వెండి దొంగలు.. ఆ ఇద్దరు పోలీసులే
కర్నూలు తాలుకా పోలీసుస్టేషన్లో 105 కిలోల వెండి అపహరణ మిస్టరీకి తెరపడింది. 2021 జనవరి 28న కర్నూలు మండలం పంచలింగాల చెక్పోస్టు వద్ద సీజ్ చేసి తమిళనాడు వ్యాపారులకు సంబంధించిన 105 కిలోల వెండి, రూ.2.05 లక్షల నగదును సదరు స్టేషన్లోని బీరువా ఉంచగా మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
2021 జనవరి 28 రాత్రి సెబ్ అధికారులు పట్టుకున్న వెండి, తమిళనాడు వ్యాపారులు, కారు ఇదే
కర్నూలు నేరవిభాగం, న్యూస్టుడే : కర్నూలు తాలుకా పోలీసుస్టేషన్లో 105 కిలోల వెండి అపహరణ మిస్టరీకి తెరపడింది. 2021 జనవరి 28న కర్నూలు మండలం పంచలింగాల చెక్పోస్టు వద్ద సీజ్ చేసి తమిళనాడు వ్యాపారులకు సంబంధించిన 105 కిలోల వెండి, రూ.2.05 లక్షల నగదును సదరు స్టేషన్లోని బీరువా ఉంచగా మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసు ఉన్నతాధికారి విచారణకు ఉపక్రమించారు. గతంలో కర్నూలు తాలుకా అర్బన్ పోలీసుస్టేషన్లో పనిచేసిన మహిళా హెడ్ కానిస్టేబుల్ అమరావతి, కానిస్టేబుల్ రమణ ఈ నేరానికి పాల్పడినట్లు తేలినట్లు తెలిసింది. అమరావతి భర్త విజయ్భాస్కర్ గురువారం ఉదయం ఇంటి నుంచి తప్పించుకునే యత్నం చేయగా పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. ఆమెకు సహకరించిన స్టేషన్ స్వీపర్ అయ్యన్న, వెండి తరలించేందుకు సహకరించిన ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు మండల పరిధిలో ఓ పోలీసు రహస్య ప్రదేశంలో పోలీసు ఉన్నతాధికారి గట్టిగా విచారించడంతో ఆ ఇద్దరు పోలీసులు నేరాన్ని అంగీకరించారు. షరాఫ్ బజార్లోని 12వ నంబరు దుకాణ వ్యాపారికి విక్రయించినట్లు తేలటంతో పోలీసులు రికవరీ చర్యలు చేపట్టారు. విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. శుక్రవారం పోలీసు అధికారులు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించనున్నారు.
వివాదాల స్టేషన్
కర్నూలు తాలుకా అర్బన్ పోలీసుస్టేషన్ వివాదాలకు కేంద్రంగా మారింది. సదరు స్టేషన్లో గత రెండేళ్లలో ముగ్గురు సీఐలు బదిలీ కాగా ప్రస్తుతం నాలుగో సీఐగా రామలింగయ్య పనిచేస్తున్నారు. 2021లో సీఐగా విక్రమ్సింహా ఉన్న సమయంలో నిడ్జూరులో తెదేపా నాయకుడి హత్య జరగటం, తదితర వివాదాల నేపథ్యంలో ఆయన బదిలీ అయ్యారు. తర్వాత వచ్చిన సీఐ కంబగిరిరాముడు ఇలానే సీజ్ చేసిన రూ.75 లక్షల మొత్తంలో రూ.15 లక్షల దౌర్జన్యంగా తీసుకోవటం వివాదాస్పదంగా మారడంతో అప్పటి ఎస్పీ సుధీర్కుమార్రెడ్డి సీఐపై కేసు నమోదు చేయించారు. తర్వాత వచ్చిన సీఐ శేషయ్యకు ఓ ఎమ్మెల్యేతో వివాదం నెలకొనటంతో బదిలీ అయ్యారు.
ఉదాసీనంగా వ్యవహరించి..
2021 జనవరి 28వ తేదీ రాత్రి 105 కేజీల వెండి, రూ.2.05 లక్షల నగదును సీజ్ చేసి సెబ్కు అప్పగించిన సందర్భంలో కర్నూలు తాలుకా అర్బన్ అధికారులు 102 సెక్షన్ కింద కేసు నమోదు చేయాల్సి ఉంది.. లేదంటే సంబంధిత శాఖలకు అప్పగించాల్సి ఉంది. సదరు స్టేషన్ అధికారి ఎలాంటి చర్యలు తీసుకోకుండా సొత్తును బీరువాలో ఉంచటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ తర్వాత వచ్చిన సీఐలు వెండి పట్ల ఉదాసీనంగా వ్యవహరించారు. వార్షిక సందర్భంలోగానీ, పలుమార్లు స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన ఉన్నతాధికారులు ఈ విషయాన్ని గమనించకపోవటం గమనార్హం. వీరందరి ఉదాసీనత ఆ ఇద్దరికీ దురాలోచన కలిగించినట్లైంది.
అప్పుడే మాయం..
కర్నూలు తాలుకా అర్బన్ సీఐగా శేషయ్య ఉన్న సమయంలో అదే స్టేషన్లో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ అమరావతి, కానిస్టేబుల్ రమణబాబు స్టేషన్లో కీలకంగా వ్యవహరించేవారు.. బీరువాలో నిల్వ ఉంచిన వెండిపై కన్నేసిన అమరావతి పలుమార్లు వ్యాపారులకు ఫోన్ చేసి తీసుకెళ్లాలని చెప్పగా వారు నిరాకరించారు. దీంతో వారికి వెండి తీసుకెళ్లే ఉద్దేశం లేదని, తీసుకెళ్లి సొమ్ము చేసుకోవాలన్న దురాలోచన కలిగింది. రమణబాబుతో తన ఆలోచనను చెప్పగా అతను చేతులు కలిపాడు. వాటాలపై నిర్ణయం తీసుకున్నారు. స్టేషన్లో సీజ్ చేసిన మద్యం ధ్వంసం చేసే కార్యక్రమాన్ని 2022 జూన్లో సీఐ శేషయ్య చేపట్టారు. జప్తు చేసిన మద్యం సీసాలను స్టేషన్ బయటపెట్టారు. అదే అదనుగా చేసుకుని నిందితులు వెండి బస్తాలను బయట ఉంచారు. అమరావతి భర్త ఆటోలో రావటంతో స్టేషన్ స్వీపర్ సాయంతో వెండిని అందులో ఎక్కించారు. నంద్యాల చెక్పోస్టుకు వెళ్లిన తర్వాత స్వీపర్ను కిందికి దింపి వదిలేసి ఇంటికి తీసుకెళ్లారు. వాటాలు పంచుకున్న ఇద్దరు పోలీసులు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. అమరావతి తన భర్త సోదరుడి ద్వారా అమ్మినట్లు తెలిసింది. సెబ్ అధికారులు సొత్తును అప్పగించే సందర్భంలో వివరాలు నమోదు చేసేందుకు పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన దస్త్రాన్ని ఇద్దరూ తెలివిగా మాయం చేశారు. వచ్చిన డబ్బుతో అమరావతి 40 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల కారు, ఓ ఇంటి స్థలం కొనుగోలు చేయగా, రమణబాబు పంచలింగాల పరిధిలో 12 సెంట్ల స్థలం కొనుగోలు చేసినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఎన్నికల ప్రచారం
[ 23-04-2024]
రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు తగ్గించాలంటే తెదేపాతోనే సాధ్యమని తెదేపా అభ్యర్థి బీవీ జయనగేశ్వరరెడ్డి అన్నారు. -
వైకాపా పాలనకు చరమగీతం పాడాలి
[ 23-04-2024]
రాష్ట్రంలో వైకాపా పాలనకు చరమగీతం పాడాలని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
‘చేదోడు’.. జగన్ చెడుగుడు
[ 23-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో బీసీ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉంటారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వారిని వెన్నువిరిచారు. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న బీసీ కార్పొరేషన్, బీసీ కులాల కార్పొరేషన్లను వైకాపా ప్రభుత్వం నామమాత్రంగా మార్చేశారు. -
పారిశ్రామిక వాడ.. జగన్ విధ్వంస జాడ
[ 23-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమల ఏర్పాటు పక్కన పెట్టింది. తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన శిలాఫలకాలను వైకాపా నాయకులు ధ్వంసం చేయడం తప్ప ఒక్క పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
జగన్ ఏలు‘బడి’.. ఫలితం బోల్తాపడి
[ 23-04-2024]
‘కాలం’ కలిసి రాలేదు.. పిల్లాజెల్లా వలసబాట పట్టారు.. పశ్చిమాన ఊళ్లు ఖాళీ అయ్యాయి.. విద్యార్థుల్లేక తరగతి గదులు వెలవెలబోయాయి.. గ్లోబల్ విద్యార్థులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గొప్పగా చెప్పే సీఎం జగన్ పట్టించుకోలేదు.. ఫలితం తిరగబడింది.. -
ఒకటినే వేతనాలు చెల్లించేలా చట్టం చేయాలి
[ 23-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు వేతనాలు ఏరోజు వస్తాయో తెలియక అయోమయానికి గురవుతున్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
ఐదేళ్ల అధికారం.. 2కి.మీ కాల్వ నిర్మించలేదు
[ 23-04-2024]
శ్రీశైలం ఎగువన (ఫోర్ షోర్) సుమారు 4.8 కి.మీ. దూరంపాటు అప్రోచ్ కాలువ నిర్మించి 40 టీఎంసీల కృష్ణా జలాలను మల్యాల ఎత్తిపోతల పథకం వరకు తరలించి అక్కడ నీటిని ఎత్తిపోస్తున్నారు. -
అందుబాటులో ఉంటా అభివృద్ధి చేస్తా
[ 23-04-2024]
నంద్యాల ఎంపీగా తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎంపీ అభ్యర్థి డా.బైరెడ్డి శబరి అన్నారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గానికి తెదేపా తరఫున సోమవారం ఆమె నామినేషన్ వేశారు. -
ప్రజల నమ్మకంతోనే గెలిచా: బుగ్గన
[ 23-04-2024]
కార్యకర్తల త్యాగం.. ప్రజల నమ్మకం వల్లే రెండు సార్లు గెలిచా.. వారిపై నమ్మకంతోనే మూడోసారి బరిలో నిలిచానని రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. -
నగరడోణ.. కల తీరేనా
[ 23-04-2024]
పశ్చిమ ప్రాంతం కరువును పారదోలేందుకు నగరడోణ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి, ఆలూరు, హాలహర్వి మండలాల్లో సాగునీరు అందించటం దీని ప్రధాన ఉద్దేశం. -
నిర్లక్ష్యానికి శిలా సాక్ష్యాలు
[ 23-04-2024]
వరద నీరు వృధా కాకుండా, కడప జిల్లాలో 91వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకై రాజోలి ఆనకట్ట వద్ద కుందూ నదిపై 2.95టీఎంసీల సామర్థ్యంతో రాజోలి జలాశయం నిర్మాణానికి 2008లో బీజం పడింది. -
పల్లెల అభివృద్ధి భాజపాతోనే సాధ్యం
[ 23-04-2024]
ఆదోని మండలం జాలిమంచి గ్రామానికి చెందిన 80 మంది భాజపా అభ్యర్థి పార్థసారథి సమక్షంలో పార్టీలో చేరారు. -
సాయన్నా ఈ నరకయాతనకు కారకులెవరో...
[ 23-04-2024]
ఆదోని పట్టణంలో వైకాపా అభ్యర్థి సాయిప్రసాద్రెడ్డి నామినేషన్ సందర్భంగా సోమవారం ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పట్టణ దారులను విస్తరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అది నెరవేరక ఇరుకు దారులే మిగిలాయి. -
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం
[ 23-04-2024]
జిల్లాలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్, పార్టీ ఎన్నికల రాష్ట్ర సమన్వయకర్త వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. -
అభ్యర్థులు.. ఆస్తులు
[ 23-04-2024]
ఆదోని వైకాపా అభ్యర్థిగా సాయిప్రసాద్రెడ్డి సోమవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆయన కుటుంబానికి సంబంధించిన స్ధిర, చర ఆస్తుల వివరాలతో పాటుగా బంగారు ఆభరణాలు, భూముల వివరాలను అఫిడవిట్లో వెల్లడించారు. -
నాలుగో రోజు జోరుగా నామినేషన్లు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కర్నూలు పార్లమెంట్తోపాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. 34 మంది అభ్యర్థులు 38 సెట్ల నామపత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు. -
అంగట్లో రాష్ట్ర ప్రజల వ్యక్తిగత డేటా
[ 23-04-2024]
రాష్ట్ర ప్రజల కీలకమైన వ్యక్తిగత డేటా విచ్చలవిడిగా చేతులు మారుతోందని వైకాపా కార్యకర్త, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కామిని విష్ణువర్ధన్రెడ్డి ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్