logo

వామ్మో.. డెమో

కర్నూలు నుంచి గుంతకల్లుకు వెళ్లే డెమో ప్యాసింజర్‌ రైలు గురువారం చాలా ఆలస్యంగా నడిచింది. వందేభారత్‌ రైలు నడిపేందుకుగాను కర్నూలు-డోన్‌ మధ్యలో ఉన్న రైల్వేస్టేషన్ల పరిధిలో మరమ్మతులు చేపడుతున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.

Published : 31 Mar 2023 02:18 IST

మూడు గంటలకుపైగా ఆలస్యం
విసిగిపోయిన ప్రయాణికులు

రైల్వేస్టేషన్‌లో ఒకటో ప్లాట్‌ఫాంలో డెమో రైలు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు

డోన్‌ పట్టణం, న్యూస్‌టుడే: కర్నూలు నుంచి గుంతకల్లుకు వెళ్లే డెమో ప్యాసింజర్‌ రైలు గురువారం చాలా ఆలస్యంగా నడిచింది. వందేభారత్‌ రైలు నడిపేందుకుగాను కర్నూలు-డోన్‌ మధ్యలో ఉన్న రైల్వేస్టేషన్ల పరిధిలో మరమ్మతులు చేపడుతున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్యాసింజర్‌ రైలు చాలా ఆలస్యంగా నడిపినట్లు తెలుస్తోంది. ఉదయం 9:30 గంటలకు కర్నూలులో బయల్దేరి డోన్‌ రైల్వేస్టేషన్‌కు ఉదయం 10:40 గంటలకు రావాల్సి ఉండగా మధ్యాహ్నం 1:56 గంటలకు వచ్చింది.  రైలు రాకపోకలకు సంబంధించిన సమాచారం తెలియక ప్రయాణికులు అయోమయంలో పడిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని