దిగువ కాలువ రైతుల దిగాలు
పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించే తుంగభద్ర కాలువల్లో నీటి మట్టం తగ్గడం రైతులను కలవరపరుస్తోంది.
దిగువ కాలువలో తగ్గిన నీటిమట్టం
పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించే తుంగభద్ర కాలువల్లో నీటి మట్టం తగ్గడం రైతులను కలవరపరుస్తోంది. జలాశయంలో నీళ్లు సమృద్ధిగా ఉండటంతో రెండో పంటపై రైతులు ఆళ పెట్టుకున్నారు. ఎక్కువగా వరి సాగు చేశారు. దిగువ కాలువలో ప్రస్తుతం నీటినిల్వలు తగ్గుముఖం పట్టడం.. పంట కీలకదశలో ఉండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. పాలకులు స్పందించి కాలువల్లో నీటి సరఫరా సామర్థ్యాన్ని పెంచాలని విన్నవిస్తున్నారు.
న్యూస్టుడే, హొళగుంద, హాలహర్వి
గింజ గట్టిపడే దశలో పంట
ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల పరిధిలో పలు గ్రామాల మీదుగా దిగువ కాలువ వెళ్తోంది. రబీలో ఒక లక్ష ఎకరాలకు సాగునీరు, వందకు గ్రామాలకుపైగా తాగునీరు అందిస్తోంది. ఆయకట్టు పరిధిలో 70 శాతం వరి పంట సాగు చేస్తుంటారు. ప్రస్తుతం 60 శాతం పంట గింజదశలో ఉంది. మిగిలిన 40 శాతం పొట్ట, కంకిదశలో ఉంది. ఈ సమయంలో పంటకు సమృద్ధిగా నీరు అందాలి. లేదంటే గింజలు తాలు పోయే అవకాశం ఉంది. గత రెండ్రోజులుగా దిగువ కాలువలో నీటిమట్టం తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్లో భారీ వర్షాలకు వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. రబీలోనైనా దిగుబడి వస్తుందన్న ఆశలో రైతులు ఉన్నారు. ఈ దశలో నీరు తగ్గడం వారిని ఆందోళనకు గురి చేస్తోంది.
నీటి వాటాకు కోత
* గతనెల 31వ తేదీ నాటికే కర్ణాటక వాటా అయిపోవడంతో నీటిమట్టం తగ్గించారు. ఏపీ వాటాకు తగినట్లుగా కర్ణాటకకు నీరు అందించాలని అక్కడి అధికారుల టీబీ బోర్డుకు మరోసారి ప్రతిపాదనలు పెట్టడంతో నీటిమట్టం పెంచారు. ఒకటి, రెండు రోజుల్లో నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే కర్నూలు జిల్లాలో పంటలకు నీరు అందించడం కష్టమవుతుందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగువకాల్వకు ఈనెల 10వ తేదీ వరకు నీరు అందిస్తామని బోర్డు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న నీటిమట్టం పెంచితేనే పంటలు గట్టెక్కుతాయని రైతులు పేర్కొంటున్నారు.
* ఏపీ వాటా కిందనిత్యం 700 క్యూసెక్కులు రావాలి.. 500 క్యూసెక్కులకు మించి రావడం లేదు. దీనిపై జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
* టీబీ డ్యాంలో ప్రస్తుత నీటి మట్టం : 1585.38 అడుగులు
* నీటినిల్వ: 7.58 టీఎంసీలు
* అవుట్ ఫ్లో: 5,593 క్యూసెక్కులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల భేరి.. ప్రచార వే‘ఢీ’
[ 18-04-2024]
రెండు ఎంపీ స్థానాలు.. 14 అసెంబ్లీ స్థానాలున్న ఉమ్మడి జిల్లాలో గురువారం నుంచి రాజకీయం మరింత వే‘ఢీ’రాజుకోనుంది.. ఈ నెల 18 నుంచి ఈనెల 25 వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. -
జనం గుండెల్లో జగన్ విల్లం‘భూ’
[ 18-04-2024]
ప్రాజెక్టులు నిర్మించలేదు.. పరిశ్రమలు ఏర్పాటు లేదు.. రోడ్లు లేవు.. పల్లె మొదలు పట్టణం వరకు ప్ర‘గతి’ తప్పింది. ఫలితంగా స్థిరాస్తి రంగం కుప్పకూలింది. -
ఎమ్మెల్యే వస్తున్నారని.. ఉపాధి పనులు బంద్
[ 18-04-2024]
ఆదోని మండలం అరేకల్లో బుధవారం ఉపాధి పనులు చేపట్టలేదు. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని, ఉపాధి పనులు బంద్ చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మాటకారి మామయ్యా.. ‘దీవెన’లేవయ్య
[ 18-04-2024]
తల్లిదండ్రులు మీ పిల్లల్ని పాఠశాలలు, కళాశాలలకు పంపండి.. వారిని చదివించే బాధ్యత నేనే తీసుకుంటా’’ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అమ్మఒడి పథకం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తున్నాం. -
నిలువెల్లా గాయాలు.. నీళ్లు పారని కాల్వలు
[ 18-04-2024]
‘మాది రైతు ప్రభుత్వం.. పంటలు ఎండనీయం.. అన్నదాతల కంట నీరు రానీయం’ అని ఎన్నోసార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రసంగాలు ఊదరగొట్టారు. తీరా చూస్తే.. పంట కాల్వలు దయనీయంగా మారాయి. -
ఓట్ల ఆట!
[ 18-04-2024]
ఆటైనా.. ఓటైనా ప్రజలకు ఆసక్తికరమైన అంశాలే. ఉత్కంఠ రేకిత్తించే విషయాలే. తరచి చూస్తే ఈ రెండింటి మధ్య పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ఎక్కడ నలుగురు కలిసినా.. వీటికి సంబంధించిన విషయాలపైనే చర్చ కొనసాగుతోంది. -
పోలింగ్ శాతం పెంచేలా చర్యలు
[ 18-04-2024]
విధి నిర్వహణలో భాగంగా అధికారులు, ఉద్యోగులు నిబంధనలు పాటించాల్సిందేనని.. ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని కలెక్టర్ జి.సృజన అన్నారు. -
జగన్ మామయ్య దీవెనా.. అంతా మాయ
[ 18-04-2024]
విద్యార్థులకు ఆర్థిక సాయం, చదువుకు తోడ్పాడు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు వారికి ఖాళీ చేతులే చూపుతోంది. విద్యాభ్యాసానికి ఆటంకంగా మారింది. జగన్ చెప్పిన మాటలు నమ్మి ఉన్నత చదువులు చదువుదామని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది. -
సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధి చెప్పండి
[ 18-04-2024]
సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ‘ప్రజాగళం’లో భాగంగా పట్టణంలోని బీసీ కాలనీలో ఆయన పర్యటించారు. -
రహదారుల బాగుకు చర్యలు : బుగ్గన
[ 18-04-2024]
వైకాపా వెన్నుపోటుదారులకు, అవాకులు చవాకులు మాట్లాడే వారికి ఎన్నికల తర్వాత కోలుకోలేని విధంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. -
కర్నూలు నియోజకవర్గం చుట్టూ మూడు చెక్పోస్టులు
[ 18-04-2024]
కర్నూలు నియోజకవర్గం చుట్టూ 24 గంటలు నిఘా ఉంచేందుకు మూడు స్టాటస్టికల్ సరైలైన్స్ టీమ్లతో కూడిన చెక్పోస్టులను ఏర్పాటుచేస్తూ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల అధికారి, కర్నూలు నగరపాలకసంస్థ కమిషనర్ భార్గవ్తేజ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
నామినేషన్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకానుంది. -
వైకాపా అంతర్గత వైరం.. బహిరంగం
[ 18-04-2024]
వైకాపా అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. బలనిరూపణ, సామాజికవర్గంలో పెత్తనం, గ్రామాలు, మండలాల్లో ఆధిపత్యం చెలాయించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ విభేదాలు బహిర్గతమవుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
-
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
-
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..
-
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియ శ్రీనేత్
-
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం