logo

బడిలో ఆసరా.. చదువులకు ఆటంకం

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని పురపాలక మైదానంలో శనివారం వైఎస్‌ఆర్‌ ఆసరా కార్యక్రమం నిర్వహించారు.

Published : 02 Apr 2023 02:49 IST

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని పురపాలక మైదానంలో శనివారం వైఎస్‌ఆర్‌ ఆసరా కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని ముప్పై వార్డులకు సంబంధించి ఆసరా చెక్కుల పంపిణీ సభను మైదానంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ డా.మధుసూదన్‌, పురపాలక అధికారులు పాల్గొన్నారు. మైదానంలో పురపాలక ఉన్నత పాఠశాలతోపాటు పురపాలక నెహ్రూ స్మారక ఉన్నత పాఠశాలలున్నాయి. రెండు బడుల్లో సుమారు 3-4 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పరీక్షల వేళ ఈ కార్యక్రమ నిర్వహణతో తరగతులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీనిపట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

న్యూస్‌టుడే, ఆదోని మార్కెట్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని