వన్యప్రాణులకు నీటి కొరత లేదు
నల్లమలలో వన్యప్రాణుల సంరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టడంతో పులులతో పాటు ఇతర జంతువుల సంతతి పెరిగిందని ఆత్మకూరు డివిజన్ అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ అలెన్చాన్టెరాన్ చెప్పారు.
అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ అలెన్చాన్టెరాన్
అలెన్చాన్టెరాన్, డిప్యూటీ డైరెక్టర్
ఆత్మకూరు, న్యూస్టుడే : నల్లమలలో వన్యప్రాణుల సంరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టడంతో పులులతో పాటు ఇతర జంతువుల సంతతి పెరిగిందని ఆత్మకూరు డివిజన్ అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ అలెన్చాన్టెరాన్ చెప్పారు. పులులు పెరిగి పెద్దవయ్యే కొద్దీ తమకంటూ నిర్ధిష్ట సరిహద్దులను ఏర్పరుచుని వాటి పరిధిలోనే సంచరిస్తుంటాయని తెలిపారు. వాటి సంతతి పెరగడంతో కొన్ని అటవీ సమీప గ్రామాల పరిధిలోని పంట పొలాల్లో సంచరిస్తున్నాయన్నారు. వేసవిలో నల్లమలలో వన్యప్రాణులకు తగినన్ని జల వనరులు అందుబాటులో ఉన్నాయని, నీటికి ఎలాంటి కొరత లేదని చెప్పారు. ‘న్యూస్టుడే’ ముఖాముఖిలో పలు అంశాలు వివరించారు.
* నల్లమల అడవిలో వన్యప్రాణులకు తాగునీరు సమృద్ధిగా అందుబాటులో ఉంది. సహజసిద్ధమైన నీటి కుంటలు ఉన్నాయి. సిద్ధాపురం చెరువులో నీరు పుష్కలంగా ఉంది.
* ఈ ఏడాది ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో వన్యప్రాణులకు నీటి వసతి కల్పించేందుకు రూ.7 లక్షలు నిధులు మంజూరయ్యాయి. చెక్డ్యాంలు, సాసర్ ఫిట్లను ట్యాంకర్ల ద్వారా నింపుతున్నాం. ఉప్పు గడ్డలు ఏర్పాటు చేస్తున్నాం.
* నల్లమల పరిధిలో అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాం. పులుల సంతతి పెరగడంతో అవి దూర దూరంగా సంచరిస్తున్నాయి. ఎన్ఎస్టీఆర్ పరిధిలో 73, మన రాష్ట్రంలో 55 వరకు పులులు ఉన్నాయి. సమీప పంట పొలాల్లో గడ్డి ఉండటంతో నీరు, ఆహారం కోసం వన్యప్రాణులు ఇటువైపు వస్తున్నాయి. వాటిని వేటాడేందుకని పులులు గ్రామాలకు సమీపంగా వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మొక్కజొన్న పంటల సాగు పెరగడంతో అడవి పందులు అధికంగా వస్తున్నాయి.
* కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం సమీప అటవీ ప్రాంతంలో ఒక మగ, రెండు ఆడ పులులు సంచరించాయి. అక్కడ ఇటీవల గ్రామస్థులకు దొరికిన నాలుగు కూనలు టి108 ఆడపులికి పుట్టినవేనని కచ్చితంగా చెప్పలేం. రెండు ఆడపులుల్లో ఒకటి తెలంగాణ రాష్ట్రం ఆమ్రాబాద్ అభయారణ్యంలో తిరుగుతున్నట్లు తెలిసింది. కెమెరా ట్రాప్లో చిక్కిన టి108 పులి ఆ సమయంలో కడుపుతో ఉండటం, అది ఈ ప్రాంతంలో తిరగడంతో దాని పిల్లలే అయ్యుండొచ్చని భావించాం.
* అటవీ సమీప పంట పొలాల్లో పండ్ల తోటల సాగు పెరుగుతోంది. దీంతో పంట పొలాల్లో దొరికే ఆహారం కోసం ఎలుగుబంట్లు పొలాల వైపు వస్తున్నాయి. రైతులు వాటిని చూస్తే మాకు సమాచారం ఇవ్వాలి. వాటిని అడవిలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాను గెలిపిస్తే అర్హలందరికీ సంక్షేమ పథకాలు
[ 24-04-2024]
రాష్ట్రంలో తెదేపాను గెలిపిస్తే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి అన్నారు. -
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
[ 24-04-2024]
‘నా జీవితం నాశనం కావడానికి కారణం నువ్వే. మీ కుటుంబం నాకు అన్యాయం చేసింది’ అంటూ ఓ మహిళ నంద్యాల వైకాపా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి సతీమణి, కౌన్సిలర్ నాగినిరెడ్డిని నిలదీయడం తీవ్ర చర్చనీయాంశమైంది. -
కేసీ.. జగన్ నిర్లక్ష్యం చేసి
[ 24-04-2024]
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రగల్బాలు పలికిన జగన్ ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఐదువందలు కేటాయించలేదు.. కేసీ కాల్వకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూపాయి వెచ్చించలేదని శాసనసభా సాక్షిగా ‘కాగ్’ తేల్చింది.. -
గ్రామ స్వరాజ్యం.. జగనాసుర అరాచకం
[ 24-04-2024]
పంచాయతీ, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు స్థానిక ప్రభుత్వాలుగా వ్యవహరిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాల్సి ఉండగా వాటిపై జగన్ కుట్ర పన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం -
బలగం పెంచుకుని బరిలోకి!
[ 24-04-2024]
వైకాపాలో విభేదాలు... ఐదేళ్లుగా ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం.. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మల్చుకొని విజయం దిశగా వెళ్లాలని కోడుమూరు తెదేపా నేతలు వ్యూహాలకు పదునుపెట్టారు. -
డీసీసీబీ తాత్కాలిక సీఈవోపై వేటు
[ 24-04-2024]
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తాత్కాలిక ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) శివలీలపై వేటు పడింది. -
కోట్ల గూటికి పాత నేతలు
[ 24-04-2024]
ఇన్నాళ్లు పార్టీని ఉపయోగించుకొని వీడిన వారికి తాము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా రిటర్న్గిఫ్ట్ ఇస్తామని అధికారపార్టీ నేత హెచ్చరికలు ‘డోన్’ నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి.. -
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయం
[ 24-04-2024]
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయమని ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ అన్నారు. మండలంలోని తంగడరడోణ, తుర్వగల్లు, తొగలగల్లు, యాటకల్లు, కల్లపరి, చొక్కనహళ్లి, శంకరబండ తదితర గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగనన్న వెన్నుపోటు.. పల్లెల తిరుగుబాటు
[ 24-04-2024]
ప్రస్తుతం పల్లెలు కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్నాయి. జగన్ ప్రభుత్వం నిర్వాకంతో సమస్యలతో సతమతమవుతున్నాయి. కనీసం కుళాయి బిగించేందుకు కూడా చిల్లర లేని పరిస్థితి. కేంద్రం నుంచి వచ్చే నిధులను సైతం మళ్లించి.. -
పాణ్యం ఎన్నికల్లో ప్రముఖం
[ 24-04-2024]
పాణికేశ్వరస్వామి పేరుతో పాణ్యం గ్రామం ఏర్పడింది. కాలక్రమేణా నియోజకవర్గంగా మారింది. కర్నూలు, నంద్యాల మధ్య వారధిగా ఉన్న పాణ్యం నియోజకవర్గం అత్యంత కీలకం. జిల్లాలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం కావడం విశేషం. -
పుస్తక పుటలకు జగనన్న చెద
[ 24-04-2024]
గ్రంథాలయాల్లో పాఠకుల్ని సమస్యలు వేధిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. పాఠకులకు కొత్త పుస్తకాలు అందుబాటులో ఉండటం లేదు. -
కాటసాని ఆస్తులు రూ.75.19 కోట్లు
[ 24-04-2024]
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.75.19 కోట్లుగా చూపారు. సోమవారం నామినేషన్తోపాటు ఇచ్చిన అఫిడవిట్లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించిన రిటర్నింగ్ అధికారి నారపురెడ్డి మౌర్య వాటిని సవరించాలని సూచించారు. -
టీజీ భరత్ నామపత్రం దాఖలు
[ 24-04-2024]
కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి మంగళవారం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. తెదేపా అభ్యర్థి టీజీ భరత్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.