పుర ఖాతాల్లో సర్వే ఖర్చు
మున్సిపాలిటీల్లో చేపడుతున్న ‘జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకం’ భారం స్థానిక సంస్థలే భరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆదాయం లేక అప్పుల ఊబిలో చిక్కుకున్నాయి.
ప్రభుత్వ ఆదేశాలతో అధికారుల కసరత్తు
చిన్న మున్సిపాల్టీలు భరించడం కష్టమే
- నంద్యాల పట్టణం, న్యూస్టుడే
నంద్యాలలో రీసర్వే చేస్తున్న ఏజెన్సీ బృందం
మున్సిపాలిటీల్లో చేపడుతున్న ‘జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకం’ భారం స్థానిక సంస్థలే భరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆదాయం లేక అప్పుల ఊబిలో చిక్కుకున్నాయి. ‘చెత్త’భారం భరించలేక చేతులెత్తేశారు. ఇలాంటి పరిస్థితుల్లో భూముల రీసర్వేకు అయ్యే ఖర్చును స్థానిక సంస్థలే వెచ్చించాల్సి ఉంటుందని విడుదలైన జీవో పాలకవర్గాలకు కంటిమీది కునుకులేకుండా చేస్తోంది. ఖర్చును ప్రాథమికంగా లెక్కించి మున్సిపల్ ఖాతాకు బదలాయించే ప్రయత్నాలు అధికారులు చేస్తున్నారు.
ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగింత
ఉమ్మడి జిల్లాలో కర్నూలు నగరం, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్ పట్టణాల్లో సర్వే చేయాలని నిర్ణయించారు. ఇందులో కర్నూలు నగరం 100 చదరపు కిలోమీటర్లు, నంద్యాల 53 చ.కి.మీ, ఆదోని 49 చ.కి.మీ, ఎమ్మిగనూరు 30 చ.కి.మీ, డోన్ 25 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్నాయి. ఆయా పట్టణాల్లో ప్రైవేటు ఏజెన్సీల ద్వారా సర్వే పూర్తి చేశారు. డ్రోన్ కెమెరాల ద్వారా పట్టణాల్లో పూర్తి వివరాలు సేకరించారు. ఏజెన్సీ అందించే చిత్రాలు, సమాచారం ఆధారంగా ఆయా మున్సిపాల్టీల్లో రీసర్వే జరగనుంది. ఆత్మకూరు, ఆళ్లగడ్డలో త్వరలో ప్రారంభం కానుంది.
పరిపాలన ఆమోదానికి ప్రతిపాదనలు
* సర్వే చేసిన ఏజెన్సీకి డబ్బులు చెల్లించేందుకు పురపాలక అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కర్నూలు నగరంలో రూ.6 లక్షలు, నంద్యాల, ఆదోనిలో రూ.1.50 లక్షలు చొప్పున, ఎమ్మిగనూరు, డోన్లలో రూ.లక్ష చొప్పున ప్రాథమికంగా చెల్లించాల్సి ఉంది. ఆ మేరకు ఆయా మున్సిపాల్టీలు కౌన్సిల్ నుంచి పరిపాలన ఆమోదం పొందేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నాయి.
* సర్వే పూర్తయి యాజమాన్య హక్కులు ఇచ్చే వరకు దశల వారీగా ఆర్థిక భారం భరించకతప్పదు. కర్నూలు నగరపాలకకు రూ.50 లక్షల వరకు, నంద్యాల, ఆదోని పురపాలకలపై రూ.30 లక్షల వరకు భారం పడనుంది. మిగతా మున్సిపాల్టీలూ రూ.లక్షల్లో వ్యయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
పరికరాల ఖర్చు
* ఉమ్మడి జిల్లాలోని పది మున్సిపాల్టీల పరిధిలో 3.5 లక్షల మంది భూ యాజమాన్యపు హక్కులు కలిగి ఉన్నారు. ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ‘శాశ్వత భూ హక్కు- భూ రక్ష’ పథకం కింద కర్నూలులో 60 డివిజన్లు, నంద్యాల 42, ఆదోనిలో 42, ఎమ్మిగనూరు 24, డోన్ 24, ఆత్మకూరు 20, ఆళ్లగడ్డ 20, నందికొట్కూరు 20, గూడూరు, బేతంచెర్లలో 12 డివిజన్ల పరిధిలోని అన్ని రకాల భూములు, ఆస్తులను రీసర్వే చేసి యాజమాన్యపు హక్కులు నిర్ధారిస్తారు.
* రీసర్వే కోసం ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్వేర్తో పాటు రోవర్లు, ట్యాబ్లు, డెస్క్టాప్లు, ప్రింటర్ల వంటి సాంకేతిక పరికరాలు సమకూర్చుకోవాలి. వీటి కొనుగోలుకు అయ్యే ఖర్చును స్థానిక సంస్థలే చెల్లించాలని సూచించింది.
భూముల సమగ్ర సమాచారం సేకరణ
కార్స్ టెక్నాలజీ, డ్రోన్స్, రోవర్ వంటి సాంకేతిక పరికరాల ద్వారా యజమానుల భూ స్థితి, పత్రాల ఆధారంగా హక్కులు ఎలా తెలుసుకోవాలో రీసర్వే బృందాలకు శిక్షణ ఇచ్చారు. రీసర్వేలో భాగంగా మున్సిపాల్టీల్లో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ భూములు, అనుబంధ సంస్థల భూములు, ఆస్తులు తదితర వివరాలతో పాటు అధికారిక, అనధికారిక లేఅవుట్ల వివరాలు రీసర్వే రికార్డుల్లో, అక్షాంశ, రేఖాంశాలతో నమోదు చేస్తున్నారు. ఆయా భౌగోళిక అంశాల ఆధారంగా మ్యాప్ను రూపొందిస్తున్నారు. ప్రైవేటు ఆస్తులు, పట్టణ వాసుల భూహక్కు పత్రాల ఆధారంగా క్షేత్రస్థాయిలో రీసర్వే ప్రారంభించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
[ 19-04-2024]
ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
జగన్ ఆటలు ఇక సాగవు..
[ 19-04-2024]
తెదేపా ఇంటింటి ప్రచారంలో భాగంగా కౌతాళం మండలం నందు బంటకుంటా గ్రామంలో ప్రతి ఇంటింటికీ వెళ్ళి జగన్ చేస్తున్న, అరాచకాలు, దోపిడి, దౌర్జన్యాలు, వివరిస్తూ, 2019లో కోడికత్తి, ఈసారి గులక రాయి అంటున్నాడని తెదేపా నేతలు పేర్కొన్నారు. -
ఇంటిఇంటికి తెలుగుదేశం
[ 19-04-2024]
ఇంటిఇంటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.రాఘవేంద్ర రెడ్డి, ఆయన సోదరులు రామకృష్ణ రెడ్డి, రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమకాంత్ రెడ్డి, మండల కన్వీనర్ బసలదొడ్డి ఈరన్న పాల్గొన్నారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
[ 19-04-2024]
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
ఉద్యోగుల సొమ్ము.. జగన్ వమ్ము
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్ ఉద్యోగుల వరకు 35 వేల మంది ఉన్నారు. ఆర్టీసీ, సచివాలయ ఉద్యోగులు కలిపితే 56 వేల మంది వరకు ఉన్నారు. వీరంతా గత ఐదేళ్ల జగన్ జమానాలో నరకం అనుభవించారు. -
అక్కా.. చెల్లెమ్మలకు జగనన్న బురిడీ
[ 19-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 80 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలుండగా.. అందులో 8 లక్షల మందికిపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. -
కదిలొచ్చిన పసుపు దళం
[ 19-04-2024]
చేనేత పురి పసుపుమయంగా మారింది.. ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరెడ్డి గురువారం నామపత్రాలు దాఖలు చేశారు. ఉదయం 11:30 గంటలకు ఒక సెట్ వేశారు. బీవీ జయనాగేశ్వరరెడ్డి 2, ఆయన సతీమణి నిత్యాదేవి 2 సెట్లు వేశారు. -
భద్రత పేరుతో ఆంక్షలు
[ 19-04-2024]
నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద పోలీసు శాఖ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు అందరికీ ఇబ్బందిగా మారాయి. కర్నూలు ఎంపీ, పాణ్యం ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కలెక్టరేట్లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
వైకాపా పాలనలో వలసలే మిగిలాయి
[ 19-04-2024]
పశ్చిమ ప్రాంతంలో కరవును తరిమేసేందుకు తెదేపా హయాంలో వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2వేల కోట్లు మంజూరు చేశారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. -
నీరింకిన జలాశయం.. నెరవేరని ఆశయం
[ 19-04-2024]
తాగు, సాగునీరు అందించాలనే ఆశయంతో నిర్మించిన జలాశయాలు కళతప్పాయి. జలం లేక వెలవెలబోతున్నాయి. పశ్చిమ పల్లెలు దాహంతో తల్లడిల్లుతున్నా.. చుక్క నీరు అందించలేని పరిస్థితి. -
మహిళా కార్పొరేటర్ ఇంటిపై దుండగుడి దాడి
[ 19-04-2024]
కర్నూలు నగరంలోని ఎల్కూరుబంగ్లాలో ఉంటున్న 41వ వార్డు కార్పొరేటర్ శ్వేతారెడ్డి ఇంటి వద్ద ఓ దుండుగుడు హల్చల్ చేశాడు. -
నగరాభివృద్ధికి కృషి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టీజీ భరత్ కోరారు. ఎస్.ఎ.పి. క్యాంపు వద్ద గురువారం 4వ విడత సైకిల్ భరోసాయాత్ర చేపట్టారు. -
భావోద్వేగానికి గురైన కోట్ల
[ 19-04-2024]
కోడుమూరు తనదైనప్పటికీ కర్నూలు వదిలివెళ్లడం ఎంతో బాధగా ఉందని, జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయతలు తనను కట్టిపడేస్తున్నాయంటూ మాజీ కేంద్ర మంత్రి, డోన్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోట జయసూర్యప్రకాశ్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. -
డివైడర్ను ఢీకొన్న ప్రైవేటు బస్సు
[ 19-04-2024]
ఓర్వకల్లు మండలం పూడిచెర్లమెట్ట వద్ద జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. -
ఉద్యోగుల పింఛన్.. జగన్ వంచించెన్
[ 19-04-2024]
పాత పింఛను విధానాన్నే అమలు చేయండి మహాప్రభో అంటున్నా.. తన మతం తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. తాను అధికారంలోకి వచ్చాక సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పింఛను స్కిమ్) రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించారు. -
అతివలకు సాయం.. అంతంతమాత్రం
[ 19-04-2024]
గతంలో ఓ వెలుగు వెలిగిన పొదుపు సంఘాలు, గ్రామైక్య సంఘాలు ప్రస్తుత వైకాపా పాలనలో నిర్వీర్యమవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోంది. -
కదంతొక్కిన పసుపు దళం
[ 19-04-2024]
శ్రీశైల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి గురువారం నామపత్రం దాఖలు చేశారు. ముందుగా నల్లకాల్వ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
[ 19-04-2024]
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
గడప.. గడపకు వెళ్లాల్సిందే
[ 19-04-2024]
వాలంటీర్లు వైకాపా తరఫున ప్రచారం చేయాల్సిందేనని ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. -
వైకాపాను భూ స్థాపితం చేయాలి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేయాలని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు తహసీల్దారు కార్యాలయంలో గురువారం ఆయన నామపత్రం దాఖలు చేశారు. -
ప్రచండ భానుడు
[ 19-04-2024]
పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భానుడి ధాటికి జనం అల్లాడిపోతున్నారు. నంద్యాల జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటేశాయి. -
తొలి రోజు 11 మంది నామపత్రాల దాఖలు
[ 19-04-2024]
కర్నూలు జిల్లా పరిధిలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన గురువారం విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ