logo

భాజపా నిరసన ప్రదర్శన

అమరావతి రైతులకు సంఘీభావం తెలిపి తిరిగి వస్తున్న భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్థసారథిపై వైకాపా వారు దాడి చేయడం దారుణమని భాజపా జిల్లా అధ్యక్షుడు పొలంకి రామస్వామి, ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా.పార్థసారథి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమౌళి అన్నారు.

Published : 02 Apr 2023 02:49 IST

ప్రదర్శనగా వస్తున్న నాయకులు, కార్యకర్తలు

కర్నూలు ఎన్టీఆర్‌ సర్కిల్‌ (బి.క్యాంపు), న్యూస్‌టుడే: అమరావతి రైతులకు సంఘీభావం తెలిపి తిరిగి వస్తున్న భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్థసారథిపై వైకాపా వారు దాడి చేయడం దారుణమని భాజపా జిల్లా అధ్యక్షుడు పొలంకి రామస్వామి, ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా.పార్థసారథి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమౌళి అన్నారు. భాజపా నాయకులపై దాడిని నిరసిస్తూ కలెక్టరేట్‌ వద్ద శనివారం ధర్నా చేశారు. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అంతకుముందు పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి రైతులకు మద్దతుగా నిలుస్తున్నారన్న ఉద్దేశంతో ఎంపీ నందిగామ సురేష్‌ అనుచరులు దాడి చేశారన్నారు.  అనంతరం కలెక్టర్‌ పి.కోటేశ్వరరావుకు వినతిపత్రం అందించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు కాళింగి నరసింహవర్మ, అంబలి కాశీవిశ్వనాథ్‌, ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమ్‌కుమార్‌, జిల్లా ఉపాధ్యక్షుడు నగురూరు రాఘవేంద్ర, వెంకటహరి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మాలతి, జిల్లా కార్యదర్శి సూర్యకుమార్‌   పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని