నేర వార్తలు
ఈనెల 14న అదృశ్యమైన నందికుంట గ్రామానికి చెందిన నిమ్మల వెంకటేశ్వర్లు (32) మృతదేహం గురువారం గ్రామ సమీపంలోని భవనాసి వాగులో లభ్యమైంది.
కూరగాయల చోరీకి వెళ్లి మృతి
నిమ్మల వెంకటేశ్వర్లు (పాతచిత్రం)
కొత్తపల్లి, న్యూస్టుడే : ఈనెల 14న అదృశ్యమైన నందికుంట గ్రామానికి చెందిన నిమ్మల వెంకటేశ్వర్లు (32) మృతదేహం గురువారం గ్రామ సమీపంలోని భవనాసి వాగులో లభ్యమైంది. ఆత్మకూరు సీఐ సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల మేరకు.. తన భర్త కనిపించడం లేదంటూ అతని భార్య శివమ్మ ఈనెల 17న కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఎస్సై ముబీన్తాజ్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఈనెల 14న రాత్రి పాలెంచెరువు గూడేనికి చెందిన కొంతమంది తన భర్తకు ఫోన్చేసి పిలిచారంటూ భార్య ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. పాలెంచెరువుకు గూడేనికి చెందిన లింగన్న, అంకమ్మ, లక్ష్మిని విచారించగా.. వెంకటేశ్వర్లుతో కలిసి ఆ రోజు రాత్రి నందికుంట సమీపంలోని పొలాల్లో కూరగాయలు తెచ్చుకునేందుకు వెళ్లినట్లు చెప్పారు. ఆ పొలానికి కాపలాదారు అడవి పందులు రాకుండా ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగలు తగలడంతో వెంకటేశ్వర్లు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడని వెల్లడించారు. మంటలు రావడంతో తాము భయంతో పరారైనట్లు వివరించారు. పొలం కాపలాదారు దుర్గారావు మరికొందరితో కలిసి మృతదేహాన్ని వాగులో పడేశారని సీఐ వివరించారు. ఆరోజు నుంచి కనిపించకుండాపోయిన దుర్గారావును గురువారం అదుపులోకి తీసుకుని విచారించగా భవనాసి వాగులో వెంకటేశ్వర్లు మృతదేహాన్ని చూపాడని చెప్పారు. దుర్గారావుపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తమ భర్తను పాలెంచెరువు గూడెం వాసులు హత్య చేసుంటారని మృతుడి భార్య శివమ్మ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దిశగా పోలీసులు విచారించాలని కోరుతున్నారు.
ఉరేసుకుని రైతు బలవన్మరణం
మహేశ్ (పాత చిత్రం)
యల్లావత్తుల (రుద్రవరం), న్యూస్టుడే: మండలంలోని యల్లావత్తుల గ్రామానికి చెందిన మహేశ్ (32) అనే రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై నిరంజన్రెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు.. మహేశ్ తన తండ్రి శివశంకర్కు చెందిన 10 ఎకరాల పొలంతోపాటు మరో 4 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని మినుము, వరి, మొక్కజొన్న పంటలు సాగు చేశారన్నారు. పంటల సాగుకు రూ.6.80 లక్షలు అప్పు చేశారన్నారు. పది రోజుల కిందట వచ్చిన వడగళ్ల వానకు పంటంతా నాశనం అయ్యిందన్నారు. పంట చేతికి రాకపోవడంతో అప్పులు ఎలా కట్టాలంలూ బాధపడుతూ బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పంకాకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. మృతదేహాన్ని పరిశీలించి తండ్రి శివశంకర్ ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మహేశ్కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భార్య శ్రావణి అనారోగ్యంతో 9 నెలల కింద మృతి చెందిందన్నారు.
పోలీసుల అదుపులో నకిలీ నోట్ల ముఠా
నంద్యాల నేరవిభాగం, న్యూస్టుడే : నకిలీ నోట్లు చెలామణికి పాల్పడుతున్న ముఠాను నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జమ్మలమడుగుకు చెందిన దస్తగిరికి విశాఖపట్నం, వైఎస్సార్ జిల్లాలకు చెందిన ముఠా సభ్యులు ఫోన్చేసి రూ.10 లక్షలు ఇస్తే రూ.30 లక్షలు ఇస్తామని నమ్మబలికారు. డబ్బు తీసుకుని నంద్యాలకు రమ్మని పిలిచారు. గురువారం డబ్బు తీసుకుని వచ్చిన దస్తగిరిని ముఠా సభ్యులు కారులోకి ఎక్కించుకుని నంద్యాల పట్టణ శివారుకు తీసుకెళ్లారు. పీవీ నగర్ సమీపంలో డబ్బు లాక్కొని దస్తగిరిని కొట్టి కారులో పరారయ్యారు. బాధితుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అప్రమత్తమై గడివేముల వైపు వెళుతున్న కారును గుర్తించారు. గడివేముల పోలీసులను అప్రమత్తం చేయడంతో వారు కారును అడ్డగించి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని నంద్యాల డీఎస్పీ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం. వారి నుంచి నగదు స్వాధీనం చేసుకుని కారును సీజ్ చేసినట్లు తెలిసింది. డీఎస్పీ ఆధ్వర్యంలో నిందితులను విచారిస్తున్నట్లు సమాచారం.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
గోనెగండ్ల, న్యూస్టుడే: గోనెగండ్ల మండలం ఎస్.లింగందిన్నె గ్రామశివారులోని బళ్లారి-పత్తికొండ రహదారిలో జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. ఎస్సై తిమ్మారెడ్డి కథనం ప్రకారం.. కోడుమూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన షేక్ జానీబాషా(21) దేవనకొండ మండలంలోని బండపల్లి గ్రామంలో జరుగుతున్న దేవరకు తండ్రి షేక్ మహబూబ్బాషాతో కలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. దేవర ముగించుకొని తండ్రి, కుమారుడు స్వగ్రామానికి బయలుదేరారు. మార్గం మధ్యలోప్రధాన రోడ్డులో ఓ కారు అతివేగంతో వారి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. తలకు తీవ్రగాయమైన జానీబాషా అక్కడిక్కడే మృతి చెందగా, మహబూబ్బాషా తీవ్రంగా గాయపడ్డారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పశ్చిమాన జగన్ పచ్చి మోసం
[ 29-03-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 19 మండలాలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి. ఆయా మండలాల్లో 4,84,619.2 హెక్టార్ల (82.05 శాతం) సాగు భూమి విస్తరించి ఉంది. -
జగనన్నా..కరవు సీమ కష్టాలు చూడవా
[ 29-03-2024]
కనిపించలేదా కరవు రైతు వేదన.. వినిపించలేదా పశ్చిమ పల్లెల కన్నీటి రోదన. పొలాలు బీడుబారాయి.. ఊరిలో పనులు కరవయ్యాయి.. ఇళ్లకు తాళాలు పడ్డాయి.. -
వసతిగృహాల్లో ఆకలికేకలు
[ 29-03-2024]
విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, మామయ్యలా అండగా వారికి ఉంటానని ఎక్కడికక్కడ ఊదరగొట్టే ప్రసంగాలతో అదరగొట్టే జగన్ పిల్లలకు భోజనాన్ని అందించే వార్డు సంరక్షకుల సమస్యల్ని కూడా పట్టించుకోవడం లేదు -
ప్రయాణికులకు పరీక్ష
[ 29-03-2024]
బస్సులన్నీ మేమంతా సిద్ధం సభకు తరలివెళ్లాయి. ఆర్టీసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి వైకాపా వారు అడిగింతే తడవుగా బస్సులన్నింటినీ మళ్లించారు -
ముఖ్యమంత్రి జగన్రెడ్డి క్షమాపణలు చెప్పి పర్యటించండి
[ 29-03-2024]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని, తెదేపా హయాంలో రూ.2 వేల కోట్లతో మంజూరు చేసిన ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టు పనులకు పైసా నిధులు ఇవ్వని ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పి పర్యటించాలని ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం
[ 29-03-2024]
తాము 40 ఏళ్లుగా రాజకీయాలకతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నామని, 20 రోజుల ముందు వచ్చిన ఓ వ్యక్తి ప్రజలకు సేవ చేస్తామని.. ఓటేయండి అని అంటున్నారని.. ఆ మాటలు నమ్మొద్దని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్ కోరారు. -
తెదేపాను గెలిపించుకుందాం
[ 29-03-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపాను గెలిపించుకుందామని మాజీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు. కల్లూరు మండల పరిధి పర్ల గ్రామంలో గురువారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు -
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత జగన్మోహన్రెడ్డిదే
[ 29-03-2024]
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిదేనని మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు