అక్కడ నీడ.. ప్రయాణికులకు ఎండ
నగరంలో ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
మేయర్ క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాట్లు
నగరంలో ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఆయా కూడళ్లలో వాహనాలు నిలిచిన సమయంలో ఎండకు జనం అల్లాడుతున్నారు. ఇప్పటివరకు నగరంలో ఎక్కడా చలువ పందిళ్లు వేయలేదు. కొందరు ప్రజాప్రతినిధులపై మాత్రం నగరపాలక అధికారులు తమ స్వామిభక్తి చాటుతున్నారు. మేయర్ క్యాంపు కార్యాలయం వద్ద బయట ప్రాంతంలో చలువ పందిరి ఏర్పాటు చేశారు. దీనిని నగరపాలక అధికారులే సిద్ధం చేయించినట్లు తెలిసింది. అక్కడ పనిచేసిన కార్మికులను అడగ్గా నగరపాలక అధికారుల ఆదేశాలతోనే వేశారని చెప్పారు. ఇదే విషయాన్ని నగరపాలక ఇంజినీరింగ్ విభాగంలోని కొందరు అధికారులను వివరణ కోరగా నగరపాలక నిధులు వెచ్చించలేదని.. మేయర్ తన సొంత డబ్బులతో ఏర్పాటు చేయించుకున్నారేమో అని చెప్పడం గమనార్హం.
న్యూస్టుడే, కర్నూలు నగరపాలక సంస్థ
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Jerusalem: 22ఏళ్లు ‘కోమా’లోనే .. ఆత్మాహుతి దాడిలో గాయపడిన మహిళ మృతి
-
Politics News
Maharashtra: సీఎం ఏక్నాథ్ శిందేతో శరద్ పవార్ భేటీ.. రాజకీయ వర్గాల్లో చర్చ!
-
India News
Pune: పీఎంఓ అధికారినంటూ కోతలు.. నకిలీ ఐఏఎస్ అరెస్టు!
-
India News
New Parliament Building: నూతన పార్లమెంట్లో ఫౌకాల్ట్ పెండ్యులమ్.. దీని ప్రత్యేకత తెలుసా?
-
Movies News
Ajay: ‘డోంట్ టచ్’ అంటూ ఆమె నాపై కేకలు వేసింది: నటుడు అజయ్
-
India News
Fishermen: 200 మంది భారత జాలర్లకు పాక్ నుంచి విముక్తి!