేటా విచ్చలవిడిగా చేతులు మారుతోందని వైకాపా కార్యకర్త, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కామిని విష్ణువర్ధన్రెడ్డి ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?